డా.కె.జానకిగారిRole of women infreedom struggle in Andhra Pradesh
గుడివాడ కిచెందిన గోనుగుంట్ల లక్ష్మీనరసమ్మ భర్త వెంకట సుబ్రమణ్యగుప్త.కొడుకుకూడా జైలుకెళ్లాడు.గుడివాడ మున్సిపల్ కౌన్సిలర్ గా,హరిజన బాలికల హాస్టల్ నడిపారామె.ఎర్నేని లీలావతి భర్త సాధుసుబ్రమణ్యం కొమరవోలు గాంధీ ఆశ్రమాన్ని నెలకొల్పారు.2ఏళ్లు వార్ధాలో శిక్షణ పొందిన ఆమె మరాఠీ హిందీలో దిట్ట. ఆమె 80ఏళ్ల అత్తగారు,ప్రఫుల్లకుమారి అనే పసిపాప తో జైలుశిక్ష అనుభవించిన మహిళ.అరికెపూడి మహాలక్ష్మమ్మ భర్త రామస్వామి అంగలూర్ వాసి.నాదెండ్ల మహలక్షమ్మ 1900 భర్త అప్పయ్య. ఘంటా మల్లికాంబ భర్త వీరరాఘవయ్య (అంకన్న గూడెం)1911లో పుట్టిన ఈమె 9నెలలబిడ్డతో జైలుశిక్ష అనుభవించారు.కోటగిరి మంగతాయారమ్మ సొబ్బాల నివాసి(తిరువూరుతాలూకా)అరికెపూడి మాణిక్యాంబ 1870 పుట్టిన ఈమె భర్త బ్రహ్మయ్య 1930లో తన కొడుకు కూతురుతో జైలుశిక్ష అనుభవించిన ఆమె1948లో చనిపోయారు.కన్నెగంటి నాగరత్నమ్మ భర్త సుబ్బయ్య తమిరిశ నివాసి.1908లోపుట్టారామె.నాదెండ్ల నాంచారమ్మ తండ్రి అప్పయ్య ముదునూరువాసి.11వ ఏట తల్లితోకల్సి ఉద్యమంలో పాల్గొన్నది.పొట్లూరి పున్నమ్మ 1900 చిగురుపాటిశేషయ్యదంపతులకు పుట్టింది.భర్త పేరయ్య పేరయ్యజమిగొల్వపల్లి నివాసి.ఎక్కాలపున్నమ్మకృష్ణాజిల్లావాసి.గుడివాడ కిచెందిన పూర్ణతిలకం భర్త రామకోటయ్య.గాదిరెడ్డి పుట్లమ్మ 1911లోపుట్టిన ఆమెభర్త రాఘవరెడ్డి(నందివాడ) కోగంటి రాఘవమ్మ (పమిడిముక్కల)రామినేని రాజమ్మ తండ్రిపొట్లూరి వెంకయ్య. (గరికపర్రు).కానూరి రాజ్యలక్ష్మమ్మ భర్త వెంకట సుబ్బారావు(బేతపూడి)19మే 1973లో చనిపోయినది.గుత్తికొండ రామమ్మ పమిడిముక్కల నివాసి.భర్త బ్రహ్మయ్య. పంచాంగం రామానుజమ్మభర్త కృష్ణ మాచార్యులు. ఆమె1జులై 1900 ముక్తిపల్లి అగ్రహారంలో పుట్టింది.పెనుమెత్స రత్నమ్మ కృష్ణ జిల్లావాసి. యార్లగడ్డ రత్తమ్మ పురిటిగడ్డనివాసి. కాట్రగడ్డరామసీతమ్మ1883లో మందపంలో పుట్టింది.అమ్మ నాన్నలునూతక్కి నాగమ్మ కొండయ్య. బాలవితంతువు.కాట్రగడ్డమధుసూధనరావు ఆమె పెంపుడు కొడుకు.ఆమె రెండుసార్లు తనకున్న బంగారాన్ని గాంధీకి సమర్పించినది.ఆమె ఫైన్ కట్టలేదని ఇంట్లోఉన్న వస్తువులన్నీ వేలంవేసింది ఆనాటి ప్రభుత్వం.పక్షవాతం తో బాధపడుతున్న ఆమెని జైలునుంచి విడుదల చేయలేదు.4సెప్టెంబర్ 1973లో చనిపోయింది.అన్నె రమణమ్మ కృష్ణాజిల్లావాసి.కొడుకుఅంజయ్య ప్రసిద్ధ స్వాతంత్య్ర పోరాట యోధుడు.నాదెళ్ల రంగమ్మ భర్త బ్రహ్మయ్య. ఆమె 26 ఏప్రిల్ 1973 లో చనిపోయింది.గొర్రెపాటి సరస్వతమ్మ1908లో వేమూరి సుబ్బయ్య దంపతులకు పుట్టినది.భర్త సుబ్బయ్య.తుమ్మల సత్యవతమ్మ 1902లో తమిరిశ లో పుట్టారు.భర్త రామకృష్ణయ్య (ముదునూరు)పోలీసులు ఆమెపై రంగునీరు చల్లి అన్నం పెట్టకుండా ఎర్రని ఎండలో ఉంచారు.ఎలమంచిలి సత్యవతమ్మ (కృష్ణాజిల్లా) గుత్తికొండ సీతమ్మ భర్త అచ్చయ్య(చినకళ్లెపల్లి)కొల్లిపర సీతమ్మ 19అక్టోబర్ 1902లోపుట్టింది.తండ్రి దామినేని అక్కయ్య, భర్త వెంకయ్య. వారణాసి సీతమ్మ (కృష్ణాజిల్లా)వీరమాచనేని సీతమ్మ (ముదునూరు)నూతక్కి సీతారామమ్మ 1914లో పుట్టారు.భర్త గోపాలకృష్ణయ్య (కొమరవోలు)జైల్లోనే శిశువును కన్న ఆమె శిశువువిడుదలైనాక 1934లో చనిపోయారు.చెరుకూరిసౌభాగ్యమ్మ జామిగొల్వెపల్లికి చెందిన కంటమనేని లక్ష్మయ్య కూతురు.భర్త బాపయ్య. మైనేని సీతారామాయమ్మ భర్త వెంకట సుబ్బయ్య. పసిపాప తో జైలుశిక్ష అనుభవించిన మగువ. వల్లభనేని శ్రీరంగనాయకమ్మదేవి భర్త కాశీవిశ్వనాధం కవి.గాదె సుబ్బమ్మ 20ఆగస్టు 1908లో యాకముర్రులోపుట్టింది. భర్త సూరారెడ్డి. పెరంబుదూరిసుభద్రమ్మ1912లో పుట్టినది.తండ్రి మామిళ్లపల్లి రామానుజాచార్యులు. భర్త బుచ్చయ్యచార్యులు. మద్రాస్ సేవాసదన్ లో ఆమెసూపరింటెండెంట్ గాపనిచేసింది.జైల్లో ఉండేచదివి 1932లో పట్టాపొందింది.అరికెపూడి సుగుణమణి 1921లో పుట్టింది.తండ్రి బ్రహ్మయ్య. తల్లి మాణిక్యమ్మ చెల్లి కౌసల్య కూడా జైలుశిక్ష అనుభవించారు.11ఏళ్ల పిల్ల గా 1932లో పోలీసుల బెదిరింపులకు జడవక ఉద్యమంలో పాల్గొని మద్రాస్ బోస్టల్ స్కూల్లో ఉంచబడింది. పానూరి సుందరమ్మ నందివాడకి చెందిన వెంకటరెడ్డిభార్య. 1960లో చనిపోయినది🌷

addComments
కామెంట్ను పోస్ట్ చేయండి