మరుగున పడిన మగువలు 59: - అనువాదం...అచ్యుతుని రాజ్యశ్రీ
 డా.కె.జానకిగారిRole of women infreedom struggle in Andhra Pradesh
విమలాబాయి మేల్కొటే Vimalabai Melkote  1910లో ఔరంగాబాద్ లో జన్మించారు.కన్నడ మాతృభాష. భర్త డా.జి.ఎస్.మేల్కొటే. అత్తింటి వాతావరణం,భర్త ప్రోత్సాహంతో  పికెటింగ్, ఖాదీ ప్రచారం,హరిజనసేవ చేశారామె.ఆమె ఇల్లు రాజకీయాలకు,కాంగ్రెస్ ఆఫీస్ కి కేంద్రం.కర్ణాటక మహిళా మండలిలో చురుకైన పాత్ర పోషించారు.తన 16ఏళ్ల వితంతు సోదరి కమలారావు, ఆడపడుచు వనమాలితో  విక్టరీ ప్లేగ్రౌండ్స్ లో గాంధీజీ పుట్టిన రోజు వేడుకలు జరిపిందామె. అంతా అరెస్టయి కృష్ణ ప్రసాద్ దేవిడీలో 15రోజులున్నారు.నీరు గాలిలేని ఇరుకు సెల్ లో ఇంటివంటమనిషి భోజనం తినేవారు. ఆమె ఇంటిని పోలీసులు సోదా చేస్తుంటే రహస్య పత్రాలను ఆమె సోఫాల్లో, గోధుమ బస్తాల్లో దాచేది. 5సెప్టెంబర్ 1947లో సెంట్రల్ జైల్లో కమ్యూనిస్టు మహిళలతో ఉంది.30నవంబర్ 1947లో విడుదలైంది.ఆమె 14ఏళ్ల కొడుకు  రహస్య పత్రాలతో ఉంటే లాఠీచార్జిచేశారుపోలీసులు ఆచిన్నారిపై! ఆమె సోదరుడు రాజగోపాల్ అండర్ గ్రౌండ్ వర్కర్ గా చురుగ్గా ఉండేవాడు.అతన్ని చాకచక్యంగా పోలీసుల బారినుంచి తప్పించేది. అచ్యుత్ పట్వర్ధన్, అరుణ అసఫాలీ జైలునించి తప్పించుకుని 3నెలలు ఆమె ఇంట్లో ఉన్నారు.ఓసారి విమల కదిలే రైలు ఇంజన్ డ్రైవర్ని బతిమాలి మిలటరీ బోగీలోకి ఎక్కి ఆపై ఫస్ట్ క్లాస్  లోకి చేరింది.భర్త అండర్ గ్రౌండ్ లో ఉంటే పిల్లల తో ఒంటరి రాజకీయ పోరాటం చేసింది.హైదరాబాద్ స్టేట్ సోషల్ వెల్ఫేర్ ఎడ్వైజరీబోర్డ్ ఛైర్మన్ గా,ఫామిలీ ప్లానింగ్ ప్రెసిడెంట్ గా,ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డ్ మెంబర్ గా,వైస్ ప్రెసిడెంట్ అఖిల కర్ణాటక  పరిషత్ రిసెప్షన్ కమిటీలో చురుకైన పాత్ర పోషించారు.తామ్రపత్రగ్రహీత.నందగిరి ఇందిరాదేవి తండ్రి వడ్లకొండ నర్సింహ్మారావు. భర్త వెంకట్రావు,రచయిత. ఆమె తెలుగుబడిలో(మాడపాటి )చదివి, స్కూల్ ఫైనల్ పరీక్షలు  కార్వే యూనివర్శిటీలో FYA, SYA,GA(ఫస్ట్ ఇయర్,సెకండ్ ఇయర్, గ్రాడ్యుయేట్ ఇన్ ఆర్ట్స్(గృహితగమ) చదివారు.విద్యార్ధినిగా ఉపన్యాసాలతో అదరగొట్టేవారు. బాల్యవివాహాలు ,స్త్రీలవిద్య సమస్యల్ని విపులంగా చర్చించేవారు.1937లో నిజామాబాద్ ఆంధ్ర మహిళాసభ  కి అధ్యక్షత వహించారు.రజాకార్ల   ఆగడాలప్పుడు భర్త  అండర్ గ్రౌండ్ లో ఉండి అరెస్టయిన ప్పుడు ఆమెపడిన  అష్టకష్టాలు అన్నీ ఇన్నీ కావు.ఆమె విజయవాడ వెళ్లిపోయి  పోలీస్ యాక్షన్ తర్వాత తిరిగొచ్చారు.ఆమె హాస్య కథలు రాస్తే భర్త విషాద కథలు రాయటం  ఓ విశేషం.బూర్గుల అనంత లక్ష్మీదేవిభర్త ప్రముఖ రాజకీయ వేత్త రామకృష్ణారావుగారు. ఈమె రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాల్గొనలేకపోయినా ఆంధ్ర మహిళాసభ మీటింగ్స్ కి హాజరవటం,షాద్ నగర్ సభకి అధ్యక్షత వహించటం జరిగింది.ఆంధ్ర యువతీమండలికి పునాది వేసిన వారిలో ఈమె ఒకరు.15ఏళ్ల

అనుబంధంతో భూమి విరాళాలకోసం శ్రమించారు.నేడు సంస్థ బిల్డింగ్స్ తో విద్యాసంస్థ గా విరబూసింది. భర్త సోదరులు రాజకీయాల్లో పాల్గొన్నప్పుడు ప్రోత్సాహించిన మగువ. సోదరులు మందుముల నర్సింగరావు,రామచంద్రరావు.రాజకీయంగా కాక సోషల్ వర్కర్ గా ఆమె ఆదర్శ వనిత ప్రమీలా మహేంద్ర ను అంతా ప్రమీల తాయి అని పిల్చేవారు.బన్సీలాల్ బాలికాపాఠశాల హెచ్.ఎం. ఆర్యసమాజ్ అభిమాని.సైకిల్ తొక్కుతూ మహిళలకు ప్రేరణ ఇచ్చారామె. కమ్యూనిస్టు పార్టీవైపు ఆకర్షితురాలైన ఆమెసంఘంలో కుళ్లును స్త్రీల దీనహీనస్థితిని పోగొట్టాలని కంకణం కట్టుకుని పార్టీ, భాషతోసంబంధంలేకుండా  నిజాంకి వ్యతిరేక ఉద్యమంలో బాసటగా  నిలిచింది.రాత్రిస్కూల్ నడిపి,బీదలకు రేషన్ సరిగ్గా అందేలా చూసింది.పోలీస్ యాక్షన్ దాకా అండర్ గ్రౌండ్ లో పని చేసిందామె.1951లో అరెస్టయి1952లో ఎలక్షన్స్ ముందు విడుదలైంది.ఆమె మహారాష్ట్రియన్, జాబ్ కోసం హైదరాబాద్ వచ్చి తోటి కమ్యూనిస్టు మహేంద్ర ను పెళ్లాడింది.ఓ అనాధాశ్రమంలో పెరిగిందామె. బడిలో ఆంగ్లవిద్య లేదు.మెట్రిక్ చదివి హెచ్.ఎం.గా క్రమంగా ఎకడమిక్ క్వాలిఫికేషన్స్ తో ఎదిగింది.ఖద్దరు ధారణ,వాగ్ధాటితో చొచ్చుకుపోయే స్వభావం ఆమెది.కాఫీ,టీ అస్సలు ముట్టేదికాదు. 1967లో బెర్లిన్ లో జరిగిన వరల్డ్ ఉమెన్స్ ఆర్గనైజేషన్ కిభారత ప్రతినిధిగా హాజరైంది.స్త్రీల కోసం కోఆపరేటివ్ సొసైటీలు నెల కొల్పింది. వయోజనవిద్య కుట్టు తో ఉపాధి అవకాశాలు కల్పించింది.1997లో ఆమె మరణించారు🌷
కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
అణిమ - మహిమ -------------------------------- అష్ట సిద్ధులు అనే మాట ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం. ఇంతకూ ఆ అష్ట సిద్ధులు ఏంటో తెలుసా? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - ఈ ఎనిమిదింఃఇనీ అష్టసిద్ధులు అంటారు. ఈ ఎనిమిది సిద్ధులు సామాన్యమైనవి కావు. వేటి ప్రానాన్యం వాటివే. వాటిలో మొదటిదైన అణిమ అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేసుకోవడం. మహిమ అంటేనేమో శరీరాన్ని పెద్దదిగా చేసుకోవడం. ఈ రెండింటినీ సాధించిన వాడు ఆంజనేయుడు. సీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఈ రెండు సిద్ఝులనూ ఆచరించి చూపాడు. లంకలో ప్రవేశించినప్పుడు, సూర్యాస్తమయం తర్వాత పిల్లి అంత చిన్నవాడిలా మారిపోయి ఆశ్చర్యకరమైన రూపాన్ని పొందాడు. వృషదంశకమంటే పిల్లి. అలాగే, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సముద్రాన్ని దాటేటప్పుడు మహిమ సిద్ధిని ప్రదర్శించాడు. ఆంజనేయుడి బలపరాక్రమాలను తెలుసుకోవాలనుకున్న దేవతలు దక్షప్రజాపతి కుమార్తె అయిన క్రోధవశకు జన్మించిన నాగమాత సురసాదేవిని కోరారు. అంతట సురసాదేవి రాక్షస దేహం ధరించి "దేవతలు నిన్ను ఆహారంగా సమర్పించారు. నా నోటిలోకి ప్రవేశించు" అని అడుగుతుంది. అప్పుడు 80 యోజనాల భారీకాయుడైన హనుమ కోసం 90 యోజనాల నోరు తెరిచిన ఆ సురసాదేవి నోట్లోకి ప్రవేశించి, ఆమె నోరు మూసే లోపల, బొటన వేలడంతవాడై బయటకు వచ్చేశాడు. అదీ హనుమంతుడి శక్తి!! - యామిజాల జగదీశ్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం