తోర్నాల గ్రామంలో ప్రజలు వ్యవసాయం చేస్తూ,పంటలుపండిస్తు జీవనం సాగిస్తుండేవారు. పిల్లాపాపలతో హాయిగా ఉండేవారు.నిజాంరాజు పరిపాలనలో రజాకార్ల పాలన ప్రారంభం ఐంది.ప్రజలకు అన్ని కష్టాలే మొదలయ్యాయి.పండించిన పంటలన్ని ఎత్తుకెళ్ళేవారు.ఎదురు మాట్లాడితే లాఠీలతో దాడిచేసేవారు.
ఈ ఏడాది మంచి పంటలు వచ్చాయని ప్రజలంతా ఆనందంలో మునిగితేలుచున్నారు. అప్పుడే రజాకార్లు వచ్చి బెదిరించి,కొట్టి పంటను లాక్కెళ్ళిపోతున్నారు.గ్రామంలో నవీన్ తెలివైన యువకుడు. రజాకార్లకు ఎదురుతిరిగాడు.ఎవర్రా మీరు? మేం పండించిన పంట ను ఎత్తుకెళ్లి పోతున్నారు. మీకెందుకు ఇస్తాం.ఇవి మా భూములు.మేం పండించిన పంటను ఇవ్వమని ఎదురు తిరుగుతాడు.అప్పుడు రజాకార్లు ఒరేయ్! కుర్రోడ మాకే ఎదురు వచ్చే మొనగానివా! అంటూ నవీన్ ను చితకబాదారు.పంట నంత తీసుకెళ్ళారు.నవీన్ చేసేది లేక ఊరుకున్నాడు.
గ్రామంలో 80 సంవత్సరాల కొమురయ్య నవీన్ ధైర్యాన్ని మెచ్చుకున్నాడు.రజాకార్ల విషయాలన్నీ నవీన్ కు చెబుతాడు.నవీన్ కు ధైర్యం నూరిపోస్తాడు.అప్పుడు నవీన్ గ్రామస్తులందరిని ఐక్యతపరిచాడు.సమస్యకు పరిష్కారం చేయాలనుకున్నాడు. అప్పుడు గ్రామస్తులందరి కొన్ని రోజులు కర్రసాములో శిక్షణ ఇప్పించారు.అందరు ప్రాణాలకు తెగించారు. ఐక్యంగా ఉంటామని నవీన్ కు మాటఇచ్చారు.
మనము మన చుట్టు ప్రక్కల గ్రామాలవారిని ఐక్యపరిచాడు.
ఇప్పుడు వారి ఆటలు కట్టించాలని అనుకున్నారు. అప్పుడు అందరు కూడా కర్రలు పట్టుకొని,కారప్పొడి చేతుల పట్టుకొని సిద్ధంగా ఉంటారు.ఈసారి మళ్లీ పంట పండే సమయానికి ఊరు మీద పడి ప్రజలను బెదిరిస్తారు.
నవీన్ ఇలా అంటాడు. ఇది మా కష్టార్జితం.మా ప్రాణాలు పోయినా సరే! మా పంట మేము కాపాడుకుంటామని గట్టిగా హెచ్చరిస్తాడు.
రజాకార్లు నవీన్ ను పట్టుకునే ప్రయత్నం చేస్తారు.గ్రామస్తులందరు ఒక్కసారిగా కర్రలతో,కారం ముద్దలతో దాడిచేశారు. రజాకర్లు పంటనంత అక్కడే వదిలేశారు.పారిపోసాగారు. అప్పుడు నవీన్ మరెప్పుడైనా మా ఊర్ల మీద పడి పంటలు తీసుకెళ్తే ఇదే గతి పడుతుందని వారికి వినబడేలా హెచ్చరిస్తాడు. గ్రామస్తులందరూ నవీన్ యొక్క ధైర్య సాహసాలకు మెచ్చుకుంటారు. అప్పటినుండి గ్రామస్తులందరూ సంతోషంగా ఎవరి పంటలు వారు పండించుకొని హాయిగా జీవనం కొనసాగిస్తారు.
ప్రతి ఒక్కరు నవీన్ లాగా ధైర్యంగా ఉండాలని కొమురయ్య హితబోధ చేస్తాడు.
ధైర్యమే ఆయుధం: - జక్కుల కార్తీక్ -9వ, తరగతి -జి.ప.ఉ.పా.బక్రిచెప్యాల -జిల్లా: సిద్ధిపేట -చరవాణి:9704865816.
• T. VEDANTA SURY
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి