పద్యరత్నం: - డా.సి.వసుంధర చెన్నై

దిగిన చానసొగసు దిలకించుచుండగా 
బస్సు బుంయిమనుచు బరుగులెత్తె 
తెల్లమొగము వైచె దెరువరివాయిదా నేటంచు జడ్జి
వాడియంచు  ఎక్కట్లు 
తుమ్మల సీతారామమూర్తి

భావం...బస్సులోకోర్టుపనిమీద వెళ్లాల్సిన ఒకడు ఆబస్సునుంచి దిగిన ఓస్త్రీ సౌందర్యాన్నిచూస్తూ ఉండగా బస్సుబుయ్ మనిరొదచేస్తూ వెళ్లి పోయింది.దానితో నేడు కోర్టు వాయిదా.అసలే జడ్జీ కోపిష్టి ఏంచేయాలంటూ వాపోయాడు.
ఇదే వృధాకాలక్షేపం. పక్కింటివాళ్ల తగువు కిటికీదగ్గర నిలబడి విని ఆనందించేవారికి తాము చేయాల్సిన పనులు ఎంత వెనుకబడిపోయాయో తెలీదు. హాస్యం జోడించి అమృత గుళిక వంటి సత్యాలను అందించడమే ఎక్కట్లు పరమార్ధం.అందులో తుమ్మల వారు సిద్ధహస్తులు🌺

కామెంట్‌లు