వారు అయోధ్యపురము వెళ్ళు తోవలో
మృగములు ప్రదక్షపూర్వకముగా
పక్షుల అరుపులు అశుభసూచకంగా
కనులకు కనిపించి చెవులకు వినిపించును
అశుభముల గూర్చి వశిష్టోనని ప్రశ్నించారు
ఓ మహర్షి కర్ణ కఠోరమైన అరుపులు
భయంకరంగా వినిపిస్తున్నాయి
నా మనసు కలవర పడుతుంది
దశరథ ఈ శబ్ద ఫలితమును వినుము
పక్షులు అపశుభములు తెలుపగా
మృగాలు శుభసూచకం చూపుతున్నాయి
దశరథనీకు కలవరము భయం వద్దు
అదే సమయంలో రాత్రి సూర్య తేజస్సుతో
గొడ్డలి వేటుతో చెట్లు నేలకొరిగినట్టుల
భయంకరమైన శబ్దం ఆవరించెను
ఆ శబ్దంతోఅందరూ మూర్చ చెందినారు
వశిష్టుడు దశరథుడు రామలక్ష్మణులు
మాత్రమే అచ్చట తేరుకొని ఉన్నారు
జమదగ్నికుమారుడు పరుశురాముడు
ప్రళయకాలరుద్రనివలె యున్నాడచట

addComments
కామెంట్ను పోస్ట్ చేయండి