ఒక వ్యక్తి ఒక భూతాన్ని రప్పించి, తాను కోరుకున్నదంతా దాని చేత చేయించుకోవాలని భావించి, దానికి కావలసిన సాధనలలో నిమగ్నమ య్యాడు. కొన్ని మంత్రాల శక్తి వల్ల, అతను భూతాన్ని తన ముందుకు రప్పించగలిగాడు. భూతం కూడా అతని ఆజ్ఞలకు లొంగి నడుచుకోవడానికి సిద్ధంగా ఉంది.
కానీ ఆ భూతం ఒక షరతు విధించింది.
"ఎప్పుడైనా మీరు నాకు పని ఇవ్వకపోతే, నేను మిమ్మల్ని మింగేస్తాను. మీరు నాకు ఇరవై నాలుగు గంటలూ పని ఇస్తూనే ఉండాలి" అని చెప్పింది. ఆ వ్యక్తి అందుకు అంగీకరించాడు.
వెంటనే తనకు ఒక పెద్ద భవనం నిర్మించి ఇవ్వాలని ఆజ్ఞాపించాడు. అతను ఎంతో ఆశ్చర్యపోయేలా, అనతి కాలంలోనే ఓ భవనం నిర్మించిందా భూతం.
తరువాత ఒక పొడవైన రహదారిని నిర్మించమని ఆదేశించాడు. ఆ నిర్మాణ పని కూడా కొద్దిసేపట్లోనే పూర్తయిపోయింది.
మరుసటి నిమిషమే భూతం అతని ముందు నిలబడింది. "ఇంకా పని ఇవ్వండి" అని అడిగింది.
అతనికి ఆలోచించడానికి కూడా సమయం లేదు.
ఒక పెద్ద నగరాన్ని సృష్టించమని ఆజ్ఞాపించాడు.
అది కూడా తయారైపోయింది.
దాంతో ఆ వ్యక్తి గందరగోళంలో పడ్డాడు. భయపడ్డాడు. కొత్తగా ఏం చెప్పాలో అతనికి తెలియలేదు. పని ఇవ్వకపోతే, భూతం అతనిని మింగేస్తుంది.
అతను ఒక మహానుభావుడి (మహర్షి) వద్దకు వెళ్లి భూతాన్నెలా వదిలించుకోవాలో చెప్పండని ఆయనను సలహా అడిగాడు.
ఆ మహానుభావుడు ఒక వెదురు కర్రను భూమిలో పాతమని సలహా ఇచ్చారు. మరో పని చెప్పే వరకు ఆ కర్రపై భూతం ఎక్కి దిగుతూ ఉండాలని చెప్పమన్నారు. అతను అలాగే చేశాడు. భూతం ఆ ఆజ్ఞను నెరవేర్చక తప్పదు కదా. అంటే భూతానికి విశ్రాంతే లేదు. చివరికి, అది విసిగిపోయి పారిపోయింది.
ఇప్పుడు మీ విషయంలోనే చూడండి. "రామ నామమే ఆ కర్ర. అహంకారమే మిమ్మల్ని భయపెట్టే భూతం. మళ్లీ మళ్లీ కర్రపై ఎక్కి దిగమని దానికి చెప్పండి. అది త్వరలోనే అలసిపోయి పారిపోతుంది. అహంకారాన్ని అణచడానికే రామ నామం మీకు చెప్పడమైంది. అహంకారం నశించాలంటే దాని సొంత ప్రయత్నం వల్లే అది జరగాలి అని స్వామి రామదాస్ తమ ఉపన్యాసంలో చెప్పిన కథ ఇది.
కానీ ఆ భూతం ఒక షరతు విధించింది.
"ఎప్పుడైనా మీరు నాకు పని ఇవ్వకపోతే, నేను మిమ్మల్ని మింగేస్తాను. మీరు నాకు ఇరవై నాలుగు గంటలూ పని ఇస్తూనే ఉండాలి" అని చెప్పింది. ఆ వ్యక్తి అందుకు అంగీకరించాడు.
వెంటనే తనకు ఒక పెద్ద భవనం నిర్మించి ఇవ్వాలని ఆజ్ఞాపించాడు. అతను ఎంతో ఆశ్చర్యపోయేలా, అనతి కాలంలోనే ఓ భవనం నిర్మించిందా భూతం.
తరువాత ఒక పొడవైన రహదారిని నిర్మించమని ఆదేశించాడు. ఆ నిర్మాణ పని కూడా కొద్దిసేపట్లోనే పూర్తయిపోయింది.
మరుసటి నిమిషమే భూతం అతని ముందు నిలబడింది. "ఇంకా పని ఇవ్వండి" అని అడిగింది.
అతనికి ఆలోచించడానికి కూడా సమయం లేదు.
ఒక పెద్ద నగరాన్ని సృష్టించమని ఆజ్ఞాపించాడు.
అది కూడా తయారైపోయింది.
దాంతో ఆ వ్యక్తి గందరగోళంలో పడ్డాడు. భయపడ్డాడు. కొత్తగా ఏం చెప్పాలో అతనికి తెలియలేదు. పని ఇవ్వకపోతే, భూతం అతనిని మింగేస్తుంది.
అతను ఒక మహానుభావుడి (మహర్షి) వద్దకు వెళ్లి భూతాన్నెలా వదిలించుకోవాలో చెప్పండని ఆయనను సలహా అడిగాడు.
ఆ మహానుభావుడు ఒక వెదురు కర్రను భూమిలో పాతమని సలహా ఇచ్చారు. మరో పని చెప్పే వరకు ఆ కర్రపై భూతం ఎక్కి దిగుతూ ఉండాలని చెప్పమన్నారు. అతను అలాగే చేశాడు. భూతం ఆ ఆజ్ఞను నెరవేర్చక తప్పదు కదా. అంటే భూతానికి విశ్రాంతే లేదు. చివరికి, అది విసిగిపోయి పారిపోయింది.
ఇప్పుడు మీ విషయంలోనే చూడండి. "రామ నామమే ఆ కర్ర. అహంకారమే మిమ్మల్ని భయపెట్టే భూతం. మళ్లీ మళ్లీ కర్రపై ఎక్కి దిగమని దానికి చెప్పండి. అది త్వరలోనే అలసిపోయి పారిపోతుంది. అహంకారాన్ని అణచడానికే రామ నామం మీకు చెప్పడమైంది. అహంకారం నశించాలంటే దాని సొంత ప్రయత్నం వల్లే అది జరగాలి అని స్వామి రామదాస్ తమ ఉపన్యాసంలో చెప్పిన కథ ఇది.

addComments
కామెంట్ను పోస్ట్ చేయండి