సంపూర్ణ మహాభారతముసరళ వ్యావహారిక భాషలో...!

 
ద్రోణ పర్వము ప్రథమాశ్వాసము- 291వ రోజు
అపహార్ణ సమయానంతర సమరం
అప్పటి వరకు జరిగిన భీకర సమరానికి గుర్తుగా యుద్ధభూమిలో రథములు విరిగి పడుతున్నాయి, తలలు తెగిపోతున్నాయి, మొండెముల నుండి ప్రేవులు బయట పడుతున్నాయి, కాళ్ళు చేతులు తెగిపదుతున్నాయి, కుంభస్థలములు పగిలి ఏనుగులు కింద పడి దొర్లుతున్నాయి, ఏనుగుల మీది వీరులు అంకుశములతో సహా కింద పడి మరణిస్తున్నారు. ఏనుగుల కాళ్ళ కింద పడి మరణిస్తున్నా సైనికులు తమ చేతిలోని కరవాలములు వీడకున్నారు, తల తెగిన తరువాత కూడా వీరులు కరవాలమును కొంతసేపు ఝుళిపించి తరువాత కింద పడుతున్నారు. రణరంగము పీనుగుల పెంటగా మారింది. ధృష్టద్యుమ్నుడు ద్రోణుని చంపుటకు తగిన సమయం వచ్చిందని తన సైన్యంతో ద్రోణుని ఎదుర్కొని అనేక దివ్యాస్త్రములు సంధించాడు. ఇంతలో సంశక్తులను పూర్తిగా నిర్మూలించిన అర్జునుడు తిరిగి పాండవ సైన్యాలను చేరి భీమునికి తోడుగా నిలిచాడు. ముగ్గురి వీరుల ధాటికి తట్టుకోలేని కౌరవ సేన " కర్ణా ! మాకు నీవే దిక్కు " అని ఆక్రోశించాయి. కర్ణుడు నిలవండి పారిపోకండి. మీకేమి భయం లేదు " అని ధైర్యవచనాలు పలికి ఎదురుగా ఉన్న అర్జునుడిపై ఆగ్నేయాస్త్రం ప్ర్రయోగించాడు. అర్జునుడు వారుణాస్త్రాన్ని ప్రయోగించి ఆగ్నేయాస్త్రాన్ని నిర్యీర్యం చేసాడు. భీముడు, సాత్యకి, ధృష్టద్యుమ్నుడు కర్ణుని శరీరంలో మూడేసి బాణాలు నాటారు. కర్ణుడు అర్జునుడి బాణములను త్రుంచి భీమ, సాత్యకి, ధృష్టద్యుమ్నుల ధనస్సులను విరిచాడు. ఆ ముగ్గురు కర్ణునిపై శక్తి బాణములు ప్రయోగించాడు. కర్ణుడు వాటిని నిర్వీర్యం చేసాడు. అర్జునుడుఏడు బాణములతో కర్ణుని కొట్టి అతడి ముగ్గురు తమ్ముల తలలు నరికి భూదేవికి బలి ఇచ్చాడు. భీముడు రథం దిగి గధను భుజం మీద పెట్టుకుని కర్ణుని సైనికులను పదివేల మందిని సంహరించి తిరిగి రథం అధిరోహించాడు. మరొక విల్లు తీసుకుని వాడి అయిన బాణములతో కర్ణుని శరీరం అంతా కొట్టాడు. సాత్యకి, ధృష్టద్యుమ్నులు వేరు విల్లు తీసుకుని కర్ణుని సారధిని చంపి, విల్లు త్రుంచాడు. దుర్యోధనుడు, ద్రోణుడు, జయద్రధుడు వచ్చి కర్ణిడిని అక్కడ నుండి తప్పించారు. ఇరు పక్షములు ఘోర యుద్ధం చేస్తున్నారు. రధ, గజ, తురంగ, పదాతి దళాలు నేలకూలుతున్నాయి. కాలువలై ప్రవహిస్తున్న రక్తంలో శరీరాలు తేలియాడుతున్నాయి. రధ, గజ, తురగ, మానవుల ప్రేవులు మాంసపు ముద్దలు గుట్టలుగా పడుతున్నాయి. రణ భూమి భయానకంగాను, రౌద్రంగాను, భీభత్సంగాను కనపడుతుంది. అర్జునుడు, ద్రోణుడు భీకరంగా యుద్ధం చేస్తుండగా సూర్యుడు పశ్చిమాద్రి చేరుకున్నాడు. రణరంగంలో పడి ఉన్న శవములు తినుటకు గ్రద్దలు ఆకాశంలో తిరుగుతున్నాయి. ఇరు పక్షములు ఆ రోజు యుద్ధం ముగించారు. ఆనందోత్సాహంతో పాండవసేనలు, నిరుత్సాహంతో కురుసేనలు, తమశిబిరాలకు మళ్ళాయి. కురుసైన్యం లోని అందరూ ద్రోణుడు ఆరోజు కూడా తనశపధం నెరవేర్చుకోక పోవడం అర్జునుడి పరాక్రమం కృష్ణుడు తోడు నిలిచి అనుక్షణం కాపాడటం గురించి చర్చించుకోసాగారు.
సుయోధనుడు ద్రోణుని నిందించుట
ఆ సమయంలో సుయోధనుడు ద్రోణుని చూసి " ఆచార్యా ! ధర్మరాజును పట్టి బంధిస్తానని నాకు వరం ఇచ్చారు. రెండు రోజులైనా మీ మాట చెల్లించుకోలేక పోయారు. ధర్మజుడు చేజిక్కినా మీరు ఆ అవకాశం చేజార్చుకున్నారు. లోకుల దృష్టిలో మీరు నేను అసమర్ధులం అయ్యాము. ఈ విధంగా కుటిల వ్యర్ధమైన మాటలతో ప్రయోజనమేమిటి ? మీ వంటి ఆశ్రిత గుణశ్రేష్టుడు ఇలా వంచించ తగునా ? " అని కర్ణ కఠోరంగా పలికాడు. ద్రోణుడు సుయోధనుని మాటలకు నొచ్చుకున్నా అది బయట పడనీయక " సుయోధనా ! నరుని పరాక్రమము, నారాయణుని మహిమ తెలిసీ నీవు నన్ను నిందించ తగదు. నిన్న ఈ రోజు ధర్మజుని వదిలి అర్జునుడు ఒక్క క్షణమైనా ఉన్నారా! రేపటి రోజు అర్జునుడిని రణరంగం నుండి తీసుకు పోవుటకు ఎవరినైనా నియోగింపుము. నేను నా ప్రతిజ్ఞ నెరవేర్చెదను. నవ్వునకైనా నా నోట అసత్యము రాదు. గుర్తు పెట్టుకో నేను నా ప్రతిజ్ఞ వెరవేర్చుకుంటాను " అన్నాడు ద్రోణుడు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన సంశక్తులు "సుయోధనా ! అర్జునుడిని మరల్పగల ధైర్యం మాకు దక్క వేరెవరికి ఉంది " అని ప్రగల్భములు పలికారు.
*ద్రోణ పర్వము ప్రథమాశ్వాసము సమాప్తం *
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
ఉరుదూ తెలుగు సాహిత్య వారధి డా. సామల సదాశివ; రామ్మోహన్ రావు తుమ్మూరి
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం