నవరత్న ఉంగరం – కొన్ని విశేషాలు : - యామిజాల జగదీశ్

 నవరత్న ఉంగరంలో మధ్యలో కెంపు, తూర్పు దిశలో వజ్రం, ఆగ్నేయ దిశలో ముత్యం, ఈశాన్యంలో పచ్చ, దక్షిణాన పగడం, నైరుతిలో గోమేధికం, పడమరలో నీలం, వాయువ్యంలో వైఢూర్యం, ఉత్తరంలో కనకపుష్య రాగం ఉండాలి.
మరుక్షణం ఏం జరుగుతుందో తెలియని మన జీవితంలో మనల్ని నడిపించేది నమ్మకమే. నమ్మకమే మన జీవితానికి పునాది. కొన్ని నమ్మకాలను మనం మూఢనమ్మకాలని కొట్టిపారేసినా ప్రతి నమ్మకం వెనుకా ఓ అనుభవం ఉంటూ ఉంటుంది. ఒకటికి పదిసార్లు ఒకటే జరిగితే అప్పుడు అది అనుభవం మాత్రమే కాదు, నమ్మకమూ అవుతుంది మన జీవితానికి.
అటువంటి నమ్మకాలే ప్రకృతితో ముడిపడి ఉంటాయి. ప్రకృతిలో అరుదుగా లభించే రంగు రాళ్ళు, పూసలు, గవ్వలు, కాయలు, పండ్లు వంటివన్నీ మనకు ఏదో రూపంలో ఉపయోగపడుతుంటాయి. అప్పుడు వాటిపై మనకు తెలియకుండానే నమ్మకం పెరుగుతుంది. మన మనసుకు నచ్చిన వారితో ఆ విషయాన్ని పంచుకుంటాం.
ప్రకృతిలో లభించే రత్నాల రంగులు, వెలుగులూ మనిషిని అనాది కాలం నుంచీ ఆకట్టుకుంటున్నాయి.
రత్నాలు అరుదుగా లభించడం, భూమి పొరలలో కనిపించే మిగిలిన రాళ్ళ కన్నా భిన్నమైనవిగా ఉండడంతో వాటి మీద మనకు ఆసక్తి పెరుగుతుంది. ఇది విచిత్రమేమీ కాదు. సర్వసహజం. అంతేకాదు, నమ్మకమూ పెరుగుతుంది. వేదకాలం నుంచీ ఆరంభమైన ఆ నమ్మకం ఇప్పుడు ఓ శాస్త్రంగా మారడం విడ్డూరమేమీ కాదు. అనుభవం నేర్పిన పాఠాలను ఎవరు కాదనగలరు.
గ్రహశాస్త్రంతో మిళితమైన నవరత్న శాస్త్రం వృద్ధిలోకి వచ్చిందిలానే. మనిషి జన్మించిన సమయానికీ, రత్నాలకూ లంకె ఏర్పడింది. ఏ నక్షత్రంలో ఏ రాశిలో జన్మించిన వారికి ఎటువంటి రత్నం  ధరించవచ్చో ఆ శాస్త్రం మనకు స్పష్టం చేస్తుంది. జన్మనక్షత్రం, జన్మ రాశి ప్రధానం. అందుకు నైపుణ్యం ఉండాలి. అందుకే అంటారు, ఎవరు ఏది పడితే అది వాడకూడదని.
ఓ రత్నం ఎంపిక చేయాలంటే అనేక విషయాలు పరిగణనలోకి తీసుకోవాలి.
ఒక్కో గ్రహానికి ఒక్కో రత్నం అధిపతి అవుతుంది.
అదేంటో చూద్దాం....
సూర్యుడికి కెంపు (అవతారం - రామ), చంద్రుడికి ముత్యం (అవతారం – కృష్ణ), శుక్రుడికి వజ్రం (అవతారం – పరశురామ), కుజుడికి పగడం (అవతారం – నరసింహ), రాహువుకి గోమేధికం (అవతారం – వరాహం), బృహస్పతికి పుష్యరాగం (అవతారం – వామన), శనికి నీలం (అవతారం – కూర్మం), బుధుడికి పచ్చ (అవతారం – బుద్ధ), కేతువుకి వైఢూర్యం (అవతారం – మత్స్యం) అధిపతి.
కెంపు ముదురు ఎరుపు రంగులో ఉంటుంది. అది అత్యంత విలువైన రత్నం. దీనినే రవిరత్నం, వసురత్నం అని కూడా అంటారు. కెంపులు ఎరుపు భిన్న ఛాయలో ఉండొచ్చు. కెంపునకు ఆదివారం మంచిది.
ముత్యాలు అల్చిప్ప నుంచి తీస్తారు. మంచి ముత్యం అనేది తెల్లగా మృదువుగా ఉంటుంది. మెరుస్తుంది. ముత్యం మీద నల్లమచ్చలు ఉంటే ధరించకూడదు. ముత్యాలను ఆది, సోమ, గురువారాల్లో ధరించడం మంచిది.
పగడం నాణ్యమైనదైతే మెరిసే ఎరుపు రంగులో ఉంటుంది. నారింజ రంగు మిళితమై ఉంటుంది.
గోమేధికం కపిల వర్ణ ఎరుపు ప్రదర్శించే రత్నం. నున్నగా స్ఫటికంలా ఉంటుంది. పూర్తి పారదర్శకమైన గోమేధికాన్ని ధరించకూడదు. రంగు తక్కువ, నునుపులేని గోమేధికం ప్రేమ, సంసార బందాలలో ఘర్షణ పెంచుతుంది.
పుష్యరాగానికి గురువారం మంచిది. పుష్యరాగం పసుపు, కుంకుమ, తెలుపు ఛాయలలో దొరుకుతుంది. పుష్యరాగాన్ని తెల్లకాగితం మీద ఉంచి ఎండలో పెడితే అందులో నుంచి పసుపు రంగు కిరణాలు వెలువడతాయి.
నవరత్నాలలో మేలైనది మంచి చెడులలో ఏదైనా ఫలితాలను చూపించేది నీలమణి. నీలం, నీలమణి, ఇంద్రనీలమణి అని  పేర్లున్నాయి. ఇది నెమలి నీలపు రంగులో పారదర్శకంగా ఉంటుంది. దీనిని సూర్యకాంతిలో ఉంచినప్పుడు నీలికిరణాలు ప్రతిబింబిస్తాయి.
బరువున్న పచ్చ మంచిది. ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే ఈ రత్నం జ్యోతిష్యులకు మహా ఇష్టం.  వీటి ఖరీదు ఎక్కువ.  పచ్చను పగడం లేదా ముత్యంతో పాటు ధరించకూడదు.
కాంతి ప్రవేశంలో స్ఫటికంలా ఉండే రత్నం వైఢూర్యం. ఇది ఒక పిల్లికన్నులా మెరుస్తుంటుంది. వైఢూర్యం పసుపు, లేత పచ్చ, నల్ల ఛాయలలో కనిపిస్తుంది. దీని మీద తెల్లగీతలు ఉంటాయి.
నవరత్నాలలో రాజు వజ్రం. ధగధగా మెరుస్తంది. తెల్లని, పారదర్శక వజ్రం అత్యుత్తమమైనది. ఈ వజ్రం నుండి అనేక రంగులు వెలువడి కనిపిస్తాయి. వజ్రాలకున్న ఆదరణను సొమ్ము చేసుకోవడానికి కొందరు నకిలీ వజ్రాలను అంటకడతారు. కనుక ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.    

కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
అణిమ - మహిమ -------------------------------- అష్ట సిద్ధులు అనే మాట ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం. ఇంతకూ ఆ అష్ట సిద్ధులు ఏంటో తెలుసా? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - ఈ ఎనిమిదింఃఇనీ అష్టసిద్ధులు అంటారు. ఈ ఎనిమిది సిద్ధులు సామాన్యమైనవి కావు. వేటి ప్రానాన్యం వాటివే. వాటిలో మొదటిదైన అణిమ అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేసుకోవడం. మహిమ అంటేనేమో శరీరాన్ని పెద్దదిగా చేసుకోవడం. ఈ రెండింటినీ సాధించిన వాడు ఆంజనేయుడు. సీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఈ రెండు సిద్ఝులనూ ఆచరించి చూపాడు. లంకలో ప్రవేశించినప్పుడు, సూర్యాస్తమయం తర్వాత పిల్లి అంత చిన్నవాడిలా మారిపోయి ఆశ్చర్యకరమైన రూపాన్ని పొందాడు. వృషదంశకమంటే పిల్లి. అలాగే, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సముద్రాన్ని దాటేటప్పుడు మహిమ సిద్ధిని ప్రదర్శించాడు. ఆంజనేయుడి బలపరాక్రమాలను తెలుసుకోవాలనుకున్న దేవతలు దక్షప్రజాపతి కుమార్తె అయిన క్రోధవశకు జన్మించిన నాగమాత సురసాదేవిని కోరారు. అంతట సురసాదేవి రాక్షస దేహం ధరించి "దేవతలు నిన్ను ఆహారంగా సమర్పించారు. నా నోటిలోకి ప్రవేశించు" అని అడుగుతుంది. అప్పుడు 80 యోజనాల భారీకాయుడైన హనుమ కోసం 90 యోజనాల నోరు తెరిచిన ఆ సురసాదేవి నోట్లోకి ప్రవేశించి, ఆమె నోరు మూసే లోపల, బొటన వేలడంతవాడై బయటకు వచ్చేశాడు. అదీ హనుమంతుడి శక్తి!! - యామిజాల జగదీశ్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం