ఏనుగుతో మైత్రి!: - - యామిజాల జగదీశ్

 ఆ రోజు కృష్ణుడికి చాలా సంతోషకర మైన రోజు.
ఎన్నో రోజులు ఆడిగి అడిగి, విసిగించిన తర్వాత, దూడలను మేపడానికి అతనికి మొదటిసారిగా అనుమతి లభించింది.
ఉదయాన్నే, కోపంగా ఉన్న కాపరులం దరూ దూడలతో సిద్ధంగా ఉన్నారు.
బలరాముడు, కృష్ణుడు ఆనందంతో గంతులు వేస్తూ వచ్చారు.
వారు పల్లెను దాటి బృందావన అడవిలోకి ప్రవేశించగానే, కృష్ణుడు ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసాడు. 
అక్కడ చూస్తున్నదంతా అతనికి కొత్తగా ఉంది.
ఎత్తైన చెట్లు.
కొమ్మలకు వేలాడుతున్న రంగు రంగుల పువ్వులు.
రంగు రంగుల పక్షులు. వాటి అరుపులు. కిచకిచలు. 
గాలికి ఊగుతున్న ఆకులు. 
అతను ప్రతిదాన్నీ ఆశ్చర్యంగా చూస్తూ చుట్టూ తిరుగుతున్నాడు.
“అన్నయ్యా... ఇఅది ఏ పక్షీ?”
“అదా అది చిలుక...” అని బలరాముడి జవాబు.
“అదా?”
“అది కోకిల...”
మధ్యలో ఆవులను దూడలనూ మేపడం....
కృష్ణుడు, "దాని పేరేంటి?" అని అడగ్గా, బలరాముడు తనకు తెలియదని చెప్పగా "నీకూ తెలీదా" అని నవ్వటం...
అయితే వెంటనే, కృష్ణుడు తానడిగిన మొక్కకో, పక్షికో, లేదా కీటకానికో ఒక కొత్త పేరు పెట్టి అదే అన్నయ్యా దాని పేరు అనేవాడు.
ఇలా ఏవేవో మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ అడవిలోకి నడుచుకుంటూ వెళ్తుండగా, కృష్ణుడి బృందానికి దూరంగా ఒక పెద్ద కదలిక కనిపించింది.
మొదట, వాళ్ళు అది ఒక చెట్టు ఆవేశంతో ఊగుతోందనుకున్నారు. కానీ అది చెట్టు కాదని, ఏనుగని గ్రహించారు. అది భారీ ఏనుగు. కానీ కృష్ణుడికి అదేంటో తెలీలేదు.
దాన్ని చూసి ఆవులన్నీ కొంచెం వెనక్కి తగ్గాయి. తమ దూడల పక్కకు చేరాయి. 
కొన్నేమో బలరాముడి వెనుక దాక్కున్నాయి.
కానీ కృష్ణుడు ఒక్కడే ఆశ్చర్యంగా ఆ భారీ ఏనుగు వంకే చూస్తున్నాడు.
అంత పెద్ద జీవిని కృష్ణుడు చూడటం అదే మొదటిసారి.
"అన్నా... ఇదేంటి?"
"ఏనుగు..." అన్నాడు బలరాముడు.
కృష్ణుడు మెల్లగా దాని దగ్గరికి నడిచాడు.
అందరూ భయంతో వణికిపోయారు.
“కన్నయ్యా... వెళ్ళకు...” అని అక్కడున్న వారందరూ అరిచారు.
కానీ కృష్ణుడు వారి హెచ్చరికలు అస్సలు పట్టించుకోలేదు.
అతను ఏనుగు దగ్గరకు వెళ్లి దాని తొండాన్ని మెల్లగా తాకాడు.
ఆ ఏనుగు కూడా కదలకుండా నిలబడింది.
అతను ఎగిరెగిరి దాని చెవిని తాకాడు.
దాని దంతాన్ని పట్టుకున్నాడు.
దాని చుట్టూ తిరిగాడు.
ఆ ఏనుగు ఏమీ చేయకుండా అతని వైపే చూస్తూ ఉండిపోయింది. క్షణం తర్వాత అది కదిలింది. కృష్ణుడికి ఆ కదలిక బాగా నచ్చింది. అది అటూ ఇటూ ఊగుతూ నెమ్మదిగా నడుస్తోంది. కృష్ణుడు దాని వైపే చూస్తూ ఉండిపోయాడు.
తర్వాత అతను కూడా అదే విధంగా అటూ ఇటూ ఊగుతూ నడవడం మొదలుపెట్టాడు. అక్కడే ఉన్న వారంతా కృష్ణుడి వాలకాన్ని చూసి నవ్వడం మొదలుపెట్టారు.
“కృష్ణుడు అచ్చం ఏనుగులా నడుస్తున్నాడుగా!” అన్నారు వాళ్ళు.
కొద్దిసేపటికి, ఒక అద్భుతం జరిగింది. ఆ ఏనుగు కృష్ణుడ్ని చూసి అతని దగ్గరకు వచ్చింది. కృష్ణుడు ఏం చేస్తే అలా చేసేది. కృష్ణుడు తల వంచగానే, ఏనుగు కూడా తల వంచింది.
కృష్ణుడు నిటారుగా నిలబడగానే, ఏనుగు కూడా అలాగే నిలబడేది.
అది చూసి పిల్లలందరూ కేరింతలు వేసారు.
కృష్ణుడి తీరుకి ఏనుగు మంత్రముగ్ధు రాలైంది.
కొద్దిసేపటికి, ఏనుగు తన తొండాన్ని చాచింది.
అది మెల్లగా కృష్ణుడ్ని పైకి ఎత్తి తన వీపుపై కూర్చోబెట్టుకుంది. కృష్ణుడు ఏ మాత్రంం భయపడకుండా ఆనందంతో చప్పట్లు కొట్టాడు. బలరాముడు దగ్గరలోనే నిలబడి ఉన్నాడు.
అతను చేయి ఊపాడు.
వెంటనే, ఏనుగు బలరాముడినీ పైకి ఎత్తి కృష్ణుడి పక్కనే కూర్చోబెట్టింది.
అంతే.
కృష్ణుడు, బలరాముడు నవ్వుతూ ఏనుగు వీపుపై కూర్చున్నారు.
ఏనుగు నెమ్మదిగా వారికి బృందావనం అంతా చూపించింది. ఏనుగు వెనకాతలే పిల్లలతోపాటు, ఆవులు, దూడలూ మెల్లగా సాగాయి.
ఏనుగు వారికి చెట్లను చూపించింది. చెరువులను చూపించింది. వారికి పువ్వులతో నిండిన దారులను చూపించింది. వారికి పక్షులు పాడే ప్రదేశాలను చూపించింది.
ఆ రోజు, కృష్ణుడికి ఆ ఏనుగుతో విడదీయరాని బంధమేర్పడింది. 
సాయంకాలం అయ్యాక, కృష్ణుడు, బలరాముడు ఏనుగు మీద నుంచి కిందకు దిగారు. కృష్ణుడు దాని తొండాన్ని నిమిరాడు. కృష్ణుడు దానికి కేశవా అని పేరు పెట్టాడు. ఆ ఏనుగు ఆనందం అంతా ఇంతా కాదు. దానికి ఆ పేరెంతో నచ్చింది. కృష్ణుడికి తోడుగా మారింది.
ఆ రోజు, బృందావనంలో కృష్ణుడు కేవలం ఒక ఏనుగు కలవలేదు. ఓ కొత్త తన స్నేహితుడిని కనుగొన్నాననే సంబరంతో మహదానందంగా గడిపాడు ఆ రోజంతా!

కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
ఉరుదూ తెలుగు సాహిత్య వారధి డా. సామల సదాశివ; రామ్మోహన్ రావు తుమ్మూరి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం
పద్య లక్షణాలు-ఉత్పలమాల,రుద్రవరం శివకుమార్,10వ తరగతి,జి.ప.ఉ.పా.వావిలాల, కరీంనగర్
చిత్రం