శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్ - భాగం - 135
 

వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
113. భావనాగమ్యా (పన్చాక్షరీ)
114. భవారణ్యకుఠారికా (అష్టాక్షరీ)
నూట పదునాల్గవ నామ మంత్రము:
ఓం భవారణ్యకుఠారికాయై నమః
భవ = సంసారము, అరణ్యము = దట్టమైన అడవి; కుఠారికా = గండ్రగొడ్డలిని ధరించినది.
సంసారము అనబడే అరణ్యములో ఉన్న అనేక విధాలైన బంధనాలను తొలగించడానికి, భక్తులైన తన సాధకులను కాపాడటానికి, దట్టమైన సంసారము లో ఉన్న అడ్డంకులను తొలగించడానికి, గండ్రగొడ్డలిని ధరించివచ్చిన శ్రీమాత ను చూచి వశిన్యాది వాగ్దేవతలు శ్రీలలితా పరాభట్టారికను "భవారణ్యకుఠారికా" అని కీర్తించారు. ఈ విధంగా మన రక్షణ కొసం వచ్చిన పరమేశ్వరి కి నమస్కారము.
అరణ్యము లో, చెట్లు / మహావృక్షాలు దట్టంగా, ఏపుగా పెరిగి, అనేక విధాలైన లతలు అల్లుకొని ఉంటాయి. కౄరమృగాలు ఇష్టారాజ్యంగా తిరుగుతుంటాయి. అలాగే, సంసారము అనే అరణ్యం లో కూడా, కౄరమైన కొండచిలువలవంటి "జననమరణాలు"; ప్రేమ, మోహము, బంధము అనే దట్టమైన లతలు చుట్టుకుని; అజ్ఞాన అంధకారము వంటి కారు చీకట్లలో; అరి‌డ్వర్గములు అనే భయంకరమైన కౄరమృగాల చేత చుట్టముట్టి మనిషి యొక్క మనసును పట్టి పీడిస్తుంటే, అప్పుడు సద్గురువు అనుగ్రహం తో సాధనా మార్గంలో ఉన్న తన సాధకులను రక్షించడానికి, మనల్ని ఆవరించిన అన్ని అవలక్షణాలను పరశురామ ప్రీతి చెయడానికి, గొడ్డలితో వచ్చిన శ్రీమాత "భవారణ్యకుఠారికా" అయ్యింది.
పునరపి జననం పునరపి మరణం 
పునరపి జననీ జఠరే శయనం |
ఇహ సంసారే బహు దుస్తారే 
కృపయా పారే పాహి మురారే || 
ఈ చరాచర జగత్తులో ఒకసారి ప్రాణం పోసుకున్న జీవునికి జనన మరణ చక్రబంధం తప్పించుకోలేనిది. ఈ ప్రపంచంలోకి వచ్చాక, మోహ బంధాలు, అరిషడ్వర్గాలతో బాధింపబడటం, నేను, నాది, నా వారు, వారి బాగోగులు అనే పాశం లో ఇరుక్కుపోయి, అజ్ఞానంలో కొట్టుకు పోవడం, వీటి వేటినుంచి కూడా తప్పించుకోలేము, అని శంకర భగవత్పాదుల మాట.
అజ్ఞానంతో కూడిన ఈ సంసారము అనే కీకరారణ్యం నుండి బయటపడే దారి దొరకాలి అంటే, పరమేశ్వరి కరుణ మన పైన ప్రసరించాలి. తన కరుణను మనపై కురిపించడానికి శ్రీమహారాజ్ఞి తన చేతిలో ఉన్న గండ్రగొడ్డలి ద్వారా జ్ఞాన సంపదను పంచుతోంది. తన సాధకులకు, ఈ సంసార బంధాల నుండి స్వేచ్ఛ కలిపిస్తోంది.
ఈ భయంకరమైన భవారణ్యమును , సంసార అరణ్యమును దాటడానికి, త్రికరణశుద్ధిగా పరమేశ్వరి నామ జపం చేయడమే మార్గము. ఈ సాధనా మార్గంలో ఉన్న సాధకుడు "సత్వగుణం"తో ఉండాలి. నిరంతరంగా సాగే సాధనతో ఆ తల్లి సాక్షాత్కారము కుదురుతుంది. అప్పుడు సాధకుడు, మోక్షమార్గాన్ని అందుకుంటాడు. పునర్జన్మ రహితుడు అవుతాడు. జనన మరణ చక్రబంధం నుండి బయటపడతాడు. ఇది సాధనలో తాదాత్మ్యత చెందిన సాధకునకు మాత్రమే సాధ్యపడుతుంది.
ఇంతటి కఠోరమైన సాధనా మార్గాన్ని ఎంచుకుని, మోక్ష మార్గములో తనను చేరుకోవాలి అని పరితపిస్తున్న తన సాధకులను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్న  శ్రీమాతను పూజించేటప్పుడు   ఓం భవారణ్యకుఠారికాయై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ
కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
ఉరుదూ తెలుగు సాహిత్య వారధి డా. సామల సదాశివ; రామ్మోహన్ రావు తుమ్మూరి
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం