రక్తసంబంధం కన్నా గుణ సంబంధం గొప్పది!!: - కె ఎస్ అనంతాచార్య కరీంనగర్ -9441195765


\లాప్టాప్ సంసారాలు, మొబైల్స్ స్నేహాలు, ఆన్లైన్ చదువులు, యూట్యూబ్ ఆటలు, జూమ్ మీటింగ్లు, ఇంస్టాగ్రామ్ ప్రేమలు, జొమాటోస్ స్విగ్గి భోజనాలు  అయినాక ప్రస్తుత వేగవంతమైన జీవితంలో అనుబంధాలు కుంచించుకొని పోయినాయి. ఇంకా ఎక్కువ మాట్లాడితే, వాటిని కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టొచ్చా అనే సందేహాలు కలుగుతున్నాయి. 

అనుబంధాలు అంటే ఏంటి? 

అను+ బంధం.. దగ్గరగా కట్టే బంధం. తెంపినా తెగిపోనిది రక్తసంబంధం భార్యా,భర్త ప్రియురాలు ప్రేమ సంబంధం.
గురు, శిష్యుడు, స్నేహితుడు ధర్మానుబంధం, ఉద్యోగ వ్యాపారాలలో కర్మ సంబంధం.
ఇందులో ఏ బంధమైనా, ఇద్దరు వ్యక్తుల మధ్యన నిర్మింపబడే మనో వంతెన అది. అనుబంధాల ద్వారా, ఇద్దరికీ భద్రత, స్థిరత్వం కలిగమిడిని కలిగి ఒక  సుస్థిరత ఏర్పడుతుంది. నీకు నేను రక్షా, నాకు నువ్వు రక్ష అనే ధైర్యం, ఇద్దరిలోనూ  కలుగుతుంది.

అనుబంధాలు ఎందుకు దెబ్బ తింటున్నాయి? 

 ఉద్యోగాల కోసం, తల్లిదండ్రులను వదిలి, మెట్రో నగరాలకు, విదేశాలకు వెళ్లాల్సి వస్తుంది.  కుటుంబాలకు దూరమై ఉద్వేగాలు పెరుగుతున్నాయి. కలుసుకునే సమయం తక్కువైపోతుంది. కష్టసుఖాలు, పంచుకునే వ్యక్తులకు దూరమవుతున్నారు. న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఏర్పడినాక, పిల్లలకు అమ్మమ్మ తాతయ్యల ద్వారా అందే కథలు కంచికి చేరిపోయినాయి. వస్తుజాల సమాజం ఏర్పడింది. ఎవరిని అడిగినా నో టైం... నో టైం... బట్ ఇంక్రీజ్డ్... స్క్రీన్ టైం. పోలికలు పెరిగి, మనుషులను అశాంతికి గురి చేస్తున్నాయి. నేను కేంద్రంగా కెరీర్ అనేది ఏర్పడి, వ్యక్తి తనకు తానే పరిమితమైపోతున్నాడు. ఈలోగా విలువలు దూరం జరిగిపోతున్నాయి. తాత్కాలిక సుఖాలు, కొంత  గందరగోళాన్ని సృష్టించి అనుబంధాల నుండి మనుషులను వేరు చేస్తున్నాయి. 

అనుబంధాలకు మూలం ప్రేమ!!

సంగత్ సంజాయతే  కామః... భగవద్గీత(2.62)లో చెప్పినట్లు సాంగత్యం వలననే ప్రేమ అనుబంధం, పుడతాయి. ఉద్యోగాలు దూరం అయినాక, పిల్లలు తల్లిదండ్రులతో ఉండే అవకాశం తగ్గిపోయి, వీడియో కాల్స్ ద్వారానే పలకరించుకోవడం జరుగుతుంది. అయితే ఇవి మనిషిని చూపించగలవు, కానీ ఒక స్పర్శను అందించలేవు. అందుకే ఇద్దరి మధ్య గ్యాప్ ఏర్పడుతుంది. ఇంగ్లీషులో ఈమెయిల్ రాయచ్చు కానీ అమ్మ కాళ్లకు దండం పెట్టినప్పుడు కలిగే అనుభూతిని పొందలేము. కుటుంబంలోని వారు అందరూ కలిసి ఒకే చోట కూర్చొని, ఎవరి ఫోన్ లలో వారు మునిగిపోవడం కాదు, కలిసి మాట్లాడుకోవడం కలసి భోజనం చేయడం ముఖ్యం. (Digital detox) పండుగలకు కలవడం ద్వారా,  అనుబంధాలు పెరుగుతాయి. సంస్కృతి, పర్యాప్తి చెందుతుంది. మత గ్రంథాల పైన విశ్వాసం కలిగి మార్గదర్శనం అవుతుంది. ప్యాకేజీల వలలలో చిక్కి, ఒకే ఇంట్లో భార్యాభర్తలు వేరు వేరు లాప్టాప్ లతో కాపురం చేయాల్సి వస్తుంది. కాసేపు కూర్చొని మాట్లాడుకునే సమయం లేదు, వారి మధ్య ఎడం పెరిగిపోయింది. 
కాపురాలు నిలబడే పరిస్థితి లేకుండా పోయింది. 

అహం వదిలితేనే అనుబంధం!!

కుచేలుడు రాజు ముందు సిగ్గుపడకుండా, పాత స్నేహితుడి ని కౌగిలించుకున్నాడు. అట్లా బంధుత్వానికి, స్నేహానికి మధ్య పొరలను తీసివేసుకోవాలి. శ్రీరాముడు, అడుగడుగునా తనతో అనుబంధం పెనవేసుకున్న, వారిని కలుపుకుంటూ విజయం సాధించి, లోకానికి ఆదర్శ పురుషుడిగా నిలబడ్డాడు. ఈర్ష్య ను వదిలివేయాలి. క్షమా గుణాలను అలవర్చుకోవాలి. వ్యక్తులతో సంబంధం కాదు హృదయంతో సంబంధం పెంచుకుంటే అనుబంధాల రెక్కలు గట్టిపడతాయి. 

సర్వేజనాః సుఖినోభవంతు!!

కుటుంబ సభ్యుల తో అనుబంధాన్ని కలిగి ఉండటంతో పాటు మనిషి మంచి గుణాలను కలిగి ఉండడమే గొప్ప. తత్వం అసి ఎదుటివారిలో నిన్ను చూసుకోవాలి. చుట్టుపక్కల వారితో స్నేహంగా ఉండాలి. త్యాగే నైకేన అమృతత్వ మానశుః...ఉపనిషత్ 
చెప్పినట్టు, త్యాగం ద్వారానే అమరత్వం. బంధం గట్టి పడడానికి నీవు ఏం ఎదుటివారి నుండి పొందుతావని కాదు,
ఏమిచ్చావు అన్నదే ముఖ్యం.
స్వార్థంతో కూడిన బంధం కలకాలం నిలువదు. ధర్మేణ సంబంధం... ధర్మంతో కూడిన సంబంధం శాశ్వతంగా ఉంటుంది. 
సర్వేజనాః సుఖినోభవంతు... అందరూ సుఖంగా ఉండాలి, అందులో నేనుండాలి, అనేది అనుబంధాల యొక్క అంతిమ లక్ష్యం.

కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
అణిమ - మహిమ -------------------------------- అష్ట సిద్ధులు అనే మాట ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం. ఇంతకూ ఆ అష్ట సిద్ధులు ఏంటో తెలుసా? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - ఈ ఎనిమిదింఃఇనీ అష్టసిద్ధులు అంటారు. ఈ ఎనిమిది సిద్ధులు సామాన్యమైనవి కావు. వేటి ప్రానాన్యం వాటివే. వాటిలో మొదటిదైన అణిమ అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేసుకోవడం. మహిమ అంటేనేమో శరీరాన్ని పెద్దదిగా చేసుకోవడం. ఈ రెండింటినీ సాధించిన వాడు ఆంజనేయుడు. సీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఈ రెండు సిద్ఝులనూ ఆచరించి చూపాడు. లంకలో ప్రవేశించినప్పుడు, సూర్యాస్తమయం తర్వాత పిల్లి అంత చిన్నవాడిలా మారిపోయి ఆశ్చర్యకరమైన రూపాన్ని పొందాడు. వృషదంశకమంటే పిల్లి. అలాగే, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సముద్రాన్ని దాటేటప్పుడు మహిమ సిద్ధిని ప్రదర్శించాడు. ఆంజనేయుడి బలపరాక్రమాలను తెలుసుకోవాలనుకున్న దేవతలు దక్షప్రజాపతి కుమార్తె అయిన క్రోధవశకు జన్మించిన నాగమాత సురసాదేవిని కోరారు. అంతట సురసాదేవి రాక్షస దేహం ధరించి "దేవతలు నిన్ను ఆహారంగా సమర్పించారు. నా నోటిలోకి ప్రవేశించు" అని అడుగుతుంది. అప్పుడు 80 యోజనాల భారీకాయుడైన హనుమ కోసం 90 యోజనాల నోరు తెరిచిన ఆ సురసాదేవి నోట్లోకి ప్రవేశించి, ఆమె నోరు మూసే లోపల, బొటన వేలడంతవాడై బయటకు వచ్చేశాడు. అదీ హనుమంతుడి శక్తి!! - యామిజాల జగదీశ్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం