చరిత్రలో ధీర వీర వనితలు: - అనువాదం...అచ్యుతునిరాజ్యశ్రీ


 డా.కె.జానకిగారిRole of women infreedom struggle in Andhra Pradesh
వేదకాలం నుంచి భారతీయ వనితలు సర్వరంగాల్లో నిష్ణాతులు. హూణులు ముస్లింల దండయాత్రలవల్ల దేశం ఆర్ధిక సామాజిక రంగాల్లో పతనమై స్త్రీలకు రక్షణ కరువైంది.బాల్య వివాహాలు,సతీసహగమనం,పరదా పద్ధతితో అతలాకుతలమైంది.కానీ యుద్ధంలో  పరిపాలనలో నైపుణ్యంతో విదేశీయుల ప్రశంసలు పొందినవారెందరో! ఝాన్సీలక్ష్మీబాయి అత్యంత ధైర్య సాహసాలు,పోరాట యోధురాలని ప్రశంసించారు బ్రిటిష్వాడైన సర్.హ్యూజ్ రోజ్.ఆమె రాజ్యంలోని మహిళలు పిల్లలు వాలంటీర్లుగా, ఆహారం నీరు సైనికులకు అందించారు.లలితా బెన్ బక్షి  గుర్రాన్ని నడపటంలో  చాతుర్యం కలది.1858మార్చిలోఆ ఝాన్సీరాణీకి యుద్ధంలో చేయూత నిచ్చింది.భవన గేట్లు మూసేందుకై, శిధిలమైన ప్రాంతాలను బాగుచేసేందుకు మగువలు తోడ్పడ్డారు. ఝార్నా గేటుకి రక్షణ గా నిలబడ్డారు.బ్రిటిష్ వారు సరాసరి తుపాకులతో కాపలాకాసిన ప్రాంతమది.బేగం జీనత్ మహల్ బహదూర్షా భార్య బ్రిటిష్ వారిని ఎదిరించిన ధీర మహిళ తమ సంపదని తిరిగి రాబట్టు కోసం జనాలకి పిలుపునిచ్చిన ప్రేరణ కలిగించిన  వనిత బేగం హజరత్ మహల్ ఔదుప్రాంత రాణి వీరోచిత పోరాటం చేసింది 1857 తర్వాత  సంఘసంస్కరణలు మొదలైనాయి బ్రహ్మ సమాజం ఆర్య సమాజం తీయసాఫికల్ సొసైటీ రామకృష్ణ మిషన్ తోడ్పడుతో చదువు స్త్రీల ఉద్ధరణ వెనుకబడిన తరగతుల వారి బాగోగులు చూడటం మొదలైంది ఇది దేశ స్వాతంత్రోద్యమానికి బీజం వేసింది సంఘ సేవ కోసం ఎంతోమంది ముందుకు వచ్చారు 19వ శతాబ్దిలో రాజకీయంగా గొప్ప మార్పు వచ్చింది బ్రిటిష్ వారిని వెళ్లగొట్టాలని గొప్ప దృఢ సంకల్పం భారతీయులు మొదలైంది బెంగాల్ లో స్త్రీలంతా బెంగాల్ విభజనను వ్యతిరేకించారు ఆందోళన లేవదీశారు గాంధీజీ ప్రభావం నెమ్మదిగా దేశమంతా తాకింది అంతకన్నా ముందే 19వ శతాబ్దిలో మార్గరెట్ కజిన్స్ తన ఇండియన్ వుమన్ హుడ్ టుడే అన్న పుస్తకంలో ఆనాటి విద్య వైద్య ఆర్థిక సామాజిక పరిస్థితుల్లో నాటి భారత స్త్రీని ఆమె చక్కగా విశ్లేషించింది ఆడపిల్ల వద్దు అనే భావం ఆ రోజుల్లో ఎక్కువగా ఉండేది మగ పిల్లలకే అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు ఆడపిల్ల పుట్టగానే చంపేవారు మగ పిల్లవాడు వంశోద్ధారకుడు అని ముక్తికి సోపానం అని భావించి మగ పిల్లల్ని దత్తత తీసుకునేవారు ప్రతి కుటుంబంలో మగపిల్లాడు మహారాజుగా వెలిగిన రోజులు బాల్యవివాహాలతో హిందూ సమాజంలో ఆడపిల్ల కష్టాలు ఎక్కువైనాయి ఏడాది మొదలు పదేళ్ల లోపు పిల్లలకి పెళ్లిళ్లు చేసేవారు ఎందుకంటే వారు బాల్యం నుంచి అన్ని రకాల పద్ధతులకు అలవాటు పడి అత్యంత బాధ్యతగా మెలుగుతారని నమ్మకం ఆనాటి అత్తలు ఆడపడుచులు కోడల్ని అష్ట కష్టాలు పెట్టి రాచిరంపాన పెట్టేవారు ఇక బాలవితంతువు కష్టాలు ఎంత అంతా అని కాదు పుట్టింటిలో ఆమె వెట్టి చాకిరీతో బానిసగా వంటింటికే అంకితమైన రోజులు అందుకే బాలింతలు మరణాలు కూడా ఎక్కువగా ఉండేవి పాతికేళ్లు నిండకుండానే మహిళలు భార్య తల్లిగా పిల్లల్ని కంటూ  చనిపోయేవారు.🌹
కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
మొల్ల విరులు;- .బి. అరుణ- పి జి టి - తెలుగు
ఉరుదూ తెలుగు సాహిత్య వారధి డా. సామల సదాశివ; రామ్మోహన్ రావు తుమ్మూరి
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం