కణము కణజాలాలు కణాంగాలు అవయవాలు పనిచేయడం వలన మెదడుకు చైతన్యం ఏర్పడింది.
కణాలు కణజాలాలు అవయవాలు పనిచేయకపోతే చైతన్యం ఆగిపోతుంది. గుండె కిడ్నీలు ఊపిరితిత్తులు పనిచేయకపోతే మెదడులో ఆ విభాగంలో మెదడు చైతన్యం ఆగిపోతుంది. కాబట్టి కచ్చితంగా మెదడుకు చైతన్యం కేవలం అవయవాలు కణాలు కణజాలాలు పనిచేయటం వలననే వచ్చిందని తెలుస్తుంది.
అంటే శరీరం పని చేయటం కోసమే మెదడు ఏర్పడిందని దానివల్లనే మెదడుకు చైతన్యం వచ్చిందని మనకు అర్థమవుతుంది.
ఆ చైతన్యంలో భాగంగా మెదడుకు సమాచారం చేరటం దానికి జవాబుగా మెదడు స్పందించి ప్రతిస్పందించడం వలన కూడా మెదడుకు చైతన్యం ఏర్పడిందని అర్థమవుతుంది. ఆ చైతన్యంలో భాగంగానే జ్ఞాపకశక్తి ఊహాశక్తి ఇంటెలిజెన్సీ ఏర్పడుతుందని గమనించాలి.
కాబట్టి శరీరం శరీరంలోని కణాలు కణజాలాలు అవయవాలు పనిచేయడం వలన మరియు మెదడుకు చేరిన సమాచారానికి మెదడు స్పందించి ప్రతిస్పందించడం వలన మెదడుకు చైతన్యం ఏర్పడుతుందని. అంతేకాక ఈ చైతన్యం వల్లనే జ్ఞాపకశక్తి ఊహాశక్తి ఇంటెలిజెన్సీ మెదడుకు ఏర్పడిందని మనం చెప్పవచ్చు. మరియు నిరూపించవచ్చు.
======================================================
డా ప్రతాప్ కౌటిళ్యా
విశ్రాంత అధ్యాపకులు.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి