లంకను ఢీకొన్న అయోధ్య: - - డాక్టర్.సి.వసుంధర. చెన్నై.


అమావాస్య లేకపోతే పౌర్ణమికి
విలువలేదు. 

చెడు లేకపోతే మంచికి విలువ లేదు. 
 
దుర్మార్గమే లేకపోతే సాధుత్వానికి 
విలువలేదు. 

అంధత్వం వచ్చినప్పుడు కదా  నేత్రవిశిష్టత,
అర్థమయ్యేది. 
ఇది మంచి అని చెప్పడానికి పక్కన చెడ్డ ఉండాలి. 
ఆ రెండు అక్కచెల్లెళ్ళు కాదు 
పక్కా శత్రువులు. 
మంచి చెడుల మధ్య  అనాదిగా
మొదలైందియుద్ధం.
త్రేతాయుగ కథ, మంచి చెడుల  సంగ్రామం. దాని పేరే రామ రావణ
యుద్ధం.
మంచి ఒక మెట్టు ఎక్కితే, చెడు పడుతుంది చీకటి బాట. సత్యంతెలిసినా తెలివి లేని చెడు
తెలుసుకోదు తన 
వ్యవహారం.
అందుకే యుగాలు మారుతున్నా, జగాలనంటుకొని
గోడ మీద బల్లిలా
చెడు, కలియుగంవరకు  అతుక్కొనేఉంది మనుషులను 

ద్వాపరలో దుర్యోధనాథుల రూపంలో లోక విధ్వంసానికి ముందడుగు వేసినా, నిలువెత్తు మంచి, కృష్ణ అవతారమై తుంచిపారేసింది
చెడు బలాన్ని.

కలియుగంలో దానికి వరం, దుర్మార్గం
 చెడుబలం కాల రూపమై కబళిస్తున్నది 
మంచినీ. దుష్టుని చేతలు నేడు గొప్ప రాతలైనాయి. ధర్మదేవత ఒక్క కాలు మీద నిలబడి నిరాశ నిస్పృహలతో సహనాన్ని కోల్పోతున్న ది.

కలియుగ సంగ్రామం,కలిపురుషుని ఉగ్రరూపం  
తట్టుకునే నేడు బతకాలి మంచి మనిషి. 

అవతారదైవశక్తి
క్షిప్రత తగ్గి దుష్టత్వదుమారం
కష్టంసాధ్యమాయేనని
 దేవి భాగవతం చెప్తున్నదని పెద్దల మాట.
 చెడునిఎదుర్కొనే శక్తి ఇవ్వగలిగింది పరాశక్తిఒక్కటె. ఆమెను
కలి కల్మషాల
 జయించే శక్తి మంచికి ఇవ్వమని ప్రార్థిద్దాం.మనవంతు గా మంచికే ఓటు.
చెడు చీడపురుగు 
అమ్మ కన్ను తెరిస్తే పరుగో పరుగు.
కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం
గంగిగోవు పాలు గరిటెడైనను చాలు: --ఎం బిందుమాధవి
చిత్రం