డ్రామా....!?:-డా ప్రతాప్ కౌటిళ్యా.
 

మనం ఏమాత్రం అవకాశం ఇచ్చిన మన మైండ్ లో (గతం) జ్ఞాపకం లేదా భవిష్యత్తు కీ సంబంధించిన ఊహ ఒక డ్రామాలా నడుస్తుంటుంది. జరిగిపోయిన దాని గురించి కానీ జరగబోయే దాని గురించి కానీ ఒక డ్రామా మన మైండ్ లో నడుస్తూనే ఉంటుంది. దీనివల్ల భయంకరమైన -బ్రమా- భయము-కలుగుతాయి. మరి ఈ డ్రామాను ఆపాలంటే ఏం చేయాలి. 
వర్తమానాన్ని అంటే మన కళ్ళ ముందు ప్రస్తుతం మన ముందు ఉన్న దానిపై మనసు నిలపాలి దీన్నే మనం ఏకాగ్రత అంటాం. దీన్ని కేవలం చేస్తున్న పని వలన కానీ వర్తమానానికి చెందిన ఆలోచనలతో ఈ డ్రామాను ఆపవచ్చు. జరిగిపోయిన అంశం జరగబోయే దాని గురించి ఊహించుకుని జ్ఞానాన్ని వదిలి బ్రమా భయానికి గురవుతాం కనుక ఆ డ్రామాలు ఆపడానికి వర్తమానంలో మన పనిలో గాని లేదా దానికి సంబంధించిన ఆలోచనలలో ఉంటే సరిపోతుంది. మరో అవకాశం గతం భవిష్యత్తు పట్ల బ్రమలను భయాన్ని తొలగించాలంటే జ్ఞానాన్ని అంటే అవేర్నెస్ను ఆశ్రయిస్తే సరిపోతుంది. 
ఈ డ్రామా మెదడుకు ఉన్న అవేర్నెసా లేక మెదడు చైతన్యమా తెలుసుకోవడం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే చైతన్యం అవేర్నెస్ వల్ల ఏర్పడుతుంది. ఈ అవేర్నెస్ గతంలోని జ్ఞాపకం వల్ల ఏర్పడుతుంది. దాన్నుంచి ఇమేజినేషన్ ప్రారంభమవుతుంది.. కనుక అవేర్నెస్ గతం వర్తమానం నుంచి పుట్టి భవిష్యత్తులోకి అంటే జ్ఞాపకం ఊహల్లోకి ప్రవేశిస్తుంది. కానీ కాన్సియస్నెస్ చైతన్యము ఇంటలిజెన్స్ వల్ల కూడా ఏర్పడుతుంది. ఇంటెలిజెన్స్ కూడా జ్ఞాపకం ఒకటే కాదు కదా. కనుక ఇంటలిజెన్సీ అవేర్నెస్ లో భాగం కావడం వలన మనకు అవేర్నెస్ వల్ల కాన్షియస్ నెస్ లేదా చైతన్యం ఏర్పడుతుందని నమ్ముతున్నాం. 
అంటే అవేర్నెస్ వల్ల మరియు చైతన్యం యంత్రాంగం వల్ల జ్ఞాపకము ఊహ పుడుతుందని మనకు తెలుస్తుంది. ఈ జ్ఞాపకాన్ని మరియు ఊహను కంట్రోల్ చేయాలంటే. వర్తమానంలో ఒక పనిని కానీ ఆలోచన కానీ ఏకాగ్రతలో చేయాలి. దీన్నే అవేర్నెస్ అంటాం. లేకుంటే మనలో ఆలోచనల పాత్రలు డ్రామా నడుస్తూనే ఉంటుంది. ఏమాత్రం అవకాశం ఇచ్చిన వర్తమానాన్ని ఆ డ్రామా ఆక్రమిస్తుంది. ఇక్కడ అత్యంత ముఖ్యమైన అంశాలు ఏవంటే అవేర్నెస్ మరియు మెదడు చైతన్యం. చైతన్యంలోకీ అవేర్నెస్ను ప్రవేశపెడితే నే ఊహ మరియు జ్ఞాపకం పనిచేస్తుంది. అవేర్నెస్ అంటే జ్ఞానము లేదా సమాచారం. కాన్సస్నెస్ అంటే మెదడు చైతన్యం. మెదడు చైతన్యంలోకి అవేర్నెస్ను ప్రవేశపెడితేనే డ్రామా నడుస్తుంది. కాబట్టి మెదడులో డ్రామాకు ముఖ్యకారకం అవేర్నెస్ అంటే సమాచారం. అది గతం కావచ్చు వర్తమానం కావచ్చు. లేదా భవిష్యత్తు కావచ్చు. అవేర్నెస్ వళ్ళనే కాన్షియస్నెస్ లేదా మెదడు చైతన్యం పనిచేస్తుంది. ఈ డ్రామా మొత్తానికి కారణం అవేర్నస లేక మెదడు చైతన్యమా అన్నదానికి సమాధానం మనకు కావాలి...!?
===========================================
డా ప్రతాప్ కౌటిళ్యా 
విశ్రాంత అధ్యాపకులు.
కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
అణిమ - మహిమ -------------------------------- అష్ట సిద్ధులు అనే మాట ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం. ఇంతకూ ఆ అష్ట సిద్ధులు ఏంటో తెలుసా? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - ఈ ఎనిమిదింఃఇనీ అష్టసిద్ధులు అంటారు. ఈ ఎనిమిది సిద్ధులు సామాన్యమైనవి కావు. వేటి ప్రానాన్యం వాటివే. వాటిలో మొదటిదైన అణిమ అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేసుకోవడం. మహిమ అంటేనేమో శరీరాన్ని పెద్దదిగా చేసుకోవడం. ఈ రెండింటినీ సాధించిన వాడు ఆంజనేయుడు. సీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఈ రెండు సిద్ఝులనూ ఆచరించి చూపాడు. లంకలో ప్రవేశించినప్పుడు, సూర్యాస్తమయం తర్వాత పిల్లి అంత చిన్నవాడిలా మారిపోయి ఆశ్చర్యకరమైన రూపాన్ని పొందాడు. వృషదంశకమంటే పిల్లి. అలాగే, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సముద్రాన్ని దాటేటప్పుడు మహిమ సిద్ధిని ప్రదర్శించాడు. ఆంజనేయుడి బలపరాక్రమాలను తెలుసుకోవాలనుకున్న దేవతలు దక్షప్రజాపతి కుమార్తె అయిన క్రోధవశకు జన్మించిన నాగమాత సురసాదేవిని కోరారు. అంతట సురసాదేవి రాక్షస దేహం ధరించి "దేవతలు నిన్ను ఆహారంగా సమర్పించారు. నా నోటిలోకి ప్రవేశించు" అని అడుగుతుంది. అప్పుడు 80 యోజనాల భారీకాయుడైన హనుమ కోసం 90 యోజనాల నోరు తెరిచిన ఆ సురసాదేవి నోట్లోకి ప్రవేశించి, ఆమె నోరు మూసే లోపల, బొటన వేలడంతవాడై బయటకు వచ్చేశాడు. అదీ హనుమంతుడి శక్తి!! - యామిజాల జగదీశ్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం