అనిస్ బేగం కిద్వాయ్ : - - యామిజాల జగదీశ్
 

అనిస్ బేగం కిద్వాయ్ కుటుంబం మొత్తం స్వాతంత్రోద్యమానికి అంకితమైంది. ప్రజాసేవే లక్ష్యంగా పని చేస్తూ మతసామరస్యానికి కృషి చేసింది. సంప్రదాయ కుటుంబం.
1906లో ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో షేక్ విలాయత్ అలీ దంపతులకు అనిస్ బేగం కిద్వాయ్ జన్మించారు. ఆమె భారత జాతీయ ఉద్యమంలో అంకితభావంతో పాల్గొన్నారు. ఆమె తండ్రి విలాయత్ అలీ, ఆమె భర్త షఫీ అహ్మద్ కిద్వాయ్ ఇద్దరూ స్వాతంత్ర్య సమరయోధులే. అలాగే ఆమె బావ రఫీ అహ్మద్ కిద్వాయ్ కూడా భారత జాతీయ ఉద్యమంలో నాయకుడు. ఆమె తండ్రి స్థానిక పత్రికలకు రాస్తుండేవారు. ఆయన ప్రముఖ న్యాయవాది. భర్త షఫీ అహ్మద్ అనిస్ బేగానికి బంధువే.
కిద్వాయ్ కుటుంబం మొత్తం ఖిలాఫత్ ఉద్యమంలో చురుకుగా పాల్గొనడం గమనార్హం. అయితే ఈ కారణంగా వారు బ్రిటిష్ పోలీసుల ఆగ్రహానికి గురయ్యారు.
సంపాదన పొందే కిద్వాయ్ కుటుంబ సభ్యులు తమ తమ ఉద్యోగాలను వదిలి భారత జాతీయోద్యమంలో పాల్గొనడం వల్ల ఆర్థిక ఇబ్బందులు కూడా తలెత్తాయి. అయినప్పటికీ, పోలీసులు లేదా ఆర్థిక కష్టాలు అనిస్ బేగం కిద్వాయ్ తిరుగులేని నిబద్ధతను రవ్వంతకూడా తగ్గించలేకపోయాయి. 
తన సోదరులకు ఇంటికొచ్చి ఉపాధ్యాయులు బోధించేటప్పుడు వినడం ద్వారా ఉర్దూ , ఇంగ్లీషు సాహిత్యాలను తెలుసుకున్న అనిస్ బేగం తన తండ్రి మరణం తరువాత, 1930ల చివరలో, ఇంటిపట్టున ఉండవలసి వచ్చింది. అయితే భారతదేశ స్వాతంత్ర్య పోరాటం ఆమె ప్రజా జీవితానికి ఓ బాట వేసింది. ఆమె చివరి వరకు జాతీయోద్యమంలోను రాజకీయాలలోను తన క్రియాశీల పాత్రను పోషించారు.
దేశ విభజన ఆమెను తీవ్రంగా బాధించింది, ముఖ్యంగా హిందువులు, ముస్లింల మధ్య మత సామరస్యం కోసం అవిశ్రాంతంగా కృషి చేసారు. దేశ విభజనను వ్యతిరేకించిన మతశక్తులు ఆమె భర్త షఫీ అహ్మద్ కిద్వాయ్ ప్రాణాలు తీశాయి. తన భర్తను కోల్పోవడం ఆమెకు వ్యక్తిగతంగా తీవ్ర  విషాదాన్ని మిగిల్చింది.
తన భర్త మరణానంతరం, అనిస్ బేగం కిద్వాయ్ ఢిల్లీలో మహాత్మా గాంధీని కలుసుకున్నారు, ఆయన మార్గదర్శకత్వంలో సుభద్ర జోషి, మృదులా సారాభాయ్ వంటి ఇతర మహిళా నేతలతో కలిసి పని చేయడం ప్రారంభించారు. 
దేశ విభజన కారణంగా తనలాగా బాధపడుతున్న మహిళలకు మద్దతు ఇవ్వడం, సహాయం చేయడం అనిస్ బేగం  లక్ష్యమైంది. బాధితుల కోసం ఆమె రెస్క్యూ క్యాంపులను ఏర్పాటు చేసారు. వారికి తన చేతనైన సహాయాన్ని అందించారు. ఈ సహాయసహకారాలే ఆమెకు 'అనిస్ ఆప' అనే ఆప్యాయతతో కూడిన మారుపేరును తెచ్చిపెట్టాయి.
అనిస్ కిద్వాయ్ రాజకీయ జీవితం అక్టోబర్ 24 (1954) న  సోదరుడు రఫీ మరణంతో ప్రారంభమైంది. ఆయన మరణానంతరం  కాంగ్రెస్ పార్టీ ఆమెకు రాజ్యసభ సీటునిచ్చింది. ఆమె కాంగ్రెస్ తరఫున 1957, 1962లలో రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. 
1961లో, ముస్లిం వ్యక్తిగత చట్టంలో సాధ్యమైన సంస్కరణలను పరిశీలించడానికి జవహర్‌లాల్ నెహ్రూ ఏర్పాటు చేసిన ఆరుగురు సభ్యుల పార్లమెంటరీ కమిటీలో అనిస్ బేగం ఏకైక మహిళా సభ్యురాలు. మొదటి సమావేశంలో ముస్లిం ఎంపీలు, మంత్రులు దీనిని తీవ్రంగా వ్యతిరేకించడంతో వెంటనే రద్దు చేశారు.
దేశ విభజన సమయంలో ఆమె  అనుభవాలను " ఆజాదీ కి చాన్ మే " అనే పుస్తకం కళ్ళకు కట్టినట్లు వివరించాయి. ఇదే కాకుండా ఆమె జుల్మ్, అబ్ జింకే దేఖ్నే వంటి పుస్తకాలను కూడా రాశారు. ఇది మతతత్వ శక్తుల క్రూరత్వాన్ని ఖండించింది. ఆమె వ్యాసాల సంకలనం, నజ్రే ఖుష్ గుజ్రే కూడా 1976లో వెలువడింది. 
అనిస్  సాహిత్య నైపుణ్యాన్ని భారత ప్రభుత్వం, సాహిత్య కళా పరిషత్  గుర్తించి సత్కరించాయి. 
అటు రాజకీయాలలోను, ఇటు సాహిత్యంలోను ఆమె తనదైన ముద్రవేసుకున్నారు. ప్రజా సేవతోనూ ప్రత్యేక గుర్తింపు పొందిన అనిస్ బేగం కిద్వాయ్  1982  జూలై 16న మరణించారు. 
"మర్సియా 1947" అనే టైటిల్ తో ఒక లఘు చిత్రం విడుదలైంది. దేశ విభజన నుండి బయటపడిన, వివిధ దశలలో మతాలు, సరిహద్దుల్లో మతపరమైన హింసకు గురైన మహిళల మౌఖిక అనుభవాల గురించి నిర్మించిన చిత్రమిది. విభజన తర్వాత మూడేళ్లపాటు అపహరణకు గురైన మహిళలను రక్షించిన ఇద్దరు సామాజిక కార్యకర్తలైన అనిస్ కిద్వాయ్ కమలా బెన్ పటేల్ కథనాల ఆధారంగా ఈ చిత్రాన్ని  రూపొందించారు.

కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
అణిమ - మహిమ -------------------------------- అష్ట సిద్ధులు అనే మాట ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం. ఇంతకూ ఆ అష్ట సిద్ధులు ఏంటో తెలుసా? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - ఈ ఎనిమిదింఃఇనీ అష్టసిద్ధులు అంటారు. ఈ ఎనిమిది సిద్ధులు సామాన్యమైనవి కావు. వేటి ప్రానాన్యం వాటివే. వాటిలో మొదటిదైన అణిమ అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేసుకోవడం. మహిమ అంటేనేమో శరీరాన్ని పెద్దదిగా చేసుకోవడం. ఈ రెండింటినీ సాధించిన వాడు ఆంజనేయుడు. సీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఈ రెండు సిద్ఝులనూ ఆచరించి చూపాడు. లంకలో ప్రవేశించినప్పుడు, సూర్యాస్తమయం తర్వాత పిల్లి అంత చిన్నవాడిలా మారిపోయి ఆశ్చర్యకరమైన రూపాన్ని పొందాడు. వృషదంశకమంటే పిల్లి. అలాగే, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సముద్రాన్ని దాటేటప్పుడు మహిమ సిద్ధిని ప్రదర్శించాడు. ఆంజనేయుడి బలపరాక్రమాలను తెలుసుకోవాలనుకున్న దేవతలు దక్షప్రజాపతి కుమార్తె అయిన క్రోధవశకు జన్మించిన నాగమాత సురసాదేవిని కోరారు. అంతట సురసాదేవి రాక్షస దేహం ధరించి "దేవతలు నిన్ను ఆహారంగా సమర్పించారు. నా నోటిలోకి ప్రవేశించు" అని అడుగుతుంది. అప్పుడు 80 యోజనాల భారీకాయుడైన హనుమ కోసం 90 యోజనాల నోరు తెరిచిన ఆ సురసాదేవి నోట్లోకి ప్రవేశించి, ఆమె నోరు మూసే లోపల, బొటన వేలడంతవాడై బయటకు వచ్చేశాడు. అదీ హనుమంతుడి శక్తి!! - యామిజాల జగదీశ్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం