సాగర్ కబుర్లు *(మా..అక్క)----డా.కె .ఎల్.వి.ప్రసాద్ -- హనంకొండ .-9866252002-8886991785

సాగర్ ..అనబడే ,నాగార్జున సాగర్ లో నేను చదివింది ,ఇంటెర్మీడియేట్ రెండు సంవత్సరాలు .
అంటే పందొమ్మిదివందల డబ్బయి రెండు ...డబ్భై నాలుగు అన్నమాట !కానీ ...అంతకుముందు అప్పుడప్పుడు సాగర్ వెలు 
తుండేవాడిని .కారణం ,మా పెద్దక్క కుమారి కానేటి మహానీయమ్మ ,సైన్స్ టీచరుగా ,దక్షిణ విజయపురిలో ,హైస్కూలు లో పనిచేసేది .అందుచేత ,హైదరాబాద్ వైపునుంచి వస్తే ,బస్సులో వయా మల్లేపల్లి వెళ్ళేవాళ్ళం .విజయవాడ వైపునుండి వస్తే ,గుంటూరు _మాచర్ల 
పాసెంజర్ లో వెళ్లేవాళ్లం.ఉన్నది అదొక్కటే రైలు పయిగా మీటర్ గేజ్ !ఎంతకీ ఓ ..పట్టాన మాచర్ల వచ్చేదికాదు.రైలు మాచర్ల లో దిగేసరికి ,వళ్ళు హూనం అయిపోయేది.మళ్లీ అక్కడ బస్సుపట్టుకుని రైట్ బాంక్ ప్రయాణం.బస్సు దిగగానే స్వర్గంలో అడుగుపెట్టిన ఫీలింగ్ ఉండేది.ఇంట్లో వచ్చి పడి ...పోయామన్నంత ఆనందం !నేను సాగర్ చూసేసరికి ,డామ్ కట్టడం పూర్తి కాలేదు గ్యాలరీ లో నుంచి పైలాన్ కు వెల్లవలసి వచ్చేది .అదో భయంతో కూడిన సరదా !నాకు ఎవరోవకరు తోడువుండేవారు .అందులో రాంగోపాల్ ,నరసింగరావు ,నారాయణ రావు గారలు,ముఖ్యులు.అక్కయ్య ,విజయపురి సౌత్ హైస్కూలు లో పని చేస్తున్నప్పుడు ,శివశంకరం గారు హెడ్మాష్టరు గా 
పనిచేసేవారు .శర్మ గారు ,హరనాథ్ బాబా గారు ,పీటర్ పాల్ గారు ,నాగభూషణం గారు ,సత్యవతి గారు ,సుబ్బారావు గారు ,రాఘవయ్య గారూ ,శేషారత్నం గారు ,తెలుఁగు మాష్టారు ,డ్రిల్లు మాష్టారు (వీరి పేర్లు గుర్తు లేవు ) ఇంకొక మాథ్స్ మాష్టారు ఉండేవారు .మిగతా ఎవరూ గుర్తు లేరు .అక్క ..ఉదయం ఎదైనా టిఫిన్ చేసి ,మధ్యాహ్నం ఇంటికి వచ్చి లంచ్ చేసి వెళ్ళేది .సాయంత్రం ఉచిత ట్యూషన్ కు పిల్లలు వచ్చేవారు .వాళ్ళువెళ్లిపోయేవరకు వంట ప్రయత్నాలు వుండేవికాదు.ఒకోసారి ఆకలి అయిపొయి పిచ్చిలేచిపోయేది .అసలే నాకు ఆకలి 
ఎక్కువమరి !అసలు కొసమెరుపు ఆదివారం **అక్క నూరుశాతం శాఖాహారి కనుక ,అందులోనే ప్రత్యేకమయిన వంటలు చేసేదీ .రుచికరంగా ఉండేవి అక్క వంటలు .ఇక సాయంత్రం ఐదుగంటల ప్రాంతంలో అమ్మలక్కలు ఇంటికి వచ్చేవారు .బడికి దగ్గరలో 
ఏ _౫౫,(యాభైయైదు )క్వార్టర్ లో ఉండేది.దగ్గరలొ పరిచయం ఉన్న గృహిణులందరూ అక్కడకి చేరుకునేవారు.రకరకాల ముచ్చట్లతో నడుస్తుండేది సమావేశం.రాత్రి ,ఏడు _ఎనిమిది  అయిపోతుండేది.వీళ్లు ఓపట్టానా కదిలేవారు కాదు .నాకు ఆకలి అయి 
కడుపులో మెలిపెట్టేది.అడిగితే ..అక్క కోప్పడుతుందని భయం !ఇక ఇలా లాభం లేదనుకుని ,దొడ్డివైపు జామచెట్టుకు ఒక ఇనుప పలక వేలాడదీసి ,'బెల్ ' కొట్టినట్టు కొట్టేవాడిని .అంతే అది విని ,"అమ్మొ ..ప్రసాద్ బెల్ కొట్టేసాడు " అని నవ్వుకుంటూ లేచి వెళ్ళిపోయేవారు .అప్పుడు వంట చేసి పెట్టేది అక్క..మేము ఇంట్లో లేనపుడు వంటచేసుకోకుండానే పడుకునేదట అక్క ప్రేమ ,అభిమానం ,క్రమశిక్షణ ,ఆ ..జ్ఞాపకాలు నా ..ప్రతి కదలికలోనూ గుర్తుకు వస్తాయ్ .ఒక్కోసారి ఆలోచిస్తే ..కన్నీళ్లు జల ..జల ..కారిపోతుంటాయ్ !ప్రేమమయి ..త్యాగమయి .మా ..అక్క స్వర్గీయ కానేటి మహానీయమ్మ !!



కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
అణిమ - మహిమ -------------------------------- అష్ట సిద్ధులు అనే మాట ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం. ఇంతకూ ఆ అష్ట సిద్ధులు ఏంటో తెలుసా? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - ఈ ఎనిమిదింఃఇనీ అష్టసిద్ధులు అంటారు. ఈ ఎనిమిది సిద్ధులు సామాన్యమైనవి కావు. వేటి ప్రానాన్యం వాటివే. వాటిలో మొదటిదైన అణిమ అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేసుకోవడం. మహిమ అంటేనేమో శరీరాన్ని పెద్దదిగా చేసుకోవడం. ఈ రెండింటినీ సాధించిన వాడు ఆంజనేయుడు. సీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఈ రెండు సిద్ఝులనూ ఆచరించి చూపాడు. లంకలో ప్రవేశించినప్పుడు, సూర్యాస్తమయం తర్వాత పిల్లి అంత చిన్నవాడిలా మారిపోయి ఆశ్చర్యకరమైన రూపాన్ని పొందాడు. వృషదంశకమంటే పిల్లి. అలాగే, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సముద్రాన్ని దాటేటప్పుడు మహిమ సిద్ధిని ప్రదర్శించాడు. ఆంజనేయుడి బలపరాక్రమాలను తెలుసుకోవాలనుకున్న దేవతలు దక్షప్రజాపతి కుమార్తె అయిన క్రోధవశకు జన్మించిన నాగమాత సురసాదేవిని కోరారు. అంతట సురసాదేవి రాక్షస దేహం ధరించి "దేవతలు నిన్ను ఆహారంగా సమర్పించారు. నా నోటిలోకి ప్రవేశించు" అని అడుగుతుంది. అప్పుడు 80 యోజనాల భారీకాయుడైన హనుమ కోసం 90 యోజనాల నోరు తెరిచిన ఆ సురసాదేవి నోట్లోకి ప్రవేశించి, ఆమె నోరు మూసే లోపల, బొటన వేలడంతవాడై బయటకు వచ్చేశాడు. అదీ హనుమంతుడి శక్తి!! - యామిజాల జగదీశ్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం