మామిడి పళ్ళ మహిమ ----డా.కె .ఎల్.వి .ప్రసాద్, హనంకొండ,వరంగల్.

చిన్నతనంలో చిలిపి పనులు అనేక రూపాల్లో ఉంటాయి. అప్పుడు అవి చిలిపి పనులు అని ,అవి తప్పుడు పనులని ,పిల్లలు అలాంటి పనులు చేస్తే పెద్దలకు చెడ్డపేరు వస్తుందని కూడా తెలియని లేత వయసు అది. ఎన్నో .. ఎన్నెన్నో .. కోర్కెలు వున్నా ,వాటిని పెద్దవాళ్ళు తీర్చలేరని తెలిసినా ,వాటికోసం ,ఆరాటపడడం ,పిల్ల చేష్టలు అనడానికి నిదర్శనం. 
 మా .. ఇల్లు గోదావరి వైపు ఉండేది . ఇంటికి అతి దగ్గరలోనే ఎత్తైన ఏటిగట్టు ,దానిపక్కనే పల్లపు ప్రదేశం ,పంటకాల్వ ప్ర వహిస్తూ ఉండేది. దానిపక్కనేకంకర రోడ్డు.ఆరోడ్డు గుండానే ఎద్దుల బళ్ళు,గుర్రపు బళ్ళు,అప్పుడప్పుడు కార్లుట్రాక్టర్లు,నడుస్తుండేవి.గుర్రపుబండిలో
సినీమా ప్రచారం జరిగేది.మంచి సినీమా పాటలు వేస్తూ కరపత్రాలు గాలిలో విసిరేవారు.అవి అందుకోవడానికి ఆ గుర్రపు బండి వెనుక పరిగెత్తేవాళ్ళం!ఇకఅసలు విషయానికొస్తే ఆ రోడ్డు పక్క పెద్ద కొబ్బరి తోట,అందులో మామిడి చెట్లు ఉండేవి.రోడ్డును వేరు చేస్తూ ముళ్ల కంచె (దడి)ఉండేది.ఆ తోట యజమాని మా వూరికి దగ్గరలోని ‘ చింతల పల్లి’ అనే ఊరిలోఉండేవారు.యజమాని అసలు పేరు తెలీదు కానీ ఆవిడను,చిలకమ్మఅనీ,ఆ..తోటను’ చిలకమ్మ గారి తోట’,అనేవారు.దడి కి దగ్గరలో పెద్దమామిడి చెట్టు ఉండేది.తియ్యటి రసాల మామిడి చెట్టు.వేసవిలో నిండుగామామిడి కాయలు కాసేది.మా ఇంటి ముందు ఏటిగట్టు మీద నిలబడిచూస్తే,చెట్టూ-చెట్టునిండా కాయలు కనిపించేవి.మనసంతా,వాటిని తినా--లనే కోరికతో నిండిపోయేది.ఆ తోటకు కాపలా కాయడానికి ఒక లోకల్   వ్యక్తిని నియమించు కునేవారు.ఆయన చెట్టు దరికి చేరనిచ్చేవాడు కాదు.ఇంట్లో అడిగే దైర్యం లేదు .కొనుక్కుని తినే వెసులుబాటు లేదు.ఆ..తియ్య
ని,మామిడి పండు తినాలనే కోరికను చంపుకోలేని పరిస్థితి.ఒక ఉపాయం ఆలోచించి తెల్లవారుతున్న సమయంలో ముళ్లకంచెకు
కొద్దిగా,అటూ-ఇటూ జరిపి,మార్గం చేసుకుని,ముల్లుగుచ్చుకున్నాలెక్క-చేయక,లోపలికి దూరేవాడిని,5-6,మామిడిపళ్ళు చెట్టుకింద పడివుండేవి.వాటిని తస్కరించి మళ్ళీ జాగ్రత్తగా దడి దాటి బయటి కి,అతి కష్టం మీద వచ్చేవాడిని.ఇంట్లో తెలీకుండా చాటుగా తినేసేవాడిని.కొసమెరుపు ఏమి-టంటే ,నాకు పోటీగా,మా ఇంట్లో మా చిన్నక్క ఉండేది.ఎక్కువ సార్లు గెలుపు నన్నేవరించేది .ఆ మామిడి పళ్ళ రుచి ఎప్పటికీ మరచిపోలేను.ఇప్పుడు తింటున్నమామిడి పళ్లల్లో,ఆ..రుచి దొరకడం లేదు…ఆశ్చర్యం కదూ…!!


                                 


కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
అణిమ - మహిమ -------------------------------- అష్ట సిద్ధులు అనే మాట ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం. ఇంతకూ ఆ అష్ట సిద్ధులు ఏంటో తెలుసా? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - ఈ ఎనిమిదింఃఇనీ అష్టసిద్ధులు అంటారు. ఈ ఎనిమిది సిద్ధులు సామాన్యమైనవి కావు. వేటి ప్రానాన్యం వాటివే. వాటిలో మొదటిదైన అణిమ అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేసుకోవడం. మహిమ అంటేనేమో శరీరాన్ని పెద్దదిగా చేసుకోవడం. ఈ రెండింటినీ సాధించిన వాడు ఆంజనేయుడు. సీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఈ రెండు సిద్ఝులనూ ఆచరించి చూపాడు. లంకలో ప్రవేశించినప్పుడు, సూర్యాస్తమయం తర్వాత పిల్లి అంత చిన్నవాడిలా మారిపోయి ఆశ్చర్యకరమైన రూపాన్ని పొందాడు. వృషదంశకమంటే పిల్లి. అలాగే, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సముద్రాన్ని దాటేటప్పుడు మహిమ సిద్ధిని ప్రదర్శించాడు. ఆంజనేయుడి బలపరాక్రమాలను తెలుసుకోవాలనుకున్న దేవతలు దక్షప్రజాపతి కుమార్తె అయిన క్రోధవశకు జన్మించిన నాగమాత సురసాదేవిని కోరారు. అంతట సురసాదేవి రాక్షస దేహం ధరించి "దేవతలు నిన్ను ఆహారంగా సమర్పించారు. నా నోటిలోకి ప్రవేశించు" అని అడుగుతుంది. అప్పుడు 80 యోజనాల భారీకాయుడైన హనుమ కోసం 90 యోజనాల నోరు తెరిచిన ఆ సురసాదేవి నోట్లోకి ప్రవేశించి, ఆమె నోరు మూసే లోపల, బొటన వేలడంతవాడై బయటకు వచ్చేశాడు. అదీ హనుమంతుడి శక్తి!! - యామిజాల జగదీశ్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం