రాజభటులున్నారు.వాళ్ళు చాలా కాలంగాపనిచేస్తున్నారు.అయినా పదోన్నతి లభించలేదు. ఆ విషయం పట్ల వారికి అసంతృప్తి ఉండేది.అర్థరాత్రి ఒక గజదొంగ ఒక ధనవంతుడి ఇంటిలో నగలు దొంగిలించిమూటగట్టుకుని పారిపోతూ గస్తీ తిరుగుతున్న రాముడి,రంగడి కంటపడ్డాడు.వాళ్ళు దొంగవెంటపడ్డారు.దారిలోపర్యవేక్షణ అధికారికనిపిస్తే విషయం చెప్పి దొంగవెంట పరుగెత్తారు.నగలమూట ఎక్కడ జారిపోతుందోనని గట్టిగా పట్టుకుని దొంగపరుగెడుతున్నాడు.ఓ పాడుబడిన ఆలయంవైపు వెళ్ళి దొంగకనిపించకుండా పోయాడు.అక్కడ భటులుదొంగకోసం వెదుకుతుండగా అధికారి వచ్చాడు."దొంగకనిపించకుండాపోయాడు.చుట్టుపక్కలవెదికాము.చెట్లచాటునచూశాము.దొంగజాడలేదు."అన్నారు అధికారితో."నగలమూట పట్టుకొని వాడు ఎంతోదూరంవెళ్ళలేడు.దారిలో భటులకంట పడితేప్రమాదమని తెలుసు.ఇక్కడే ఎక్కడోనగలమూటపడేసివుంటాడు.వెదకండి."అన్నాడు అధికారి.ఆలయం బయట గోడకు ఆనుకునివున్నఒక బండచాటున మసకవెలుగులో నగలమూట కనిపించింది."హమ్మయ్యా!నగలు దొరికాయి.పరుగెత్తిన శ్రమ వృధా పోలేదు."అన్నారు రాముడు,రంగడు."మీరు ఆచెట్టు ఎక్కి కూర్చోండి.నేను నగలుతీసుకుని వెడతాను."అన్నాడు అధికారి.ఆ మాటలకు వాళ్ళు అయోమయంగా చూసి"అయ్యా!నగలు దొరికాయికదా!మేముఇక్కడవుండిచేసేదేమున్నది?"అన్నారు."నగలు దొరికినంత మాత్రాన బాధ్యత తీరిపోలేదు.నగలకంటే ముందు దొంగను పట్టుకోవడం ముఖ్యం.వాడు పట్టుబడకుంటేమళ్ళీ దొంగతనాలు చేస్తాడు.వాడు నగలకోసం ఇక్కడకు తప్పకుండా వస్తాడు. మీకు తోడు మరిఒకరిని పంపిస్తాను.దొంగ వచ్చేవరకూ వుండి రాగానే బంధించండి.అప్పుడేమీశ్రమకు ఫలితం.మీ ఉద్యోగ బాధ్యతకు సార్థకత.సమస్యకుతాత్కాలికంగా నగలు దొరకడం పరిష్కారంకావచ్చు.దొంగను బంధించటం శాశ్వత పరిష్కారం"అనిచెప్పి వెళ్ళిపోయాడు అధికారి.అధికారి ముందుచూపుకూ,ఆలోచనావిధానానికి నివ్వెరపోయారు.ఏసమస్యకైనా మూలాన్ని గుర్తించి,శాశ్వతపరిష్కారంకొరకు ప్రయత్నించాలని,జీవితంలో అభివృద్ది చెందాలంటే చేస్తున్న పనిలోశ్రద్దను,నైపుణ్యాన్ని,లోకజ్ఞానాన్ని,ముందుచూపును కల్గి వుండాలని గుర్తించారు.డి.కె.చదువులబాబు*9440703716ప్రొద్దుటూరు…
పరిష్కారం: --డి.కె.చదువులబాబు--*9440703716
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి