పరిష్కారం: --డి.కె.చదువులబాబు--*9440703716

 సమీరరాజ్యంలో రాముడు,రంగడు అనే
రాజభటులున్నారు.వాళ్ళు చాలా కాలంగా
పనిచేస్తున్నారు.అయినా పదోన్నతి లభించలేదు. ఆ విషయం పట్ల వారికి అసంతృప్తి ఉండేది.
అర్థరాత్రి ఒక గజదొంగ ఒక ధనవంతుడి ఇంటిలో నగలు దొంగిలించిమూటగట్టుకుని పారిపోతూ గస్తీ తిరుగుతున్న రాముడి,రంగడి కంటపడ్డాడు.వాళ్ళు దొంగ
వెంటపడ్డారు.దారిలోపర్యవేక్షణ అధికారి
కనిపిస్తే విషయం చెప్పి దొంగవెంట పరుగెత్తారు.నగలమూట ఎక్కడ జారిపోతుందోనని గట్టిగా పట్టుకుని దొంగ
పరుగెడుతున్నాడు.
ఓ పాడుబడిన ఆలయంవైపు వెళ్ళి దొంగ
కనిపించకుండా పోయాడు.అక్కడ భటులు
దొంగకోసం వెదుకుతుండగా అధికారి వచ్చాడు.
"దొంగకనిపించకుండాపోయాడు.చుట్టుపక్కలవెదికాము.చెట్లచాటునచూశాము.దొంగజాడలేదు."అన్నారు అధికారితో.
"నగలమూట పట్టుకొని వాడు ఎంతోదూరం
వెళ్ళలేడు.దారిలో భటులకంట పడితే
ప్రమాదమని తెలుసు.ఇక్కడే ఎక్కడో
నగలమూటపడేసివుంటాడు.వెదకండి."అన్నాడు అధికారి.
ఆలయం బయట గోడకు ఆనుకునివున్న
ఒక బండచాటున మసకవెలుగులో నగలమూట కనిపించింది.
"హమ్మయ్యా!నగలు దొరికాయి.పరుగెత్తిన శ్రమ వృధా పోలేదు."అన్నారు రాముడు,రంగడు.
"మీరు ఆచెట్టు ఎక్కి కూర్చోండి.నేను నగలు
తీసుకుని వెడతాను."అన్నాడు అధికారి.
ఆ మాటలకు వాళ్ళు అయోమయంగా చూసి"అయ్యా!నగలు దొరికాయికదా!
మేముఇక్కడవుండిచేసేదేమున్నది?"అన్నారు.
"నగలు దొరికినంత మాత్రాన బాధ్యత తీరి
పోలేదు.నగలకంటే ముందు దొంగను పట్టు
కోవడం ముఖ్యం.వాడు పట్టుబడకుంటే
మళ్ళీ దొంగతనాలు చేస్తాడు.వాడు నగల
కోసం ఇక్కడకు తప్పకుండా వస్తాడు. మీకు తోడు మరిఒకరిని పంపిస్తాను.దొంగ వచ్చేవరకూ వుండి రాగానే బంధించండి.అప్పుడేమీశ్రమకు ఫలితం.మీ ఉద్యోగ బాధ్యతకు సార్థకత.సమస్యకు
తాత్కాలికంగా నగలు దొరకడం పరిష్కారం
కావచ్చు.దొంగను బంధించటం శాశ్వత పరిష్కారం"అనిచెప్పి వెళ్ళిపోయాడు అధికారి.
అధికారి ముందుచూపుకూ,ఆలోచనావిధా
నానికి నివ్వెరపోయారు.
ఏసమస్యకైనా మూలాన్ని గుర్తించి,శాశ్వత
పరిష్కారంకొరకు ప్రయత్నించాలని,జీవితం
లో అభివృద్ది చెందాలంటే చేస్తున్న పనిలోశ్రద్దను,నైపుణ్యాన్ని,లోకజ్ఞానాన్ని,ముందుచూపును కల్గి వుండాలని గుర్తిం
చారు.
డి.కె.చదువులబాబు*9440703716
ప్రొద్దుటూరు… 
కామెంట్‌లు