వినయం – గర్వం:--సాత్విక్ సాయికుమారాచార్యులు,6వతరగతి,9491357842

 ఒకరోజు అశ్వారావుపేటనుండి ఉదయ్, వాళ్ల అన్నయ్య రాము,అక్క శ్వేత తమ తల్లిదండ్రులతో కలిసి ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి గుడికి వెళ్లారు. దేవుని దర్శనం అయిన తరువాత అక్కడి చెట్ల క్రింద కూర్చొని తమ కూడా తెచ్చుకున్న అల్పాహారం భుజించి కాసేపు విశ్రాంతి తీసుకుందామని దుప్పటి పర్చుకొని నడుం వాల్చారు. అంతకు ముందే వాళ్లు కొనుక్కున్న ప్రసాదాలు సంచీలో పెట్టుకొని తమ తల వద్దఉంచుకున్నారు. ఉదయ్ వాళ్ల అన్నయ్య రాము ప్రక్కప్రక్కనే పడుకున్నారు. అలసిపోవడంతో ఉదయ్ నిద్రలోకి జారుకున్నాడు. అక్కడి చెట్టుక్రింద చీమల పుట్టలో ఉన్న చీమలు ఆహారాన్ని వెతుక్కుంటూ బారులు తీరాయి. అందులో నల్ల చీమలు ఒకవైపు నుండి ఎర్రచీమలు మరో వైపునుండి వస్తున్నాయి. అవి రెండూ ఉదయ్ దాచుకున్న ప్రసాదం వైపుకి బయలు దేరాయి. ముందుగా వస్తున్న నల్లచీమలు తమ దారికి అడ్డుగా ఉన్న ఉదయ్ కాలి వద్ద కాసేపు ఆగి ఇలా అనుకున్నాయి. బాటసారులు విశ్రాంతి తీసుకుంటున్నారు. వారిని కదిలించకూడదు అని వినయంగా అనుకుంటూ కాలిపై నుండి మెల్లగా దాటసాగాయి. ఉదయ్ కి కాలిపై కితకితలు గా అనిపించి కాలిని పక్కకు జరుపుతాడు. దానితో  చీమలు ఇతను చాలా మంచివాడులా ఉన్నాడు మన దారికి అడ్డు తొలిగాడు అనుకుంటూ తమ గమ్యానికి చేరుకున్నాయి.  ఆ తరువాత వస్తున్న ఎర్రచీమలు అడ్డుగా ఉన్న ఉదయ్ మరో కాలివద్ద ఆగాయి. ముందుగా ఉన్న చీమ తలకెక్కిన గర్వంతో ఊగిపోతూ ఇలా అంటుంది. మిత్రులారా ఇతగాడు మన దారికి అడ్డుగా వచ్చాడు. మనమేంటో ఇతనికి తెలియచేద్దాం దాడి చెయ్యండి అంటూ గర్వంతో మాట్లాడగా మిగతా చీమలన్ని కలిసి ఉదయ్ కాలిపై దాడి చేసి కుట్టసాగాయి. ఉదయ్ కి నిద్రాభంగమై కాలిమీద ఏవో కుడుతున్నాయని గ్రహించి అంతే వేగంతో చేతితో టపాటపా కొట్టసాగాడు. కాలిపైకెక్కిన చీమలన్ని మరణించాయి. గర్వంతో ప్రవర్తించినందుకు ఫలితం  అనుభవించాయి. వినయంతో ప్రవర్తించిన నల్ల చీమలన్నీ తమ లక్ష్యానికి చేరుకోగా గర్వంతో ఊగిపోయిన ఎర్రచీమలు తమ గమ్యానికి చేరుకోకుండానే మధ్యలోనే ప్రాణాలు కోల్పాయాయి. చూసారు కధా గర్వం ఎప్పటికీ హానికరమే. అందుకే గర్వంతో ప్రవర్తించకుండా వినయం కలిగి ఉంటే  ఎటువంటి ఇబ్బందులు లేకుండా విజయాన్ని సాధించవచ్చు. 

సాత్విక్ సాయికుమారాచార్యులు
6వ తరగతి
సూర్యపబ్లిక్ స్కూల్,అశ్వారావుపేట
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
9491357842 

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం