ఇకమత్యమే మహా బలం:- కంచనపల్లి ద్వారకనాథ్,--చరవాణి: 9985295605

          సలీం బాయి అన్ని రకాల కోళ్ళతోపాటు పందెంకోళ్ళను గూడా  పెంచి వాటిని  అమ్మి డబ్బులు సంపాది౦చేవాడు .రోజు  కొళ్ళకు మేత వేసి వాటిని  అపురూపంగా చూసుకునేవాడు . పందెం కోళ్ళకు మాత్రం బలమైన  ఆహార ధాన్యాలు , పప్పులు పెట్టి  ప్రత్యేక   శ్రద్ద తో చూసుకునేవాడు . 
తన ఇంటి చుట్టూ కోళ్ళకు ఎలాంటి   ప్రమాదం రాకుండా  గట్టి కంచె నిర్మించి వాటికి     భద్రత   కల్పించాడు . సలీం బాయి కోడి  గుడ్లను  పొదగేసాడు . కోడి వాటిని పొదిగి పిల్లలు  చేసింది. చిన్న చిన్న కోడి పిల్లలు అరుస్తూ ,తప్పటడుగులు వేస్తూ వాటి అమ్మ కోడి వెంట తిరుగుతూ , అమ్మకోడి కాలితో భూమిని దున్ని గింజలు ,చిన్న పురుగులు అందిస్తే తింటూ  తిరుగుతుం డేవి.  
ఒకరోజు ఒక పెద్ద గ్రద్ద కోడి  పిల్లలని చూసింది . ఆహారం దొరికిందని సంబర పడిపోయి  ఆకాశంలో  చెక్కర్లు కొడుతూ  మెల్లగా వచ్చి సలీం ఇంటి ఆవరణంలోని ఒకపెద్ద చెట్టు పై  వాలింది . అదను చూసి కోడి పిల్లల్ని   తన్నుకు పోవాలని చూస్తోంది . సమయం   చూసి  రివ్వునకిందికి దూసుకొచ్చింది . .  పౌరుషం ,  చిన్న శబ్ద మైనా  విన గలిగిన శక్తి   గల   ఒక పందెం కోడి గ్రద్ద రెక్కల చప్పుడు విని వెంటనే ఒక్క    ఉదుటున ఎగిరి  గ్రద్దను కాళ్లతో తన్నింది . మిగిలిన పందెం కోళ్ళు గూడా  గ్రద్ద పై    తిరుగు బాటు చేయ బోయాయి  .గ్రద్దకి చావు తప్పి కన్ను లొట్ట పోయి ఎంత వేగం గా దూసుక  వచ్చిందో అంతకంటే  ఎక్కువ వేగంతో ఆకాశంలోకి ఎగిరి చుక్కలా అయిపోయింది . మిగిలిన కోళ్ళు భయంతో అరుస్తూ అటు ఇటు   పరిగెత్తాయి . పందెం కోళ్ళ వల్ల కోడి  పిల్లలు రక్షింప బడ్డాయి, ఒక గూటి పక్షులు ఒక చోట  చేరుతాయి  అన్నట్లు    ఐకమత్యమే మహాబలం  అని చెప్పకనే చెప్పాయి . 

కామెంట్‌లు