తీర్పరి కానివాడు;ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం.9492811322.

 ఇంటిలో కానీ, రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ తీర్పు చెప్పే వాడు లేకపోతే  ఏ మంచీ జరగదు. ఇంట్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ ఇంటి పెద్ద కలగజేసుకుని  తప్పొప్పులను నిర్ణయించి చేయవలసిన పని చేస్తాడు. అంతటితో ఆ కుటుంబం ఆనందంగా ఉంటుంది. ఏ గ్రామంలోనైనా ఒక జరగరాని పని ఏదైనా ఒకటి జరిగినప్పుడు గ్రామ పెద్ద  గ్రామస్తులతో పాటు తప్పు చేసిన వారిని కూడా పిలిచి ఆ తప్పు ఎందుకు చేయవలసి వచ్చింది దాని వెనుక కారణాలు ఏమిటి అనితెలుసుకున్న తర్వాత  తాను తీర్పును ఇస్తాడు  అలా నిర్ణయించ గలిగిన జ్ఞానం ఉన్నవారిని ఆ గ్రామ ప్రజలు పెద్దగా ఎన్నుకుంటారు. ఎన్నుకునే ముందే ఆయన అర్హతలు కూడా పరిశీలించి  నిర్ణయిస్తారు. ఆయన తీర్పు చెప్పిన తరువాత రెండవ ఆలోచన రావడానికి అవకాశం లేదు. గ్రామంలో జరిగినట్లే రాష్ట్రంలో ముఖ్యమంత్రి, దేశంలో ప్రధాన మంత్రి నిర్ణయాలు తీసుకుంటారు.  నిర్ణయాలు తీసుకునే ముందు తప్పుఒప్పులను తెలుసుకొని  పరిశీలకుల అభిప్రాయాలను కూడా మన్నించి చేయవలసిన మంచి పని చేస్తారు. అలా నిర్ణయం చేయలేని వ్యక్తి ఆ స్థానానికి పనికి రాడు. తెలివిగల నాయకుడు అయితే రాష్ట్రం, దేశం బాగుపడుతుంది లేకుంటే పతనమై పోతుంది. బీరాలు పలికే వాడు కాదు మనకు కావలసింది సరియైన పని చేసే వ్యక్తి అవసరం. 





కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం