అహ్మద్ నగర్ కోట ..; డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై ,
 అహారాష్ట్ర లోని అహ్మద్ నగర్ లోని కోట. ఇది అహ్మద్ నగర్ సుల్తానేట్‌కు చెందినది. ఈ కోటను అహ్మద్ నిజాం షా, సుమారుగా 15, 16వ శతాబ్దాలలో నిర్మించాడు. యుద్ధాలలో పట్టుబడ్డ సైనికులను ఈ కోటలో ఖైదీలుగా వుంచేవారు. 1803 లో జరిగిన రెండవ మరాఠా యుద్ధంలో బ్రిటిషు వారు దీన్ని పట్టుకున్నారు. క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో స్వాతంత్ర్య యోధులను కూడా ఇక్కడ బందీలుగా వుంచేవారు. ఈ విషయాన్ని ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తాను రచించిన డిస్కవరీ ఆఫ్ ఇండియా గ్రంథంలో పేర్కొన్నాడు. అహ్మద్ నగర్ కోటకు మార్లు నిజామి రాజులు పలు మరమ్మతులు చేయించారు. ప్రస్తుతం ఇది భారతదేశ మిలిటరీ ఆధీనంలో ఉంది.
కోటకు సుమారుగా 18 మీటర్ల ఎత్తుకల గోడలు, 22 బురుజులు, 24 దుర్గాలు, 30 మీటర్ల వెడల్పుతో ఉంటుంది కోట గోడ చుట్టూ బయటి వైపున కందకం ఉంది. ఈ కంద్కం 5.5 మీటర్ల వెడల్పుతో, 2.7 మీటర్ల లోతున నీటితో నుండి ఉంటుంది.
ఈ కోటను మాలిక్ అహ్మద్ నిజాం షా, సుమారుగా 15, 16 శతాబ్దాలలో నిర్మించాడు. అహ్మద్ నగర్ పట్టణానికి ఆ పేరు అతడి పేరిటే వచ్చింది. అతడు నిజాం షాహి వంశంలో తొలి సుల్తాను. తొలుత దీన్ని మట్టితో నిర్మించారు. తరువాత హుస్సేన్ నిజాం షా 1559 లో దీన్ని బలోపేతం చెయ్యడం మొదలుపెట్టి 1562 లో పూర్తి చేసాడు. 1596 ఫిబ్రవరిలో చాంద్ బీబీ మొగలుల దండయాత్రను తిప్పి కొట్టింది. కానీ 1600 లో అక్బరు మళ్ళీ దండెత్తినపుడు ఈ కోటా మొగలుల వశమై పోయింది. 
ఔరంగజేబు తన 88 వ ఏట 1707 ఫిబ్రవరి 20 న ఈ కోట లోనే మరణించాడు. 1724 లో ఈ కోట నిజాముల వశమైంది. 1759 లో మరాఠాలకు ఆ తరువాత 1790 లో సిందియాలకూ చేజిక్కింది. రెండవ మాధవరావు మరణం తరువాత ఏర్పడిన అస్థిర పరిస్థితుల్లో దౌలత్ సిందియా ఈ కోటను, దాని చుట్టుపట్ల ఉన్న ప్రాంతాన్నీ వశపరచుకున్నాడు. 1797 లో అతడు నానా ఫడ్నవీసును ఈ కోటలోనే బంధించాడు.
1803 లో రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధంలో వెల్లస్లీ మరాఠాలను ఓడించడంతో ఈ కోట ఈస్టిండియా కంపెనీ పరమైంది..


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం