దానగుణం; -: సి.హెచ్.ప్రతాప్
 ఒక ఊరిలో ధనగుప్తుడు అనే ఒక ధనవంతుడు ఉండేవాడు. అతను వ్యాపారాన్ని అనేక విధాలుగా అభివృద్ధి చేసి అందులో మంచి లాభాలు గడించాడు.అయితే అతనికి మంచి తెలివితేటలతో పాటు దానగుణం కూడా మెండుగా వుంది.ఉన్నంతలో బీద సాదలకు దానధర్మాలు చేసి వారిని  ఆదుకునేవాడు. అవసరార్ధం అతని ఇంటికి వచ్చినవారు ఖాళీ చేతులతో తిరిగి వెళ్ళేవారు కాదు. ఆ ఊరిలోని ప్రజలు అతడిని కలియుగ కర్ణుడు అని కీర్తించేవారు. అందరికీ అన్నివేళలా అందుబాటులో వుండేవాడు. అతనికి ధనవంతుడనే గర్వం ఏ కోశానా వుండేది కాదు.
ఒక సందర్భంలో ఆ ఊరికి ఒక సాధువు వచ్చి రామాలయంలో నివాసం ఏర్పాటు చేసుకొని భక్తులతో సద్గోష్టి జరుపుతుండేవారు .అతను సకల వేద శాస్త్ర పారంగతుడు, పైగా తపోనిష్టుడు.అతని ఆధ్యాత్మిక ప్రవచనాలు వినడానికి చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా ప్రజలు తండోపతండాలుగా వచ్చేవారు.మిగతా వేళలో తీవ్రమైన ధ్యానంలో వుండేవారు .
ఆ నోటా, ఈ నోటా ధనగుప్తుడి దాన గుణం గురించి విని అతనిని ఆశీర్వదించాలని సాధువు సంకల్పించారు . అయితే ముందుగా అతని దానగుణాన్ని పరీక్షించాలని నిర్ణయించుకున్నారు .
ఒకరోజు తెల్లవారుజామున ధనగుప్తుడి ఇంటికి వచ్చి తలుపు తట్టారు . అప్పుడే నిద్ర లేచిన ధనగుప్తుడు తలుపు తీసి, ఎదురుగా వున్న సాధువును చూసి భక్తిశ్రద్ధలతో చేతులు జోడించి ఇంట్లోకి ఆహ్వానించాడు.
"ధన గుప్తా ! నేను వరుసగా ఏడు రాత్రులు, ఆరు పగళ్ళు ధ్యానం చేసి ఇప్పుడే విరమించాను. ఏడు రోజుల పాటు నిరాహారినై వున్నందున నన్ను ఆకలి తీవ్రంగా బాధిస్తోంది. కాబట్టి తినడానికి ఏదైనా వుంటే పెట్టు" అని సాధువు అడిగారు .
ధనగుప్తుడు పొద్దునే సాధువు వంటి పవిత్రులకు భిక్ష వేసే అరుదైన అవకాశం వచ్చినందుకు సంతోషిస్తూ " ఇప్పుడే వస్తాను స్వామీ" అంటూ లోపలికి వెళ్ళి క్రితం రోజు కొని తెచ్చిన తాజా ఫలాలను  ఒక పళ్ళెంలో పెట్టి తీసుకు వచ్చాడు.
ఇంతలో సాధువు తప:శక్తి వలన ఇద్దరి మధ్య పెద్దగా మంటలు లేచాయి. ఇంటి దూలాన్ని తాకేటట్టుగా లేచిన ఆ మంటలను చూసి ఒక్క అడుగు వెనక్కి వేసాడు ధనగుప్తుడు.సింహం ముందుకు ఉరికేటప్పుడు ఒక అడుగు వెనక్కి వస్తుందంటారు. అదేవిధంగా ఒక్కసారిగా లేచిన మంటలను చూసి ఒక అడుగు వెనక్కి వేసిన ధనగుప్తుడు ఉదుట్టున ముందుకు ఉరికి మంటలలో నుండి నడిచి బయటకు వచ్చి ఆ సాధువు చేతుల్లో ఫలాలు వుంచిన పళ్ళెం వుంచి కాళ్ళకు నమస్కరించాడు. చిత్రం. సాధువు చేతుల్లో పళ్ళెం వుంచిన మరుక్షణం ఆ మంటలు ఆరిపోయాయి. అక్కడ పరిస్థితి యధాపూర్వంగా వచ్చేసింది. ఇంతకు ముందు మంటలు వచ్చిన సూచనలు మచ్చుకైనా లేవు.మంటల నుండి నడిచిన కారణంగా ధనగుప్తుడి ఒళ్ళు మూడొంతులు కాలిపోయింది. ఆ కాలిన గాయాలు కుడా మాయమైపోయాయి.
ధనగుప్తుడికి ఇదంతా ఆశ్చర్యంగా అనిపించింది. అతడిని చూస్తూ సాధువు చిరునవ్వుతో" నిన్ను పరీక్షించాలని నేను ఈ మంటలను సృష్టించాను. నీ ఒళ్ళు కాలుతుందని కాని, నీ ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని కాని ఆలోచించక, నువ్వు కేవలం నాకు భిక్ష ఇచ్చి  నా ప్రాణాలు నిలిపేందుకు ప్రయత్నించి నీ దానగుణాన్ని రుజువు చేసుకున్నావు.  ఆకలితో వున్నవారికి కాస్తంత అన్నం,కట్టుకోవడానికి బట్టలు, విశ్రాంతి తీసుకోవడానికి ఇంటి వసారా కాస్సేపు ఇవ్వడం,దుఖంలో వున్న ఇతరులకు కాస్తంత ఓదార్పు నిచ్చి స్వాంతన కలిగించే మాటలు పలకడం వంటి  మంచి గుణాలు మానవులకు ఉత్తమ గతులు ప్రసాదిస్తాయి.  నీకు ఎప్పుడూ మంచే జరుగుతుంది. సకలైశ్వర్య లతో హాయిగా వర్ధిల్లుతావు. సుఖీభవ:  " అని ఆశీర్వదించారు.

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం