చిలకజోస్యం అంటూ ఆజాతకాలు చెప్పేవాడు చెట్టుకింద రోజూ మకాం వేస్తాడు. మిట్టమధ్యాహ్నం ఆవీధిఅంతా తెరుచుకున్న షాపులతో మహా సందడి! ఉరుకులు పరుగుల జనం ఓసారి చెట్టుకింద బిచాణావేసిన తిప్పయ్యను అలా చూస్తూ సాగిపోతారు.కొందరు కాలక్షేపానికి అతనిదగ్గరికి చేరుతారు. బాటపై పాత బట్టలు ఇనుప చెక్కసామాన్లు చిరుతిళ్లు అమ్మేవారు!ఓహ్!సందడే సందడి!అసలు తను జాతకం చెప్పాలని ఎన్నడూ అనుకోలేదు. చిలుక జాతకం చెప్పేవాడు తన ఊరికి ఓనెల పోతూ అప్పగించాడు చిలుకను జాగ్రత్తగా తను వచ్చేదాకా చూడమని!తాత తండ్రి పొలం పనులు చూస్తూ జీవితం గడిపారు. అప్పట్లో ఒళ్లు వంగక తండ్రి చెప్పిన మాటవినక ఏడో క్లాసుతో చదువుకి మంగళం పాడి పట్నం పారిపోయాడు.
తిప్పయ్య హోటల్ లో కొన్నాళ్ళు చాకిరీ చేసి"బాబోయ్!నావల్ల కాదు" బైట పడ్డాడు.కాషాయదుస్తులు తలపాగా రుద్రాక్షలు ధరించి గడుల పుస్తకం చిలుకతో కొత్త అవతారం ఎత్తాడు తిప్పయ్య! తెలివిగా నక్కజిత్తులు ప్రయోగించి మాట్లాడటం నేర్చుకున్నాడు. తనకి పరిచయం ఐన నలుగురితో కొత్త ధంధా ప్రారంభించాడు.అందరూ చూస్తుండగా తనస్నేహితుడి చెయ్యి చూస్తూ"నీకు ఫలానా కష్టం వస్తే పారిపోయి వచ్చావు.హోటల్ పనివాడిగా ఉన్నావు" అని అతని దగ్గర 10రూపాయల ఫీజు వసూలు చేసేవాడు.ఇలా ముగ్గురు స్నేహితుల గతించిన వారి మంచి చెడులు చెప్పి కొత్త గా వచ్చే జనానికి నమ్మకం కలిగించేవాడు.ఆనలుగురూ ఆగల్లీవారి వివరాలు సేకరించి ఇతని చెవిలో ఊదేవారు.తిమ్మయ్య గొప్ప జ్యోతిష్యపండితుడని వారు ప్రచారం చేయటంతో జనం క్యూలు కడుతున్నారు. నలుగురు తన శిష్యులని వారి కి అన్ని వివరాలు చెప్పమని తను మీనమేషాలు లెక్కపెడుతున్నాడు. అంతే!వెర్రి జనం ఈఐదుగురి మాటలకి బోల్తా పడ్డారు. తాయెత్తు విభూది నల్లదారాలు కట్టడం సాంబ్రాణి ధూపాల పేరుతో రోజుకి రెండు వేల సంపాదన! శిష్యులుగా నటించేవారికి తలా300!ఇలా తిమ్మయ్య మూడు రోజుల కోసారి మకాం మారుస్తాడు. ఒకేచోట ఉంటే తమగుట్టు రట్టవుతుందని వారికి తెలుసు.మరి ఇలాంటి వారిని నమ్మకూడదు అని టీచర్ చెప్పితే పిల్లలు నమ్మరు.అందుకే ఆబడివారు ఐదోక్లాస్ నించి పిల్లలకు ఇలాంటి విషయాలలో అవగాహన కలిగిస్తారు.కొత్త వారు పిలవగానే వెళ్లరాదని ఇంట్లో చెప్పి ఎక్కడికైనా వెళ్లి చెప్పిన టైంకి ఇల్లు చేరాలని ప్రతినెలా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సదస్సు నిర్వహిస్తారు.చదువు కన్నా ముఖ్యమైన విషయాలు చెప్పి చైతన్యం కలిగిస్తున్న ఆబడికి ఉత్తమ బడి అని సత్కరించారు అపల్లెవారు.జాతకాలవారు "మంచే జరుగుతుంది. బ్రహ్మాండంగా ఉంది జాతకం!కానీ..." అని పరిహారాలపేరుతో డబ్బు గుంజటం సర్వ సాధారణం ఐంది.కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని మనం అప్రమత్తం గా ఉండాలి సుమా!షిరిడీ బాబా అదే చెప్పాడు "జాతకాలు పరీక్షఫెయిల్ పాస్ అని చెప్పవు.మీకృషి మీరు చేస్తూ నాపై నమ్మకం ఉంచండి." ఇలా మనం దైవంపై నమ్మకం ఉంచి సాగాలి.దొంగ సాధుసన్యాసుల ఎడ అప్రమత్తం గా ఉండాలి🌹
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి