స్నేహితుడి సాహసం; ఆదిమల్ల శివమణి- తండ్రి లింగయ్య-- 8వ తరగతి-- జడ్పిహెచ్ఎస్ చింతగూడెం
 గౌరారం గ్రామంలో రాజు, కౌశిక్, చరణ్ అనే ముగ్గురు స్నేహితులు ఉండేవారు. ఒకరోజు వారు వాళ్ల ఊరు నుంచి పట్టణానికివెళ్లడానికి ఒక అడవి గుండా పోతున్నారు. చరణ్ కు బాగా దాహం వేసింది. తన స్నేహితుడి దాహం తీర్చడానికి నీళ్ల కోసం వెతకడానికి రాజు అడవి లోపలికి వెళ్ళాడు. కొద్ది దూరంలో వాగు ప్రవహిస్తున్న నీటి శబ్దం వినిపించింది. రాజు అక్కడికి వెళ్ళాడు.  నీళ్లను చూసిన సంతోషం లో చుట్టుపక్కల ఏం జరుగుతుందో పట్టించుకోలేదు.అప్పుడే ఒక్కొక్క పెద్ద కొండచిలువ రాజును చుట్టేసింది. భయంతో రాజు కేకలు వేశాడు. ఏం జరిగిందో అని ఇద్దరు స్నేహితులు అటువైపు పరిగెత్తారు.  కొండచిలువ రాజును చుట్టి వేయడం చూసి చరణ్ కౌశిక్ ఎంతో భయపడ్డారు.  కౌశిక్ వెంటనే ఉపాయాన్ని ఆలోచించాడు. రాయి తీసుకొని కొండచిలువ తలపై బలంగా కొట్టాడు. అంతటితో కొండచిలువ గిలగిలా కొట్టుకుంటూ కిందపడింది. రాజు ప్రాణాలతో బయటపడ్డాడు. సాహసంతో తన స్నేహితుడిని రక్షించుకున్నారు ఇద్దరు స్నేహితులు. తనకోసం ప్రాణాలకు తెగించి కాపాడిన స్నేహితులకు రాజు కృతజ్ఞతలు చెప్పాడు.
 నీతి: ఆపదలో ఆదుకున్నవాడే నిజమైన స్నేహితుడు.
                       

కామెంట్‌లు
Popular posts
చిత్రాలు ; ..జ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భారత్ నగర్ (మూసాపేట)- హైదరాబాద్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
చిత్రాలు ; జి.జీవనజ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భరత్ నగర్ హైదరాబాద్
చిత్రం
తెలివితేటలు!! ప్రతాప్ కౌటిళ్యా
చిత్రం