'SEIF' కర్నూలు జిల్లా ఉపాధ్యక్షుడుగా సోమన్న ఎంపిక

 పెద్దకడబూరు మండల పరిధిలోని హెచ్.మురవణి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్న 'స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్' కర్నూలు జిల్లా ఉపాధ్యక్షుడు గా(2023-2024) ఎంపికయ్యారు.ఈమేరకు ఆ సంస్థ చైర్మన్ డా.ఈదా శామ్యూల్ రెడ్డి గారు ఒక ప్రకటనలో తెలిపారు.గతంలో SEIF జిల్లా కోశాధికారిగా గద్వాల సోమన్న పనిచేసిన సంగతి విదితమే.'బలవన్మరణాలు లేని భారతదేశం'గా చూడాలనే ధ్యేయంతో ముందుకు సాగుతున్న ఈ ఫౌండేషన్ కు ఉపాధ్యక్షుడుగా ఎన్నుకోవడం పట్ల సోమన్న సంతోషం వ్యక్తం చేశారు.మహోన్నత ఆశయాలతో ,చిత్త శుద్ధితో అడుగులు వేస్తున్న నిస్వార్ధ సేవా సంస్థతో కలసి పనిచేయడం మధురానుభూతిగా అభివర్ణించారు గద్వాల సోమన్న. తన మీద నమ్మకం తో  SEIF ఉపాధ్యక్షుడుగా ఎంపిక చేసినందుకు చైర్మన్ శామ్యూల్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు శ్రేయోభిలాషులు సోమన్నను అభినందించారు
కామెంట్‌లు
Popular posts
చిత్రాలు ; ..జ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భారత్ నగర్ (మూసాపేట)- హైదరాబాద్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
చిత్రాలు ; జి.జీవనజ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భరత్ నగర్ హైదరాబాద్
చిత్రం
తెలివితేటలు!! ప్రతాప్ కౌటిళ్యా
చిత్రం