కవి కోకిల (2);- ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 దువ్వూరి రామిరెడ్డి గారు  1895 సంవత్సరం నవంబర్ 9వ తేదీన నెల్లూరు జిల్లాలోని గూడూరు లో జన్మించారు  వారి తల్లిదండ్రులు లక్ష్మీదేవమ్మ సుబ్బారెడ్డి గారు  వీరికి రామిరెడ్డి మొదటి బిడ్డ  ఇతని యొక్క తమ్ముడు బాలకృష్ణారెడ్డి చెల్లెలు రుక్మిణి రామిరెడ్డి గారి చిన్నతనంలోనే తండ్రి సుబ్బారెడ్డి మరణించారు  అతని తల్లి తన పిల్లలకు చెల్లెలు  ఆస్తి వస్తుందన్న ఉద్దేశంతో అనేకమైన దానధర్మాలను వైష్ణవ స్వామి సేవకు తీర్థయాత్ర అధికారులకు ఖర్చు పెట్టేది  వైష్ణవ మతాభిమానం ఉన్న అతని తల్లి ప్రభావం అతనిపై పడడం వల్ల కర్షక విలాసము అనే నాటకాన్ని రచించారు  ఒకసారి రామిరెడ్డి గారు తన చిన్నతనంలోనే ఒక వైష్ణవ మత ఆచార్యుడు గూడూరుకు వచ్చాడు అని తెలుసుకున్నాడు. అతడు భక్తులను పరవశులను చేస్తూ ఉండేవాడట ఇది విని తన తమ్ముడితో ఉదయాన్నే నిద్ర లేచి చెరువులో స్నానం చేసి తడి బట్టలతో  నే వైష్ణవ స్వాముల దగ్గరికి వెళ్లి దర్శనం చేసుకుని  ముద్రాంకితుడై ఉన్నారు అన్న విషయం తెలిసి అతనే అమ్మ ఆచారి గారు ఎదురుపత్తితో చెంపలు వేసుకుని చేయాల్సిన గౌరవాలు చేసింది  దీనిని బట్టి వైష్ణవమత ప్రభావం రామిరెడ్డి పై ఎంత పై ఉందో తెలుస్తుంది  ఒకసారి తల్లితో గొడవపడి బ్రహ్మారెడ్డి పాలెం లోని అతని పిన్నమ్మ ఇంటికి వెళ్లిపోయాడు అక్కడే ఆ గ్రామం లోనే అతని జీవితం కొనసాగినట్టు చెప్తారు.  దువ్వూరి రామిరెడ్డి ఎనిమిదవ తరగతి వరకు చదువుకున్నాడు గూడూరు బ్రహ్మారెడ్డి పాలెం లోని సీతమ్మ వారి వీధి బడిలో 5వ తరగతి వరకు చదివాడు. తర్వాత నెల్లూరులోని హరివిదొర వద్ద ఎనిమిదో తరగతి వరకు చదువుకున్నాడు.
అయితే ఆ సంవత్సరం  పరీక్షలో పాస్ అవలేదు  తర్వాత తల్లి బలవంతం మీద మరో సంవత్సరం పాస్ అయ్యారు. అప్పుడే అతని తండ్రి చనిపోవడంతో ఉన్నత పాఠశాల విద్యచదవలేదు  రామి రెడ్డి గారు తమ స్వీయ చరిత్రను గురించి శివశంకర్ శాస్త్రికి ఒక లేఖ రాశారట పాఠశాలలో  నేను నేర్చిన విద్య చాలా  గహ విద్యాలయ శిక్షితుడను మొప్పగును  శాస్త్రి గారి తమ తొమ్మిదవ సంవత్సరంలో సంప్రదించిన ఒక చిన్న సంఘటన వలన కవిగా మారినట్లు  తన నా తొలి రచన అనే వ్యాసంలో చెప్పు  ఉన్నారు  అతని జీవితంలో ఒకసారి గ్రంథాలయం లో చదువుకుంటూ ఉండగా ఒక శతావతాలవారు వచ్చి కవిత్వం  పూర్వజన్మ పుణ్యం వల్ల వస్తుందని వారికి జరిగిన మాటలకు సమాధానంగా  ఒక ఉత్పలమాల పద్య పాదాన్ని రచించి వారికి చూపించారట.



కామెంట్‌లు