కరదీపిక;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 వేదకాలం కంటే ముందే మనదేశంలో యోగ ఉనికి కనిపించిందని ప్రాచుర్యంలో ఉంది. అత్యంత ప్రాచీనమైన ఋగ్వేదంలో ఈ యోగ విద్యను ప్రస్తావించారని కూడా పెద్దలు చెబుతారు.అంతేకాదు, క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల నాటి సింధులోయ నాగరికతలోకూడా యోగ సంప్రదాయానికి చెందిన ఆనవాళ్ళు లభించాయని పరిశోధకులు చెబుతున్నారు. అలాగే శ్రీకృష్ణ పరమాత్ముడు తన భగవద్గీతలో యోగ సంప్రదాయానికి చెందిన సాధికారిక వ్యాఖ్యానాలను మనకు ప్రబోధించాడు. స్వామీ వివేకానంద 1893 సంవత్సరంలో అమెరికా పర్యటన సందర్భంగా చేసిన ప్రసంగాలలో యోగా ప్రస్తావన ఉంది. ఈ ప్రసంగాల వలననే యోగసాధనలకు అద్భుతమైన ప్రాచుర్యం ప్రారంభమైంది. ఆతర్వాత పరమహంస యోగానంద వంటివారు విదేశాలలో యోగాను విరివిగా ప్రచారం చేశారు. 
యమ, నియమ, సమాధి, ఆసన, 
ప్రత్యాహార,ధారణ, ప్రాణాయామ, ధ్యానాలు మన పతంజలి ఋషి వర్యుని అమూల్య అష్టాంగయోగాలు. వీటిని ప్రపంచానికి ప్రసాదించిన పతంజలి మహర్షికి మనం ఋణపడి ఉన్నాం. కాయము ఆత్మనికాయము అందుకే, ఆత్మ పరమాత్మల అనుసంధానానికి  ధ్యాన యోగా విధానాలు సుగమ మార్గాలుగా చెబుతారు. మానసిక శారీరక ఆరోగ్యాన్ని ప్రసాదించే మహర్షి అద్భుత తపోఫలాలు ఇవి. మతిని శృతిచేసి, శరీరాన్ని సరిచేసి, ప్రకృతి కృతిగా మానవులను జతచేసి, నిశ్చల ధ్యానంతో ఏకాగ్రతను పొంది, మనసును శరీరాన్ని రోగ రహితంగా సుదృఢపరుస్తూ, స్థితప్రజ్ఞను అందించే మోక్షసాధక కరదీపిక ఇది. వసివాడని వన్నెచెడని భరతమాత నుదుటి సిందూరమిది!
కాస్త వివరంగా చెప్పాలంటే…యమ, నియమాల ద్వారా చెడు ఆలోచనలను, చెడు ప్రేరణలను నియంత్రించి మంచి ఆలోచనలను, మంచి అలవాట్లను అలవరుచుకోవడం సాధ్యపడుతుంది. ఆసన, ప్రాణాయామాల వలన దీర్ఘకాలిక ధ్యానానికి కావలసిన భంగిమలు, లయబద్ధమైన శ్వాసక్రియను సాధించవచ్చును. ప్రత్యాహార, ధారణల ద్వారా విషయ లోలత్వం కలిగించే వస్తువులపై నుండి ఇంద్రియాలను మరల్చి ఏకాగ్రతను పెంచుకోగలము. ఇక ధ్యాన, సమాధి స్థితుల ద్వారా నిరంతరం ధ్యానం చేయడంతో మనసును పూర్తిగా ఆత్మలో లయం చేయడం కొనసాగిస్తాము.
ఈ యోగసాధనతో మనిషికి శాశ్వతమైన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక స్వస్థత చేకూరుతుంది. ఎంతోమంది పరిశోధకులు ఎన్నో పరిశోధనలు చేసి యోగసాధనతో ఎన్నెన్నో రుగ్మతలు దూరమవుతాయని నిగ్గు తేల్చారు కూడాను.
ఇంతటి మహత్తరమైన యోగా ను ప్రపంచానికి అందించిన ఘనత కేవలం భారతదేశానికే దక్కింది. మనమంతా కలిసి ఈ యోగా ను సదా ఆచరించడం ద్వారా భారతదేశపు కీర్తిప్రతిష్టలను ఆచంద్రార్కం నిలిపి ఉంచుదామని ఈ యోగా దినోత్సవం రోజున మనం ప్రతిజ్ఞ చేద్దాం! 
జైహింద్!! 
{అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ వ్యాసం}
—-----------------------------------------
;

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం