నేటి అర్జునుడు!;- డా.పి.వి.ఎల్.సుబ్బారావు. విజయనగరం. 9441058797.
 మేరా భారత్ యశ్ మహాన్! 
మేరా జవాన్ శౌర్యనిధాన్!
జై జవాన్ !జై కిసాన్!
 ఓం అద్భుత నినాదం!
 
పూర్వ ప్రధానమంత్రి,
 లాల్  బహదూర్  శాస్త్రి ,
నిత్య పాదాభివందనం! 
ఇద్దరూ ఇద్దరే ,
భరతమాత రెండు కన్నులే!
సిపాయి జీవితం,
           దేశానికి అంకితం! 
 
అతడి కర్తవ్యం,
              మనకి కవచం!
 
 కుటుంబాన్ని మరచి,    
       సరిహద్దుల్లో నిలిచి!
 
   దేశ రక్షణ ఏకైక లక్ష్యం ,
              అతడే సాక్ష్యం!
 
    దివారాత్రాలు,
           దేశభద్రతే ధ్యానం!
 కులం,మతం, ప్రాంతం,
                    ప్రసక్తే లేదు !
   దేశం ముందు ,
              ఏది గుర్తుండదు !
   తన జీవనం "జవాన్",   
         ఎంతో  గర్వకారణం!
   మరణిస్తే సమర్పణం,
         గెలిస్తే బహూకరణం !
   రణాన కాయం వీడినా,
         యశోకాయం ఖాయం!

   మన ఒక్కో సైనికుడు,
                ఒక అర్జునుడు!
 
 మన దేశమాత కన్న,
   వీరందరూ కార్తవీర్యార్జునులే! 
 వారందరూ సదా ఈమాన్! 
అందుకే అంటాం ,
              మనం జై జవాన్ !
ఈ దేశానికి దివ్యవరదాన్!  
వాళ్ళ వాళ్ళంతా నాదాన్! 
వారి తల్లితండ్రులు,
          మనకి ఆరాధ్యులు!
 
భార్య పిల్లలు ,
    మన కుటుంబ సభ్యులు!
జై జవాన్!జై జవాన్!జై జవాన్!
____'_____

కామెంట్‌లు