జీ వి యం సి ప్రాథమిక పాఠశాల శివాజీపాలెంలో శనివారం కలెక్టర్ మల్లికార్జునరావు విచ్చేశారు. విద్యార్థులకు జగనన్న కానుకలు అందరికీ అందినట్లు చేసినందుకు ప్రధానో
పాధ్యాయులు శ్రీమతి దుర్గా కుమారి గారికి అభినందనలు తెలియ జేశారు .
సెమిస్టర్ 2వర్క్ బుక్స్ ,టెక్స్ట్ బుక్స్ విద్యార్థులకు అంద జేశారు. విద్యార్థుల రాసిన వర్క్ బుక్స్ ను పరిశీలించి సంతోషం వ్యక్తం చేశారు.
ఇంగ్లీష్ టీచర్ రమణ శ్రీ
TOEFL బోధనను విద్యార్థులతో పాటు విన్నారు. డా.ఉమాగాంధి టీచర్ రాసిన రాగి జావ పాటను విద్యార్ధులు ఆలపించారు.
ఈ పాటను రాష్ట్ర వ్యాప్తంగా నేర్చుకునేలా చేయాలని DEO గారికి తెలిపారు. సమగ్ర శిక్షా
ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీ గారు , DEO చంద్రకళగారు MEO 1 రామారావు గారు MEO 2 బాలామణి గారు ఉపాధ్యాయులు AV లక్ష్మీ,లలిత,సంధ్య, కిరణ్ లు పాల్గొన్నారు
జీ వి యం సి ప్రాథమిక పాఠశాలలో కలెక్టర్ మల్లికార్జునరావు
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి