ప్రజల భాగస్వామ్యంతోనే ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందుతాయని, కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ ఆంగ్ల మాధ్యమ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య అన్నారు. శనివారం ఆయన పాఠశాలలో పేరెంట్స్ టీచర్స్ సమావేశం( పీటీఎం) నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలలు లేకపోతే ఆయా గ్రామాలకు, ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. పిల్లల తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలల మోజులో పడి ఆరుగాలం చెమటోడ్చి కష్టించి సంపాదించిన డబ్బును వృధా చేసుకుంటున్నారని, తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ఉచిత నాణ్యమైన విద్యను పొందాలని ఆయన కోరారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలతో నాణ్యమైన విద్యను అందిస్తూ కార్పొరేటు పాఠశాలలకు ధీటుగా ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విశాలమైన తరగతి గదులు, ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలకు శాస్త్రీయమైన, కృత్యాధార విద్యా బోధన జరుగుతుండగా, పిల్లల తల్లిదండ్రులు మాత్రం వేలాది రూపాయలు తమ కష్టార్జితాన్ని ప్రైవేటు పాఠశాలలో ధారబోస్తూ డబ్బును వృధా చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చక్కని చదువుతోపాటు అమ్మ ఒడిలాంటి కమ్మని ప్రేమను పంచే ప్రభుత్వ పాఠశాల చెంతనే ఉండగా, తమ పిల్లల్ని దూర ప్రాంతాల్లోని ప్రైవేట్ పాఠశాలలకు పంపిస్తూ పిల్లల్ని ప్రమాదాలకు, శారీరక, మానసిక ఒత్తిడిలకు గురి చేస్తున్నారని, ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పిల్లల తల్లిదండ్రులు ప్రైవేట్ పై మోజును విడనాడాలని, ఉన్న ఊరు కన్నతల్లి లాంటి ప్రభుత్వ బడిపై నమ్మకం పెంచుకొని తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని ఆయన కోరారు. అనంతరం పిల్లల ప్రతిభ పాటలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల టీచర్లు విజయలక్ష్మి, సమత, భారతి, పిల్లల తల్లిదండ్రులు, విద్యార్థినీ, విద్యార్థులు, పలువురు పాల్గొన్నారు.
'ప్రజల భాగ్వామ్యంతోనే ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి'; - ప్రధానోపాధ్యాయులు ఈర్ల సమ్మయ్య
ప్రజల భాగస్వామ్యంతోనే ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందుతాయని, కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ ఆంగ్ల మాధ్యమ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య అన్నారు. శనివారం ఆయన పాఠశాలలో పేరెంట్స్ టీచర్స్ సమావేశం( పీటీఎం) నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలలు లేకపోతే ఆయా గ్రామాలకు, ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. పిల్లల తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలల మోజులో పడి ఆరుగాలం చెమటోడ్చి కష్టించి సంపాదించిన డబ్బును వృధా చేసుకుంటున్నారని, తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ఉచిత నాణ్యమైన విద్యను పొందాలని ఆయన కోరారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలతో నాణ్యమైన విద్యను అందిస్తూ కార్పొరేటు పాఠశాలలకు ధీటుగా ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విశాలమైన తరగతి గదులు, ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలకు శాస్త్రీయమైన, కృత్యాధార విద్యా బోధన జరుగుతుండగా, పిల్లల తల్లిదండ్రులు మాత్రం వేలాది రూపాయలు తమ కష్టార్జితాన్ని ప్రైవేటు పాఠశాలలో ధారబోస్తూ డబ్బును వృధా చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చక్కని చదువుతోపాటు అమ్మ ఒడిలాంటి కమ్మని ప్రేమను పంచే ప్రభుత్వ పాఠశాల చెంతనే ఉండగా, తమ పిల్లల్ని దూర ప్రాంతాల్లోని ప్రైవేట్ పాఠశాలలకు పంపిస్తూ పిల్లల్ని ప్రమాదాలకు, శారీరక, మానసిక ఒత్తిడిలకు గురి చేస్తున్నారని, ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పిల్లల తల్లిదండ్రులు ప్రైవేట్ పై మోజును విడనాడాలని, ఉన్న ఊరు కన్నతల్లి లాంటి ప్రభుత్వ బడిపై నమ్మకం పెంచుకొని తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని ఆయన కోరారు. అనంతరం పిల్లల ప్రతిభ పాటలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల టీచర్లు విజయలక్ష్మి, సమత, భారతి, పిల్లల తల్లిదండ్రులు, విద్యార్థినీ, విద్యార్థులు, పలువురు పాల్గొన్నారు.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి