ప్రధమ జ్ఞాన పీఠ బహుమతి గ్రహీత;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 అష్టావధానాలు శతవధానాలు చేయడంలో కూడా  అందె వేసిన చేయి విశ్వనాథ సత్యనారాయణ గారు  విజయవాడ విశాఖపట్నం రాజమండ్రి ప్రాంతాలలో అనేక చోట్ల అనేకసార్లు  అవధానాలు చేశారు  విజయవాడలో ఏదైనా  సందర్భం వచ్చినప్పుడు కవితా గోష్టులు నిర్వహించడం ఆలవాయితీ  ప్రతి కార్యక్రమానికి  విశ్వనాథ సత్యనారాయణ గారు అధ్యక్ష పీఠాన్ని అలంకరించవలసినదే  వారి గోష్టి జరుగుతున్న సందర్భాలలో  అనేక ప్రాంతాల నుంచి కూడా ప్రేక్షకులు వచ్చేవారు  కొన్ని కొన్ని సందర్భాలలో  ట్రాఫిక్ నిబంధనల కోసం  బస్సులను వేరే మార్గం ద్వారా పంపటం కూడా జరుగుతూ ఉండేది  మధునా పంతుల వారి దగ్గర నుంచి జాషువా గారి వరకు అనేకమంది కవులు హాజరవుతూ ఉంటారు.
ఒక పర్యాయం విజయవాడలో జరుగుతున్న కార్యక్రమానికి అధ్యక్షుడుగా వచ్చి  కవితా గోష్టికి నిండుతనం తెచ్చారు అప్పట్లో కవులు రాసిన కవితలను వ్రాసిన పతులను అధ్యక్షుల వారికి ఇవ్వాలి  అది ఒక నియమం ఆ కార్యక్రమంలో ప్రత్యేకించి జాషువా గారి కవిత  ప్రత్యేకము  రచయిత కవులను పిలిచేటప్పుడు  క్రమాన్ని పాటించేవారు  మూడవ పేరుగా ఉన్న జాషువా గారిని 5వ పేరుగా మార్చి  ఆరవ పేరులో ఉన్న వారిని మూడవ  పేరుగా మార్చారు. నాలుగో కవిత అయిపోయిన తర్వాత  ఇప్పుడు పంచముడు (అంటే ఐదవ వాడు) తన కవితను వినిపిస్తాడు  అనగానే జాషువా గారికి కోపం వచ్చి తాను రాసిన కాగితాలను చించి వేసి ఆశువుగా  తన కసిని కవిత రూపంలో చూపించాడు. ఆ కవిత పేరు గబ్బిలం  దానిని పక్షి అంటారా జంతువు అంటారా  పిల్లలకు పాలిచ్చి  పెంచుతుంది కనుక జంతువు ఆకాశంలో ఎగురుతుంది కనుక పక్షి  అలా బ్రాహ్మణ జాతిని  పోలుస్తూ ప్రత్యేకంగా విశ్వనాథ వారిని దానిలో  పాత్రగా చేసి చెప్పడం విశేషం  తరువాత పుస్తకంగా కూడా వచ్చింది దానిని చూసిన తన శిష్యులు ఏస్.టి జ్ఞానానంద కవి గారు  దీని రెండవ భాగాన్ని కూడా వ్రాయమని కోరితే  గదిలో కూర్చుని వ్రాసేది కాదు ఉద్వేగంతో రాసింది ఆ  గబ్బిలం  ఆ స్థితి వచ్చినప్పుడు రాద్దాం  అన్నారు  ఎన్నో సుగుణాలతో ఉన్న విశ్వనాథ సత్యనారాయణ గారు  వర్ణ భేదాలు చూపడం అన్నది  ఆయనలో పెద్ద లోపంగా ఆయన గురించి తెలిసిన వారు చెబుతూ ఉంటారు  ఎంత మంచి వారిలోనైనా ఓ చెడ్డ గుణం ఉంటుంది అన్న పెద్దల సూక్తిని వీరు నిజం చేసి చూపించారు.

కామెంట్‌లు