ఒకనాడు గోపికలందరు శ్రీకృష్ణుని వద్దకు వచ్చి కృష్ణ మనం క్రీడలన్నిట ఎక్కువ సంతోషం కలిగించేది రాసక్రీడ మనం ఆడుకుందామా అన్నారు. దానికి శ్రీకృష్ణుడు ఆ శరత్ కాలం వరకు ఆగండి అని చెప్పాడు
శరదృతువు రానే వచ్చింది వేచి ఉన్న గోపికలందరూ రంగురంగుల పువ్వులతో అందరికీ ఆనందదాయకంగా ప్రకృతి అంతా పులకించి పోతుంది. అటువంటి సమయంలో చిన్నారి కృష్ణుడు ఒక రోజున తన మురళి వాయించుకుంటూ ఒక అందమైన వనంలోకి వెళుతూ ఉంటాడు. అప్పుడు గోపికలు ఆ మురళి నాదానికి తన్మయులై ఎక్కడ ఎక్కడ గానం అని వెతుక్కుంటూ కృష్ణుని వెనుక పడ్డారు కృష్ణుడు నవ్వుతూ ఇదేమిటి ఇంత
రాత్రి అప్పుడు మీరు ఒంటరిగా రావచ్చా అని అడిగాడు మీ భర్తలకు తెలిస్తే కోపగించుకోరా అన్నాడు. వెంటనే వారు నీవు మాకు చేసిన వాగ్దానం గుర్తుందా! శర ధృతువు వచ్చింది కదా . రాసక్రీడ ఆడితేనే గాని మేము పోము అన్నారు అప్పుడు వారి మాట కాదనలేక కృష్ణుడు గోపికలతో రాసక్రీడ ఆడేడు మహదానందం పొందేరు ఇది భగవంతుని లీలలు.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి