మన తిరుపతి వెంకన్న;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 కలియుగంలో భగవంతుడు శ్రీ వేంకటేశ్వర స్వామి అని చెప్తారు  ఇది అందరూ అనుసరిస్తున్న విషయం  ఉదయం లేవగానే  వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం వింటే అన్ని శుభాలే జరుగుతాయని ప్రతి ఒక్కరి విశ్వాసం  ప్రత్యేకించి మా డాక్టర్ వెంకట్ రాజు గారు  ప్రతి తెలుగు సంవత్సరం ఉగాదికి  ఉదయం  మూడు గంటల  25 నిమిషాలకు స్వామి ఎదురుగా ఉండడం  అలవాటుగా మారింది  వారిని గురించి  నమ్మినవారికి కొంగుబంగారం అని చెప్తారు డాక్టర్ గారు  వారి   గదిలో వారు కూర్చున్న  స్థలం  ఎంతో పవిత్రమైనదని పెద్ద ఛాయాచిత్రం వెంకటేశ్వర స్వామి వారి  చిరునవ్వులు చిందిస్తూ ఉన్న వారి ఆశీస్సుల కోసం ఆయన ఏర్పాటు చేసుకున్నారు  అనుక్షణం వారి నామ కీర్తన తప్ప మరొక పని ఆయనకు లేదు. రాజుగారు తన ఇంటిని ఆసుపత్రిగా మార్చి  దానికి అనుకూలంగా ఏర్పాటు చేశారు  స్త్రీలైనా పురుషులైన రావడానికి ఒక మార్గం వెళ్లేటప్పుడు మరొక మార్గం  ఉంటుంది  ఒక రోజు నేను అక్కడ కూర్చుని ఉండగా  ఇద్దరు ముగ్గురు స్త్రీలు ఒకరి వెంట ఒకరు వరుసలో వస్తున్నారు  ఫలానా రంగు చీర కట్టుకున్న ఆమెను ఆ ప్రక్కగా రమ్మని చెప్పండి  ఈ వరుసలో రావద్దు అన్నారు  ఆయన ఎందుకు  ప్రత్యేకంగా ఆ వ్యక్తిని అన్నారు అన్న విషయం నాకు ఆలోచన రాలేదు  ఎందుకు అలా చేశారు అని అడిగితే  ఆమె    బహిష్టురాలు  స్వామి ఎదురుగా రావడానికి వీలు లేదు అని చెప్పారు  వైద్యం తర్వాత ఆమె వెళ్లేటప్పుడు  అడిగితే అది నిజమేనని ఆమె చెప్పింది  నాకు స్వామి వెన్నంటే నా బాధ్యతలను నాకు అనుక్షణం గుర్తు చేస్తూ ఉంటారు అంటారు డాక్టర్ గారు. వారు తిరుపతి వెళ్ళేటప్పుడు ప్రతిసారి నేను ఉండి తీరవలసినదే  నాతోపాటు మరి కొంతమంది ఆత్మీయ స్నేహితులు ఉంటారో వారందరూ వస్తారు ఆయనతో వెళ్లడం వల్ల  నేరుగా స్వామి వారి దర్శనం చేసుకోవద్దు  వారికి ఆ వెసులు బాటు ఉంది  దర్శనం అయిన తర్వాత ఆ ప్రదేశంలో చూడవలసిన  వాటిని అన్నిటినీ చూపుతూ దాని చరిత్ర మొత్తాన్ని మాకు తెలియజేస్తూ ఉంటారు  అక్కడ గైడ్స్ కు కూడా తెలియని అనేక రహస్యమైన విషయాలు కూడా మాకు తెలియజేస్తూ ఉంటారు.  స్వామివారి దర్శనం ఎంత ప్రధానమో ఈ విషయాలను తెలుసుకోవడం  అంత ప్రధానం అని నా ఉద్దేశం  స్థల పురాణాన్ని గురించి తెలియక పోయినట్లయితే ఆ స్వామిని చూసిన ఆ ప్రాంతం ప్రకృతి సౌందర్యం చూసినా నీకు ఏ విధమైన ప్రయోజనం ఉండదు అనుకునే వారిలో నేను కూడా ఒకడిని  అందుకే ఎప్పుడూ వారి వెంట వెళ్లడం.

కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
ఉరుదూ తెలుగు సాహిత్య వారధి డా. సామల సదాశివ; రామ్మోహన్ రావు తుమ్మూరి
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం