ఇప్పుడు రాజకీయమంతా
లాభసాటి వ్యాపారమే
నీతి నియమాలు లేవు
వ్యక్తిగత స్వార్థం తప్పా
ఎన్నికల వేళ ఎన్నెన్ని లీలలో
ఎన్నికల ముగిశాక
కంటికి కనబడని ప్రభువులు
నియోజకవర్గ పరిధికోసమైఖర్చుచేసే
అభివృద్ధి నిధుల్ని పందికొక్కులా మెక్కే
పచ్చిమోసకారులు
పాతపనులకు కొత్త పర్మీషన్లుతెచ్చుకొని
ప్రజాధనాన్ని దోపిడి చేసే కుట్రలు కుతంత్రాలు
ఎదిరించి అడిగితే తప్పుడుకేసులు బనాయించి
జైల్లో తోయడం
పోలీసు యంత్రాంగం
తమకనుసన్నలలో ఉన్నారన్న
అహంభావం అన్నివ్వవస్థల్ని
అవినీతిన ముంచిన వైనం
ఓటరు నోటుకు నాటుకు తలొగ్గినంతకాలం
ఈ వ్యవస్థ బాగుచేయడం
ఆ బ్రహ్మతరము కూడాకాదు
ఓటర్లు చైతన్యవంతులు కావాలి
ప్రజాస్వామ్యమంటే
ప్రజలచేత ప్రజలకొరకు ఏర్పడిన
వ్యవస్థ అని ప్రతి పౌరుడు గుర్తెరగాలి
అప్పటికిగాని ఎగుడుసమాజం
సమతలంకాదు
ఆదిశగా యువతరం నడుంబిగించాలి
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి