సునంద భాషితం - వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -458
కుంభీ ధాన్య న్యాయము
*****
కుంభీ అనగా కుండ.కుంభీ ధాన్యుడు అనగా వ్యుత్పత్తి అర్థం కుండలో ధాన్యము పోసుకొనువాడు అనియు రూఢమైన శ్రోత్రియుడు అనియు అర్థములు గలవు.
కుంభీధాన్యునకు గోవు నీయవలయుననిన గౌణార్థమవు మొదటి వానికా లేక ముఖ్యార్థమవు  శ్రోత్రియునకా అనే శంక కలిగినప్పుడు గౌణ ముఖ్యార్థములలో ముఖ్యార్థమునే గ్రహించవలయునని పెద్దలచే నిశ్చయింపబడినది.
కుండలో  ధాన్యం పోసుకోవడం, కొలవడం చేసేది ఎవరంటే ఠక్కున గుర్తొచ్చేది రైతులే.
పూర్వం ధాన్యం కొలవడానికి కుండను లేదా కుంచమును ఉపయోగించేవారు.
 ఎలాగూ సందర్భం వచ్చింది కాబట్టి ధాన్యం కొలిచే పాత్రలను గురించి చెప్పుకుందాం.
పండిన ధాన్యాన్ని కొలవడానికి 'కుండ లేదా కుంచం,మానిక,తవ్వ, సేరు,సోల ,మిద్దె మొదలైనవి ఉపయోగిస్తారు.
కుంభీధాన్యునకు గోవును ఇవ్వాలి అన్నప్పుడు ఒకటవ వ్యక్తి కుండలో ధాన్యం పోసుకునే వాడు అనే అర్థంతో చెప్పినప్పుడు అతడు ఖచ్చితంగా రైతే అయ్యుండాలి.ఎందుకంటే మనం ముందు చెప్పుకున్నట్లు రైతుల ఇళ్లల్లో మాత్రమే ఈ కొలిచే కుండలు, మిగతా  కొలతల వస్తువులు వుండేవి.
మరి రైతు అన్నాక అతనికి పాడి పంట వుంటుంది. పంట పొలాల్లో  పనుల కోసం,పాడి కోసం ఆవులు గేదెలు మొదలైన పశు సంపద తప్పకుండా రైతుల ఇళ్లల్లో వుంటుంది.కాబట్టి గౌణ, ముఖ్యార్థములలో గౌణార్థమైన కుంభీ ధాన్యుడిని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం అవుతోంది.
ఇక రెండవ ముఖ్యార్థమైన శ్రోత్రియుడిని పరిగణనలోకి తీసుకోవాలి.
మరి శ్రోత్రియుడు అంటే ఎవరు ?కేవలం కులము చేతనా ?గుణము చేతనా? అనేది కూడా చూడాలి.
రాజుకు జన్మించిన వాడు ఎలాంటి వాడైనా రాజవుతాడేమో కానీ బ్రాహ్మణుడికి జన్మించిన వాడు బ్రాహ్మణుడు కాక పోవచ్చునని ధర్మశాస్త్రాలు, వేదాలు పురాణాలు, స్మృతులు,శృతులు చెప్పాయని  మన పెద్దలు అంటుంటారు.
ఎందుకంటే  బ్రహ్మన్ అంటే యజ్ఞం. యజ్ఞాలు చేసేవారు బ్రాహ్మణులు. అంతే కాదు బ్రహ్మ జ్ఞానం తెలిసిన వారు ఎవరైనా సరే వారు బ్రాహ్మణులు.వారికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు, నియమాలు,నిష్ఠలు, ఆంక్షలు వుంటాయని పెద్దవాళ్ళు చెబుతుంటారు.
ఇక అసలు విషయానికి వస్తే ఎవరైతే బ్రహ్మజ్ఞానం తెలిసి,సమాజ హితైషిగా వుంటూ  పైన చెప్పిన విధంగా ప్రత్యేక లక్షణాలు కలిగి నియమ నిష్ఠలతో జీవితం కొనసాగిస్తూ వుంటారో వారే అసలైన శ్రోత్రియులు.వారికి గోవులను నిరభ్యంతరంగా ఇవ్వవచ్చు.
 ఏతావాతా చెప్పొచ్చేదేమిటంటే  గోదానమా?భూదానమా? మరో దానమా ? ఏదైనా సరే యోగ్యుడైన వ్యక్తి అనగా దానం పొందటానికి అర్హుడైన వ్యక్తి ఎవరైనా సరే కులమతాలకు అతీతంగా దానం పొందడానికి అర్హులు అనేది ఈ "కుంభీధాన్య న్యాయము" ద్వారా మనం గ్రహించవచ్చు.
 మహా భాగవతంలో పోతనామాత్యుడు వామన చరిత్ర లో  దానం పొందే వ్యక్తి కొన్ని అర్హతలు కలిగి వుండాలని అదెలా అంటే రైతుకు సారవంతమైన నేల, విత్తనాలు నీటి వసతి వాతావరణం ఎలా అనుకూలంగా వుండాలో అదే విధంగా  దాన గ్రహీత అన్ని అర్హతలు కలిగి వుండాలి. "నా దగ్గరకు వచ్చిన వాడు సామాన్యుడు కాడు సాక్షాత్తు శ్రీమహావిష్ణువు.అతడికి దానం ఇచ్చే అవకాశం రావడమే నా అదృష్టం" అంటాడు.
అంటే దాతతో పాటు గ్రహీత కూడా యోగ్యత కలిగి వుండాలి.కాబట్టి మనం ఇచ్చినా,పుచ్చుకున్నా ఎలా వుండాలో ఈ న్యాయం ద్వారా తెలుసుకోగలిగాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏
కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
అణిమ - మహిమ -------------------------------- అష్ట సిద్ధులు అనే మాట ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం. ఇంతకూ ఆ అష్ట సిద్ధులు ఏంటో తెలుసా? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - ఈ ఎనిమిదింఃఇనీ అష్టసిద్ధులు అంటారు. ఈ ఎనిమిది సిద్ధులు సామాన్యమైనవి కావు. వేటి ప్రానాన్యం వాటివే. వాటిలో మొదటిదైన అణిమ అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేసుకోవడం. మహిమ అంటేనేమో శరీరాన్ని పెద్దదిగా చేసుకోవడం. ఈ రెండింటినీ సాధించిన వాడు ఆంజనేయుడు. సీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఈ రెండు సిద్ఝులనూ ఆచరించి చూపాడు. లంకలో ప్రవేశించినప్పుడు, సూర్యాస్తమయం తర్వాత పిల్లి అంత చిన్నవాడిలా మారిపోయి ఆశ్చర్యకరమైన రూపాన్ని పొందాడు. వృషదంశకమంటే పిల్లి. అలాగే, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సముద్రాన్ని దాటేటప్పుడు మహిమ సిద్ధిని ప్రదర్శించాడు. ఆంజనేయుడి బలపరాక్రమాలను తెలుసుకోవాలనుకున్న దేవతలు దక్షప్రజాపతి కుమార్తె అయిన క్రోధవశకు జన్మించిన నాగమాత సురసాదేవిని కోరారు. అంతట సురసాదేవి రాక్షస దేహం ధరించి "దేవతలు నిన్ను ఆహారంగా సమర్పించారు. నా నోటిలోకి ప్రవేశించు" అని అడుగుతుంది. అప్పుడు 80 యోజనాల భారీకాయుడైన హనుమ కోసం 90 యోజనాల నోరు తెరిచిన ఆ సురసాదేవి నోట్లోకి ప్రవేశించి, ఆమె నోరు మూసే లోపల, బొటన వేలడంతవాడై బయటకు వచ్చేశాడు. అదీ హనుమంతుడి శక్తి!! - యామిజాల జగదీశ్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం