రాజాం రచయితల వేదిక సభ్యులు కుదమ తిరుమలరావుకు మరో సంస్థ, జాతీయ స్థాయిలో ఉగాది పురస్కారాన్ని ప్రకటించింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న తెలుగు వెలుగు సాహిత్య జాతీయ వేదిక ఆధ్వర్యంలో నిర్వహించుచున్న క్రోధి నామ సంవత్సర ఉగాది వారోత్సవాల్లో తిరుమలరావు, ఈ పురస్కారం పొందారు.
తమ సంస్థ స్థాపించిన తర్వాత నిర్వహించిన 150వ జూమ్ సమావేశానికి ఆహ్వానం అందుకున్న తిరుమలరావు తన సాహిత్య గానాలాపన చేసి అందరి ప్రశంసలు పొందారు. ఈమేరకు తిరుమలరావుకు జాతీయ స్థాయిలో పురస్కారాన్ని తెలుగు వెలుగు జాతీయ
అధ్యక్షులు పి ఆర్ ఎస్ ఎస్ ఎన్ మూర్తి, జాతీయ ప్రధాన కార్యదర్శి మోటూరి నారాయణరావు, జాతీయ ప్రధాన సలహాదారులు కిలపర్తి దాలినాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు మీసాల చినగౌరునాయుడు, ఎ.పి.మహిళా విభాగం అధ్యక్షురాలు డా.బి.హెచ్.వి.రమాదేవి, తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు పైడి నవనీత రవీందర్, జాతీయ గౌరవాధ్యక్షులు గంటా మనోహర్ రెడ్డిలు ప్రకటిస్తూ అంతర్జాలం ద్వారా ఉగాది పురస్కార పత్రాన్ని పంపారు.
ఇటీవల విజయనగరంలో ఉగాది రోజున వాగ్దేవి విద్యాభారతి బిరుదాంకిత పురస్కారాన్ని స్వీకరించిన కుదమ తిరుమలరావు, మరో పురస్కారానికి ఎంపికగుట పట్ల రాజాం రచయితల వేదిక కన్వీనర్ గార రంగనాథం తదితరులు హర్షం వ్యక్తం చేసారు.
తమ సంస్థ స్థాపించిన తర్వాత నిర్వహించిన 150వ జూమ్ సమావేశానికి ఆహ్వానం అందుకున్న తిరుమలరావు తన సాహిత్య గానాలాపన చేసి అందరి ప్రశంసలు పొందారు. ఈమేరకు తిరుమలరావుకు జాతీయ స్థాయిలో పురస్కారాన్ని తెలుగు వెలుగు జాతీయ
అధ్యక్షులు పి ఆర్ ఎస్ ఎస్ ఎన్ మూర్తి, జాతీయ ప్రధాన కార్యదర్శి మోటూరి నారాయణరావు, జాతీయ ప్రధాన సలహాదారులు కిలపర్తి దాలినాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు మీసాల చినగౌరునాయుడు, ఎ.పి.మహిళా విభాగం అధ్యక్షురాలు డా.బి.హెచ్.వి.రమాదేవి, తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు పైడి నవనీత రవీందర్, జాతీయ గౌరవాధ్యక్షులు గంటా మనోహర్ రెడ్డిలు ప్రకటిస్తూ అంతర్జాలం ద్వారా ఉగాది పురస్కార పత్రాన్ని పంపారు.
ఇటీవల విజయనగరంలో ఉగాది రోజున వాగ్దేవి విద్యాభారతి బిరుదాంకిత పురస్కారాన్ని స్వీకరించిన కుదమ తిరుమలరావు, మరో పురస్కారానికి ఎంపికగుట పట్ల రాజాం రచయితల వేదిక కన్వీనర్ గార రంగనాథం తదితరులు హర్షం వ్యక్తం చేసారు.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి