సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -472
ఖండిత శాఖా న్యాయము
    *****
ఖండిత అనగా ముక్కలు చేయబడిన,తెగగొట్టబడిన,త్రోసిపుచ్చబడిన.శాఖా అనగా కొమ్మ అని అర్థము.
కొమ్మను నరికినప్పటికి మళ్ళీ చిగురిస్తుంది. మనసు విరిగినా మళ్ళీ ఆశతో చిగురిస్తుందని అర్థము.
 ఎవరైనా చెట్టు కొమ్మను నరికితే దానికి బాధ కలుగుతుంది కాని అది జీవిస్తుంది.మళ్ళీ మనుగడ కోసం ప్రయత్నం చేస్తుంది. వేళ్ళూనుకున్న బతకాలనే ఆశ చెట్టును చిగురింప జేస్తుంది.
మనిషిలోని ఆశ కూడా అంతే.మొదలంటా మానసికంగా కృంగదీసి నానా హింసలు పెట్టి నరికినా భవిష్యత్తు  మీద  ఉండే ఓ పరమాణువు అంత  ఆశ చావకుండా బతికేలా  మనిషి చెట్టును చిగురించేలా చేస్తుంది.
అందుకేనేమో  అన్నీ కోల్పోయిన మనిషి కూడా చెట్టులా మనుగడ సాగిస్తూనే వుంటాడు.
మనిషి- చెట్టు, చెట్టు- మనిషి,.. ఒకసారి ఇలా  పోల్చి చూద్దాం.
చెట్టుకు మనిషికి బలమైన సంబంధమే వుంది. చెట్టు  మానవుడు కొన్ని ఒకేరకమైన లక్షణాలు కలిగి వున్నాడు అనిపిస్తుంది. ఎందుకంటే మనిషి ఊపిరి తిత్తులలోని సన్నని గొట్టాల వంటి నాళాల ద్వారా దేహమంతటికీ శాఖలుగా విస్తరించిన మూల వ్యవస్థ ఉన్నట్లే, చెట్టు మూల వ్యవస్థ శాఖోపశాఖలుగా విస్తరించి ఉంటుంది.
 చెట్లు ఇలా దేహ సంబంధమైన పోలికే కాదు ఆధ్యాత్మిక సంబంధమైన పోలిక కూడా ఉంది.అనేక పురాణాలలో, మతాలలో, సంప్రదాయాలలో చెట్టును మనిషి జీవితానికి చిహ్నంగా భావిస్తారు.
"చెట్టంత మనిషి","చెట్టులా ఎదిగిపోయాడు", మానూ మాకును కాను, గురువు తరువు...ఇలా చెట్టుతో మనిషిని  పోలుస్తూ చెప్పే జాతీయాలు, సామెతలు చాలానే ఉన్నాయి.
వృక్ష శాస్త్రవేత్తలు ఏమంటారంటే చెట్లలో కూడా మనిషిలో ఉన్నట్లు పంచభూతాలు కొలువై వున్నాయి.మనిషి వలెనే వినడం, చూడటం, రసం,స్పర్శ దృష్టి అనే ఐదు ఇంద్రియాలకు సంబంధించినవి ఉన్నాయని అంటారు.
ధ్వనికి సంబంధించి చూస్తే ఉరుములు,పిడుగుల శబ్దాలకు చెట్టుకు ఉన్న పువ్వులు, కాయలు, పండ్లు రాలిపడటం.దృష్టికి సంబంధించి గమనిస్తే ఏదైనా తీగ తన దగ్గరలో ఉన్న ఆధారాన్ని గమనించి దానిపైకి పాకడం.ముట్టుకుంటే ముడుచుకు పోవడం.చీడపీడలు సోకినప్పుడు అనారోగ్యంతో బాధపడటం. తగ్గిన తర్వాత కొత్త చిగుళ్లతో నవనవ లాడటం. పెరగడం జీవితం తరగడం.మరణం లాంటి లక్షణాలు ఎన్నో మనిషిని పోలి ఉన్నాయి.
 ఇలా  చెట్టు లాంటి మనిషైతే త్యాగధనుడై జీవితాన్ని చరితార్థం చేసుకుంటాడు.మనిషి  లాంటి చెట్టైతే తాను చక చక ఎదుగుతాడు.మనిషిలా ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా నిలువునా నరికితే మోడైన జీవితాన్ని మళ్ళీ చిగుర్చుకోవాలని తపిస్తాడు.
కాబట్టే మన పెద్దలు "ఖండిత శాఖా న్యాయము" తో మానవుణ్ణి పోల్చి చెబుతుంటారు.
చెట్టుకైనా, మనిషికైనా ఆశనే బతికిస్తుంది.ఆశనే ఎదిగేలా చేస్తుంది.ఐతే చెట్టు మళ్ళీ చిగురించేది మాత్రం తన కోసం కాదు.సమస్త జీవుల కోసమే ప్రాణ వాయువు,నీడ,పూలు పండ్లు మొదలైనవి ఇవ్వడానికే.మనుషులమైన మనమూ చెట్టులా జీవించాలి.
ఎదుటి వారు మనసును ముక్కలు ముక్కలుగా ఖండించినా చెట్టులా క్షమిస్తూ పరోపకారియై జీవితం గడపాలని ఈ న్యాయము ద్వారా మనం తెలుసుకోవలసిన నీతి.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
అణిమ - మహిమ -------------------------------- అష్ట సిద్ధులు అనే మాట ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం. ఇంతకూ ఆ అష్ట సిద్ధులు ఏంటో తెలుసా? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - ఈ ఎనిమిదింఃఇనీ అష్టసిద్ధులు అంటారు. ఈ ఎనిమిది సిద్ధులు సామాన్యమైనవి కావు. వేటి ప్రానాన్యం వాటివే. వాటిలో మొదటిదైన అణిమ అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేసుకోవడం. మహిమ అంటేనేమో శరీరాన్ని పెద్దదిగా చేసుకోవడం. ఈ రెండింటినీ సాధించిన వాడు ఆంజనేయుడు. సీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఈ రెండు సిద్ఝులనూ ఆచరించి చూపాడు. లంకలో ప్రవేశించినప్పుడు, సూర్యాస్తమయం తర్వాత పిల్లి అంత చిన్నవాడిలా మారిపోయి ఆశ్చర్యకరమైన రూపాన్ని పొందాడు. వృషదంశకమంటే పిల్లి. అలాగే, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సముద్రాన్ని దాటేటప్పుడు మహిమ సిద్ధిని ప్రదర్శించాడు. ఆంజనేయుడి బలపరాక్రమాలను తెలుసుకోవాలనుకున్న దేవతలు దక్షప్రజాపతి కుమార్తె అయిన క్రోధవశకు జన్మించిన నాగమాత సురసాదేవిని కోరారు. అంతట సురసాదేవి రాక్షస దేహం ధరించి "దేవతలు నిన్ను ఆహారంగా సమర్పించారు. నా నోటిలోకి ప్రవేశించు" అని అడుగుతుంది. అప్పుడు 80 యోజనాల భారీకాయుడైన హనుమ కోసం 90 యోజనాల నోరు తెరిచిన ఆ సురసాదేవి నోట్లోకి ప్రవేశించి, ఆమె నోరు మూసే లోపల, బొటన వేలడంతవాడై బయటకు వచ్చేశాడు. అదీ హనుమంతుడి శక్తి!! - యామిజాల జగదీశ్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం