రాకేష్ కుక్కపిల్ల;- కె.ఉషశ్రీ -10వ తరగతి-జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నీర్మాల
 అనగనగా ఒక ఊరిలో ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారు. సత్తయ్య ,సరిత ఉండేవారు. వాళ్లకు ఒక కొడుకు ఉన్నాడు. రాకేష్, బడికి వెళ్తాడు. వాళ్ల అమ్మ ,నాన్న బడిలో అన్నం వండి పిల్లలకు పెడుతారు. రాకేష్ బడికి వెళ్లి బాగా చదువుకుంటాడు. ఆదివారం రోజు అలా బయటకు వెళ్లి ఆడుకుంటాడు. కొద్దిసేపటికి చిన్న కుక్క పిల్లకు కాలుకు దెబ్బ తగిలి రక్తం వస్తుంది. అప్పుడు రాకేష్ అది చూసి కుక్క పిల్ల దగ్గరకు వెళ్లి కుక్క పిల్లకు మందులు వేసి కట్టు కట్టిండు. కుక్క పిల్లను ఇంటికి తీసుక వెళ్తాడు. కుక్క పిల్లకు పాలు, అన్నం బిస్కెట్లు, మందులు వేసుకుంటూ బడికి వెళ్తాడు. అలా వారం తరువాత కుక్కపిల్లకు దెబ్బ తగ్గిపోయింది. రాకేష్ చాలా ఆనందంగా ఉంటాడు. సాయంత్రం బడి నుండి రాగానే ఒక పిల్లతో ఆడుకుంటాడు. కొన్ని సంవత్సరాలకు కుక్క పిల్ల పెద్దగా అయ్యింది. రోజు రాకేష్ తోనే బడికి వెళ్తుంది. రాకేష్ వాళ్ల అమ్మ, నాన్న కుక్కని ప్రేమగా చూసుకుంటున్నారు. అందరూ సంతోషంగా ఉన్నారు.
నీతి, ఆపదలో ఉన్న జంతువులను కాపాడే బాధ్యత మనది. రాకేష్ లాగా మంచి ఆహారం, మందులు వేసి ప్రేమగా చూసుకోవాలి. కుక్క పిల్లని పెంచి పెద్ద చేయాలి. దొంగల బారిన నుండి మనల్ని కుక్కలు రక్షిస్తాయి.

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం