2మారీచుడు ! అచ్యుతుని రాజ్యశ్రీ

 మహాత్ముడు మారీచుడు అంటే ఆశ్చర్యం గా ఉంటుంది కదూ? రామోవిగ్రహవాన్ ధర్మః అన్నాడు.భీతభక్తిలో అంతటా రాముని చూసి న తాపసి.రాక్షసుడైనా ధర్మం ని రావణుని కి చెప్పాడు."రావణా! నీకు ఎవరో రాముని పై అబద్ధాలు చెప్పారు.తండ్రి వెళ్లగొట్టలేదు.పితృవాక్యపరిపాలకుడు.విశ్వామిత్రుని యాగరక్షణకు మీసాలు రాని ఆపసివాడి బాణాలదెబ్బలకు 100 యోజనాల దూరంలో ఉన్న సముద్రంలో పడ్డాను.యాగకుండంలో రక్తాన్ని పారబోస్తున్న నా అహంకారం గర్వంని చిత్తు చేసిన భగవదవతారం.సరోవరంలో పాములుంటే జనం వాటిని చంపుతారు.వాటితోపాటు చేపలు కూడా చస్తాయి.నా ఇద్దరు అనుచరులు రాముని రెండు బాణాలకు ఆనవాలు లేకుండా పోయారు.అందుకే
నేను చెడ్డ పనులు మానేసి అన్ని చోట్లా కోదండరాం నే చూస్తూ ఉన్నాను.ఇప్పుడు సీతామాత భార్యగా 
ఉన్న ఆయన శక్తి సంపన్నుడు.నీకున్న వెయ్యి మంది భార్యలతో సుఖించు." నిజంగా అంత పరివర్తన తో సాధుజీవితం గడుపుతున్న మారీచుడు మహనీయుడు.చెడుమార్గం నించి భక్తి మార్గం లో పయనించిన మారీచుడు ఆదర్శనీయుడు..
 చుప్పనాతి శూర్పణఖ కి గోళ్ళలో  బుద్ధి లో విషం.రాముని పొందాలని అనుకుంది.అందుకే రాముని తో " నీ భార్య అందంగా లేదు.నన్ను పెళ్ళాడు" అని అడిగితే లక్ష్మణుని దగ్గరకు పంపితే ఆయన దాని ముక్కు చెవులు కోస్తే అది బుడిబుడి ఏడ్పులు ఏడుస్తూ పెడబొబ్బలు పెడుతూ రావణుని దగ్గర కెళ్ళి ఎలా రెచ్చగొట్టేలా మాట్లాడిందో చూడండి " నీకు తగిన అందగత్తె ఆసీతని నీ భార్య గా చేసుకో అన్నయ్యా! నీ గూఢచారులు ఏమీ చెప్పలేదు కదూ?" అని అగ్ని లో ఆజ్యం పోసింది.ఒక్క దెబ్బ కు రెండు పిట్టలు ఆమె ప్లాన్.రాముడు తనకు దక్కుతాడు.సీతపై ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉంటుంది.సీత వల్లనే తనను రాముడు నిరాకరించాడు అని ఆకుళ్లు బుద్ధి చుప్పనాతి భావం.సీతపై కోరిక పెంచింది..
కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం