బాల్యం మళ్ళీ వస్తే ... ;- శిరందాస్ శ్రీనివాస్హైదరాబాద్9441673339

నా బాల్యం 
మళ్ళీ మళ్ళి గుర్తొస్తుంది..
పదే పదే యాదికి వస్తుంది..
యాభై యేళ్ళు వెనక్కి వెళితే
నా జ్ఞాపకాలు నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నయి. 

అక్షరాభ్యాసం చేసింది మొదలు
అన్నీ ఇతిమిద్ధంగా గుర్తులేకున్నా..
అందరిలో ఒకడిగా ఆడుకున్న రోజులు అబ్బురమనిపిస్తూంది..

బడిలో బలపంతో దిద్దిన
అక్షరాలు నా బతుకుకి చెక్కిన
శిలా శాసనాలు అవుతాయని అనుకోలేదు ఆనాడు..
ఆ అక్షరాల దొంతరలే 
నా ఐదంకెల జీతానికి
సోపానాలు అవుతాయనీ
అనుకోలేదు ఏనాడు.

పెందలాడి లేచి అమ్మకు 
బావి నుండి నీళ్ళు చేదిపెట్టి 
గబ గబా తయాారయ్యి
పుస్తకాల సంచి చేతబట్టి
బడికి పరిగెత్తిన రోజులు
భలే భలే అనిపిస్తున్నయి.. 

తెల్ల చొక్కా ఖాకీ నిక్కరు
నాకెప్పుడూ బోరు రాలేదు
శనివారం రోజు సివిల్ డ్రెస్
నాకెప్పుడూ జోరు పెంచలేదు.
పంతులు చెప్పే పాఠాలు
ఏనాడు బోరు కొట్ట లేదు..

వర్షంలో తడుస్తూ
వీధుల్లో ఆనకట్టలు కట్టి 
ఇసుకలో పిచ్చుక గూడ్లు కట్టి
సివిల్ ఇంజనీర్ లా
ఆనందపడ్డ అధ్భుత క్షణాలు 
మళ్ళీ వస్తే బాగుండు అనిపిస్తుంది..

అగ్గి పెట్టలతో మోటారు కార్లు
సిగరెట్ల పాకెట్ అట్ట ముక్కలతో
పేక ముక్కల ఆట..
కాలిపోయిన కరెంటు బుగ్గతో 
తెగిన సినిమా రీళ్ళతో 
గోడ మీద ప్రదర్శనలు..
పాడైన సైకిల్ టైర్లతో 
లేదంటే ఇనుప చక్రంతో
వీధుల్లో తిరుగుతూ..
వీధి వీధి నాదే బ్రదర్
కల్మషం లేని స్నేహానికి 
హద్దులే లేవు ఆనాడు..

పొట్టి లాగుతో
గంటకు పావలా బెట్టి
సైకిల్ కాంచి తొక్కుతూ
ఊరంతా ఊరేగుతూ..
బలాదూర్ గా తిరిగిన వైనం
16 ఎం ఎం సినిమా అంగట్లో
ఓపెన్ థియేటర్లో చూడడం
భలే భలే ఇష్టం ..

కిక్కిరిసిన తరగతి గది
ఆటస్థలమే లేని ఆధునిక బడి
మోయలేని పుస్తకాల సంచి
వంగి పోయే వీపులు చూస్తే
అయ్యో పాపం అనిపిస్తూంది.
నేటి బాల్యంతో పోల్చుకుంటే 
నేను ఎంత అదృష్టవంతుడిని 
అనిపిస్తూంది..

పదో తరగతి ఫస్ట్ అంటే
పండగే ఊరంతా..
కాలేజీ చదువంటే
ఉద్యోగం వచ్చినట్టే..


బట్టీ చదువులతో 
పదికి పది గ్రేడ్ మార్కులు వచ్చినా
డిగ్రీలు పీజీలు డిస్టింక్షన్ లో పాసైనా
ఓ ఉత్తరం ముక్క రాయరాదు 
అంతర్జాలం లేకుంటే అంతా అయోమయమే..నేడు

2 ప్లస్ 2 అంటే 
కాల్కులేటర్ కావాలి..
పది ఫోన్ నెంబర్లను గుర్తించుకోలేని నేటి తరం
వంద ఫోన్ నంబర్లను అవలీలగా గుర్తుపెట్టుకునే నాటి తరం..

వంటికి మేధకు పదును పెట్టని 
నేటి తరం
రెక్కలు ముక్కలు చేసుకుని
ఆరోగ్యంగా ఉన్న నాటి తరం
కొవ్వు కరిగించుకోడానికి
జిమ్ముల్ల కుస్తీ పట్టే నేటి తరం.
అవసరం కొద్ది సైకిల్ ఆనాడు
ఆరోగ్యం కోసం సైకిల్ ఈనాడు..

మొబైల్ ఫోన్ లేని నాటి తరానికి
ఊరంతా చుట్టాలే..
ఆత్మీయపు పలకరింపులే 
బడిలో చదివే వారంతా స్నేహితులే 
చదువు చెప్పే పంతుల్లంతా దేవుళ్ళే..
 
ఫేస్ బుక్ లేని నాటి తరానికి
ఇరుగు పొరుగుతో కబుర్లే
ఇంటిల్లిపాదికి ఇష్టాలు..
కష్టాల్లో వారే ఆపద్భాందవులు..
వాట్సాప్ లేని మా తరానికి
ఉత్తరాలే ప్రత్యుత్తర సమాధానాలు

ఏ సాంకేతికత లేకున్నా
ఎంతో ఆనందంగా గడిపిన ఆ రోజులు..
నిర్మలమైన ఆకాశంలో 
చుక్కలు లెక్కెట్టుకుంటూ..
మర్ఫీ, ఫిలిప్స్ రేడియోల్లో 
వివిధ భారతి పాటలు వింటూ
హాయిగా నిద్రపోయిన
ఆ రోజులు మళ్ళీ వస్తే బాగుండు..

కాలచక్రం ఒక్క సారిగా వెనక్కి
తిరిగి బడి బాట పడితే బాగుండు..
ఈ యాంత్రిక ప్రపంచం మాయమై
నా బాల్యం మళ్ళీ వస్తే బాగుండు..
ఈ మనీ ప్రపంచంలో మరమనిషిలా కాక 
మనుష్యుల మధ్య ఓ మనిషిగా బ్రతికేస్తా..



కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం