నా ఆలోచన;- చిరసాని శైలూషి,నెల్లూరు.
 స్త్రీ పురుష సంగమం వల్ల బిడ్డ తల్లి గర్భంలో ప్రారంభమవుతుంది  ఒక్కొక్క నెలలో ఒక్కొక్క మార్పు వస్తుంది ఆ బిడ్డకు  దానిని దశావతారములు అంటారు  దశ అంటే మార్పు  స్థితి అనే అర్థం  మొదటి నెలలో ఆ పిండం చేప ఆకారం ఉంటుంది రెండో నెలలో తాబేలు ఆకారంగా మారుతుంది మూడో నెలలో పంది అకారంగా మారుతుంది  అక్కడ నుంచి మానవ ఆకృతి రావడానికి మొదటగా పొట్టి వాడు  ఆ తరువాత శ్రీరామచంద్రమూర్తి వారి తరువాత  పరశురాముడు చివరకు బలరాముడు  అందర రాములు అయిన తర్వాత తొమ్మిదవ నెలలో బుద్ధి  శరీరంలో ప్రవేశిస్తుంది కనుక దానిని బుద్ధ అవతారంగా చెప్పారు  దశావతారములు అంటే మన వారు చెప్పేది 10 అవతారాలు అని  ఆ పది ఎక్కడ ఉన్నాయి అని అంటే రాబోయే కల్కి అవతారము అని సమాధానం చెబుతారు  అది ఎప్పుడొస్తుందో ఎలా వస్తుందో ఎవరికీ తెలియని పదార్థం.అంటే పరోక్షంగా వారు చెప్పింది ప్రతి మనిషిలోను పశుతత్వం  దైవ తత్వం రెండు కలిసి ఉంటాయి అని  అంటే దైవమే అని వారే ఒప్పుకుంటున్నారు ఈ ప్రపంచంలోకి వచ్చాక బిడ్డను చూసి  దేవుడు అన్న శబ్దానికి అర్థం దివ్ అంటే జ్ఞానం, ఆ జ్ఞానం కలిగిన వారు దేవుడు  ప్రపంచంలో మనం చూస్తున్నాం ఏ పశుపక్షులకు  జంతువులకు లేని ప్రత్యేక లక్షణం మానవునికి ఉన్నది అది మాట్లాడడం  ఎదుటివారు మాట్లాడినది అర్థం చేసుకోవడం దానికి సమాధానం చెప్పగలగడం  దానినే బుద్ధి అంటున్నాo ప్రతి బిడ్డ జ్ఞానంతోనే పుడుతుంది అని శాస్త్రం చెప్తోంది  జీవితంలో తనకు కలిగిన సంఘటనలను  ఎలా అనుభవిస్తున్నాడు  కష్టభరితమైన వాటిని ఎలా పరిష్కరించుకుంటున్నాడు అన్న వాడు జ్ఞానమే విజ్ఞానం  ఆ విజ్ఞానం కలగడం వలన ప్రపంచంలో ఉన్న ప్రతి విషయాన్ని ఆకళింపు చేసుకోవడానికి  ప్రయత్నంచేస్తాడు మనిషి  ఆ ప్రయత్నం వల్లనే అంతరిక్ష ప్రయాణానికి కూడా దోహదపడింది.భగవంతుడు ఎవరు అనేదానికి సమాసము ఎవరైనా చెప్తున్నారా  అంత పరిజ్ఞానం ఎవరికైనా ఉన్నదా  నిజంగా భగవంతుడు ఉండి ఉంటే ఆ భగవత్ స్వరూపాన్ని ఎదురుగా పెట్టి పూజిస్తూ వశిష్ట మహర్షి దగ్గర నుంచి విశ్వామిత్ర మహర్షి వరకు ప్రతి ఒక్కరూ తపస్సులో ఉండేవారు కదా  ఆకారం లేని ఏకాంత ప్రదేశంలో కూర్చుని తన మనసునే నమ్ముకుని  పంచేంద్రియాలు తన స్వాధీనం చేయడానికి ఎందుకు ప్రయత్నించారు  నిజంగా భగవంతుడు ఉంటే ఏదో ఒక అవతారంలో ఉండాలి ఒక పేరుతో ఉండాలి  భారతీయులకు కనిపించిన ప్రతిదీ దైవమే  చెట్లను పూజిస్తాము పాములను పూజిస్తాం  రైతులు ఎడ్ల ను పూజిస్తారు  నాగలినే పూజిస్తారు చేనును పూజిస్తారు ఇవన్నీ దైవ స్వరూపాలు కావా అనేది ప్రశ్న  ప్రతి గ్రామ దేవతను  మనం ప్రతి గ్రామంలోనూ చూస్తూ ఉంటాo  ఆమె మహత్తులు అన్ని ఇన్ని కాదు అని డప్పాలు చెప్పుకుంటాం.


సమన్వయం ; డాక్టర్ . నీలం స్వాతి
కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం