బడిగంటలు మ్రోగే వేళ ;- గుండాల నరేంద్ర బాబు,
పల్లవి:                       
బడి గంటలు మ్రోగే వేళ
మది అంబరమయ్యింది/
గది తలుపులు తెరిచే వేళ 
తెగ సంబర  పడుతోంది/             
  బడి గంటలు మ్రోగే వేళ మది అంబరమయ్యింది/     
గది తలుపులు తెరిచే వేళ తెగ సంబర పడుతోంది/
గురుదేవుని చూడగ మీరొస్తే/బడి
 మాదని మురియగ మేమొస్తే/ అది చదువుకు శ్రీకారం/                      
బడి గంటలు మ్రోగే వేళ 
మది అంబరమయ్యింది/      
గది తలుపులు తెరిచే వేళ 
తెగ సంబర పడుతోంది 

చరణం:1                
అమ్మ పైట కొంగు వెంట పిల్లలంతా తరలి వచ్చిరంటా../ఆ పిల్లలతో బడి అంతా నిత్యం కళ కళలాడె నంట/
మా నమ్మకం మీరే నిలపాలీ నిలపాలి.../
మా బిడ్డల భవిత మీరే కావాలి కావాలి/
పిల్లల మదిలో  నిలిచి పోవాలి పోవాలీ/
గురుశిష్యుల అనుబంధం పెరగాలి పెరగాలి/
శిష్యుల ఘనతకు మూలం గురువై/
గురు ప్రతిభా కిరణాలు శిష్యులై../
గురువులను మరువకుండా ఎల్లప్పుడూ ఉండాలి/గురువుకు తగ్గా శిష్యులు అని నిరూపించాలి/                    బడి గంటలు మ్రోగే వేళ మది అంబరమయ్యింది/      
గది తలుపులు తెరిచే వేళ 
తెగ సంబర పడుతోంది  

చరణం:2                       శాస్త్రీయతకు పట్టం కట్టాలీ కట్టాలి/
శిష్యుల ప్రతిభకు పదును పెట్టాలి పెట్టాలి పెట్టాలి../బంగరు భవితకు బాటలు వేయాలి వేయాలి/
మా చిరునామా మీరే కావాలి కావాలి కావాలి/
నీతికి నిలువుటద్దాలు మీరై /అమ్మానాన్నల ఆశలు మీరై /కన్నవాళ్ళ కన్నీళ్లే తుడిచి  ఆదరించాలి/
చెరగని మీ అడుగులలో  మేము పయనించాలి

 (చిత్రం:,నిన్నే ప్రేమిస్తా,సంగీతం:ఎస్.ఏ.రాజ్ కుమార్, సాహిత్యం:గంటాడి కృష్ణ, గానం :రాజేష్,చిత్ర, 

పేరడీ రచన :
గుండాల నరేంద్ర బాబు, 

"ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత "

తెలుగు ఉపాధ్యాయులు 
కే ఎన్ ఆర్. నగర పాలక ఉన్నత పాఠశాల, బి. వి.నగర్, నెల్లూరు, సెల్ :9493235992

తేది:13-06-2024న ఆంధ్రప్రదేశ్ లో పాఠశాలలు పునఃప్రారంభిస్తున్న  నేపథ్యంలో రాసిన పేరడీ పాట 

( గుడి గంటలు మ్రోగిన వేళ "శైలిలో...)


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం