వీక్షణం 12 వ వార్షికోత్సవం అటు కాలిఫోర్నియాలోనూ, ఇటు అంతర్జాలంలోనూ సెప్టెంబరు 14, 20, 21వ తేదీల్లో అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా అమెరికాలోని ప్రముఖ కథారచయిత, భాషా నిపుణులు, వేమూరి నిఘంటు నిర్మాణ కర్త డా||వేమూరి వేంకటేశ్వర్రావు గారికి వీక్షణం "జీవన సాఫల్య పురస్కారాన్ని" అందజేసి ఘనంగా సత్కరించింది.
సెప్టెంబరు 20/21, 2024 తేదీలలో వీక్షణం 12 వ వార్షికోత్సవం అంతర్జాలంలో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని వీక్షణం వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రముఖ రచయిత్రి డా.కె.గీతామాధవి సభకు ఆహ్వానం పలికి ప్రారంభించారు. ఈ అంతర్జాల కార్యక్రమంలో ముందుగా వీక్షణం భారతదేశ ప్రతినిధి శ్రీ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ వీక్షణం ప్రత్యేక సంచికలను ఆవిష్కరించారు. శ్రీ కందుకూరి శ్రీరాములు, శ్రీ వసీరా ఆత్మీయవాక్యాలు పలికారు. శ్రీమతి సుధా కొలచన కవిసమ్మేళనాన్ని నిర్వహించారు. ఇండియా, అమెరికా దేశాల నుండి కవులు పాల్గొన్న ఈ అంతర్జాతీయ కవి సమ్మేళనంలో కందుకూరి శ్రీరాములు, డా||కె.గీత, వసీరా, కమర, శ్రీధర్ రెడ్డి బిల్లా, గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, డాక్టర్ మోటూరి నారాయణరావు, కందూర్ చంద్ర ప్రకాశ్ గుప్తా, డాక్టర్ దేవులపల్లి పద్మజ, శ్రీసుధ కొలచన, డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, మేడిశెట్టి యోగేశ్వరరావు, మామిళ్ల లోకనాథం, మల్కని విజయలక్ష్మి, ఎస్. రత్నలక్ష్మి, అమృతవల్లి అవధానం, ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్, డా. కందేపి రాణీప్రసాద్, లగిశెట్టి రాము, కె వి యస్ గౌరీపతి శాస్త్రి (వీరవతి), చిట్టాబత్తిన వీరరాఘవులు, అమీనా కలందర్, ప్రసాదరావు రామాయణం, డా. అరుణ కోదాటి, గుర్రం మల్లేశం, మనోహర్ రెడ్డి గంటా, రామకృష్ణ చంద్రమౌళి, ఉప్పలపాటి వెంకట రత్నం, డా. భోగెల. ఉమామహేశ్వరరావు (ఉమాకవి), శోభాదేశపాండే, జె.వి.కుమార్ చేపూరి మొదలగు వారు పాల్గొని కవితాగానం చేసారు.
ఎందరో సాహిత్యాభిలాషులు విశేషంగా పాల్గొన్న ఈ వార్షికోత్సవ సందర్భంగా వీక్షణం అధ్యక్షులు డా.కె.గీతామాధవి కవులకు, కవితల పోటీ విజేతలకు ప్రశంసాపత్రాల్ని అందజేశారు.
గత పన్నెండేళ్లుగా "వీక్షణం" సాహితీ గవాక్షం అమెరికాలోని కాలిఫోర్నియా, బే ఏరియా లోనే కాక, గత రెండేళ్లుగా అంతర్జాతీయ అంతర్జాల సాహిత్య కార్యక్రమాలు జరుపుకుంటూ ప్రవాసాంధ్రుల తెలుగు భాషాభిమానాన్ని, సాహిత్యాభిలాషని ప్రపంచమంతా చాటుతున్నది.
సెప్టెంబరు 20/21, 2024 తేదీలలో వీక్షణం 12 వ వార్షికోత్సవం అంతర్జాలంలో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని వీక్షణం వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రముఖ రచయిత్రి డా.కె.గీతామాధవి సభకు ఆహ్వానం పలికి ప్రారంభించారు. ఈ అంతర్జాల కార్యక్రమంలో ముందుగా వీక్షణం భారతదేశ ప్రతినిధి శ్రీ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ వీక్షణం ప్రత్యేక సంచికలను ఆవిష్కరించారు. శ్రీ కందుకూరి శ్రీరాములు, శ్రీ వసీరా ఆత్మీయవాక్యాలు పలికారు. శ్రీమతి సుధా కొలచన కవిసమ్మేళనాన్ని నిర్వహించారు. ఇండియా, అమెరికా దేశాల నుండి కవులు పాల్గొన్న ఈ అంతర్జాతీయ కవి సమ్మేళనంలో కందుకూరి శ్రీరాములు, డా||కె.గీత, వసీరా, కమర, శ్రీధర్ రెడ్డి బిల్లా, గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, డాక్టర్ మోటూరి నారాయణరావు, కందూర్ చంద్ర ప్రకాశ్ గుప్తా, డాక్టర్ దేవులపల్లి పద్మజ, శ్రీసుధ కొలచన, డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, మేడిశెట్టి యోగేశ్వరరావు, మామిళ్ల లోకనాథం, మల్కని విజయలక్ష్మి, ఎస్. రత్నలక్ష్మి, అమృతవల్లి అవధానం, ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్, డా. కందేపి రాణీప్రసాద్, లగిశెట్టి రాము, కె వి యస్ గౌరీపతి శాస్త్రి (వీరవతి), చిట్టాబత్తిన వీరరాఘవులు, అమీనా కలందర్, ప్రసాదరావు రామాయణం, డా. అరుణ కోదాటి, గుర్రం మల్లేశం, మనోహర్ రెడ్డి గంటా, రామకృష్ణ చంద్రమౌళి, ఉప్పలపాటి వెంకట రత్నం, డా. భోగెల. ఉమామహేశ్వరరావు (ఉమాకవి), శోభాదేశపాండే, జె.వి.కుమార్ చేపూరి మొదలగు వారు పాల్గొని కవితాగానం చేసారు.
ఎందరో సాహిత్యాభిలాషులు విశేషంగా పాల్గొన్న ఈ వార్షికోత్సవ సందర్భంగా వీక్షణం అధ్యక్షులు డా.కె.గీతామాధవి కవులకు, కవితల పోటీ విజేతలకు ప్రశంసాపత్రాల్ని అందజేశారు.
గత పన్నెండేళ్లుగా "వీక్షణం" సాహితీ గవాక్షం అమెరికాలోని కాలిఫోర్నియా, బే ఏరియా లోనే కాక, గత రెండేళ్లుగా అంతర్జాతీయ అంతర్జాల సాహిత్య కార్యక్రమాలు జరుపుకుంటూ ప్రవాసాంధ్రుల తెలుగు భాషాభిమానాన్ని, సాహిత్యాభిలాషని ప్రపంచమంతా చాటుతున్నది.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి