శివానందలహరి;- కొప్పరపు తాయారు

 శ్లో:
 నాలం వా సకృదేవ దేవ  భవతస్సేవా  నతిర్వా  నుతిః
పూజ వా స్మరణం కథా శ్రవణ మప్యాలోకనం మాదృశామ్
 స్వామిన్నస్థిర దేవతానుసరణా యాసేన  కిం లభ్యతే
కావా ముక్తిరితః  కుతో  భవతి చేత్కిం ప్రార్దనీయం తదా !

భావం: దేవా! శివా! నిను ఒక్కసారి సేవించినా,నమస్కరించినా, స్మరించినా, పూజించినా, దర్శించినా, నీ కథను విన్నా చాలును. దీనికంటే ముక్తి మరొకటి లేదు కదా! మా వంటి వారికి ఈ పైన చెప్పిన వాటి వల్ల, ముక్తి కలుగుతూ ఉండగా, అశాశ్వతులైన ఇతర దేవతలను కష్టపడి సేవించడం వలన ఏమి లభించును. 
                  *****

కామెంట్‌లు