బహుమతి: - సాయి హర్షిత్ -సిద్దిపేట
 అనగనగా రామవనం  అనే ఊరిలో రాజు  అనే బాలుడు ఉండేవాడు .రాజు చిన్నప్పటినుండి చదువులో చాలా చురుకుగా ఉండేవాడు. ఒకరోజు పిల్లలు కలిసి అడవికి వెళ్లి, కట్టెలు తీసుకురావడానికి వెళ్ళాడు. 
       అడవిలో ఒక పులి ఉంది. దానికి చాలా రోజుల నుండి సరైన ఆహారం లేక ఆకలితో ఉన్నది. పిల్లలను చూసిన పులి ఎంతో ఆనందంగా, పిల్లల వైపు నెమ్మదిగా వెళ్ళసాగింది. పులి రాకను గమనించిన పిల్లలు పెద్దగా కేకలు వేస్తూ, ఏడ్వసాగారు. రాజు పిల్లల అరుపు విని, పులి నుండి పిల్లలను రక్షించడానికి దగ్గరలో ఉన్న పదునైన కర్ర తీసుకొని పులికి ఎదురుగా వెళ్లి పోరాటం చేశాడు. 
      పులి ఆవేశంతో రాజుపై దాడి చేయడం వల్ల చాలా రాజుకు చాలా గాయాలయ్యి రక్తం కారుతునప్పటికీ రాజు ధైర్యంగా పులితో పోరాటం చేస్తూ, తరిమేశాడు. 
          రాజు గాయాలతో పిల్లలను తీసుకొని గ్రామంలోకి వెళ్లడం జరిగింది. పిల్లల ద్వారా జరిగిన విషయం తెలుసుకొని ఆ ఊరి ప్రజలంతా రాజు గాయానికి వైధ్యం చేయించి, బంగారు కర్రను బహుమతిగా ఇవ్వడం జరిగింది.




కామెంట్‌లు