నవ్వుతూ బ్రతకాలిరా - 23:- సి.హెచ్.ప్రతాప్

 1. వెంగళప్ప: "  డాక్టర్,ఈ కళ్ళద్దాలు వాడడం మొదలెట్టాక నేను చదవడం మొదలెట్టగలనా ?"
డాక్టర్ : " ఓ ఎస్, నిరభ్యంతరంగా !"
వెంగళప్ప: "నేను మీకు చాలా ఋణపడి వున్నాను డాక్టర్, ఎందుకంటే నాకు ఈ రోజు దాకా చదవడం రాదు."
2. జేంస్ బాండ్ లాస్ ఏంజెల్స్ లో ఒక తెలుగు విధ్యార్ధిని కలిసి షేక్ హాండ్ ఇచ్చి " అయాం బాండ్, జేంస్ బాండ్, వాట్ ఈస్ యువర్ నేం"అని అడిగాడు.
ఆ విధ్యార్ధి వెంటనే చిరునవ్వుతో "అయాం నాయుడు, వెంకట నాయుడు... లక్ష్మీ నారాయణ వెంకట నాయుడు... శ్రీనివాసులు లక్ష్మీ నారాయణ వెంకట నాయుడు... రాజశేఖర శ్రీనివాసులు లక్ష్మీ నారాయణ వెంకట నాయుడు...సీతారామ రాజశేఖర శ్రీనివాసులు లక్ష్మీ నారాయణ వెంకట నాయుడు...బొమ్మిరాజుల సీతారామ రాజశేఖర శ్రీనివాసులు లక్ష్మీ నారాయణ వెంకట నాయుడు... కేతరాన్య బొమ్మిరాజుల సీతారామ రాజశేఖర శ్రీనివాసులు లక్ష్మీ నారాయణ వెంకట నాయుడు... కేతరాన్య బొమ్మిరాజుల సీతారామ రాజశేఖర శ్రీనివాసులు లక్ష్మీ నారాయణ వెంకట నాయుడు...ఇప్పుడు నా పేరు తిరిగి చెప్పండి " అన్నాడు.
ఆ మాటలకు జేంస్ బాండ్ కళ్ళు తిరిగి ఢామ్మని పెద్దగా శబ్దం చేస్తూ కింద పడిపోయాడు.    
3. సుధీర్  :"నేను రేఖకు ఏప్రిల్ ఒకటో తేదీన పెళ్ళి ప్రపోజల్ చేద్దామనుకుంటున్నాను"
సుశీల్ :" చాలా విచిత్రంగా వుంది.ఆ రోజునే ఎందుకు చేద్దామనుకుంటున్నావు ?"
సుధీర్  :" ఏముంది వెరీ సింపుల్. ఆమె నా ప్రపోజల్ ను యాక్సెప్ట్ చేసిందనుకో నా అదృష్టం గా భావిస్తాను. ఒక వేళ రిజెక్ట్ చేసిందనుకో ఏప్రిల్ ఫూల్ అని అనేసి ఎంచక్కా వచ్చేస్తాను"
4. టిటి అడిగితే రెండు జేబుల నుండి రెండు టికెట్లు తీసి చూపించాడు వెంగళప్ప.
"ఆశ్చర్యం గా వుంది. రెండు టికెట్లు ఎందుకు కొన్నావు?" అడిగాడు టి టి
" ఒకటి పోతే ఇంకొకటి వుంటుందని జాగ్రత్త కోసం కొన్నాను" చెప్పాడు వెంగళప్ప.
" మరి రెండూ పోతే అప్పుడు ఏం చేస్తావు?" కుతూహలంగా అడిగాడు టి టి
" నేనేమైనా దద్దమ్మను అనుకున్నావా? నా దగ్గర మంత్లీ పాస్ వుంది గా. దానిని నీకు చూపిస్తాను" గర్వంగా చెప్పాడు వెంగళప్ప.  
 
కామెంట్‌లు
Popular posts
ఎఱ్ఱాప్రగడ . .; - డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై
చిత్రం
రక్తసంబంధం కన్నా గుణ సంబంధం గొప్పది!!: - కె ఎస్ అనంతాచార్య కరీంనగర్ -9441195765
చిత్రం
అణిమ - మహిమ -------------------------------- అష్ట సిద్ధులు అనే మాట ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం. ఇంతకూ ఆ అష్ట సిద్ధులు ఏంటో తెలుసా? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - ఈ ఎనిమిదింఃఇనీ అష్టసిద్ధులు అంటారు. ఈ ఎనిమిది సిద్ధులు సామాన్యమైనవి కావు. వేటి ప్రానాన్యం వాటివే. వాటిలో మొదటిదైన అణిమ అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేసుకోవడం. మహిమ అంటేనేమో శరీరాన్ని పెద్దదిగా చేసుకోవడం. ఈ రెండింటినీ సాధించిన వాడు ఆంజనేయుడు. సీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఈ రెండు సిద్ఝులనూ ఆచరించి చూపాడు. లంకలో ప్రవేశించినప్పుడు, సూర్యాస్తమయం తర్వాత పిల్లి అంత చిన్నవాడిలా మారిపోయి ఆశ్చర్యకరమైన రూపాన్ని పొందాడు. వృషదంశకమంటే పిల్లి. అలాగే, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సముద్రాన్ని దాటేటప్పుడు మహిమ సిద్ధిని ప్రదర్శించాడు. ఆంజనేయుడి బలపరాక్రమాలను తెలుసుకోవాలనుకున్న దేవతలు దక్షప్రజాపతి కుమార్తె అయిన క్రోధవశకు జన్మించిన నాగమాత సురసాదేవిని కోరారు. అంతట సురసాదేవి రాక్షస దేహం ధరించి "దేవతలు నిన్ను ఆహారంగా సమర్పించారు. నా నోటిలోకి ప్రవేశించు" అని అడుగుతుంది. అప్పుడు 80 యోజనాల భారీకాయుడైన హనుమ కోసం 90 యోజనాల నోరు తెరిచిన ఆ సురసాదేవి నోట్లోకి ప్రవేశించి, ఆమె నోరు మూసే లోపల, బొటన వేలడంతవాడై బయటకు వచ్చేశాడు. అదీ హనుమంతుడి శక్తి!! - యామిజాల జగదీశ్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం