సిద్దిపేటలో సప్తశతి పుస్తకావిష్కరణ 26న

  సిద్దిపేట   ప్రెస్ క్లబ్ లో ఈనెల 26 శనివారం రోజున ఉదయం 10 గంటలకుకవి వంగరి వెంకటేశం రచించిన సప్తశతి మణిపూసలు పుస్తకావిష్కరణ  కలదని బాలసాహితీ వేత్త ఉండ్రాళ్ళ రాజేశం అన్నారు. అన్ని పూసల కవిత దినోత్సవం ఏడవ వార్షికోత్సవం సందర్భంగా  ఏడు వందల మణిపూసలు పుస్తకావిష్కరణ జరగడం సంతోషమన్నారు. ముఖ్యఅతిథిగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ జల్లిపల్లి బ్రహ్మం అతిథులుగా అడ్డగూడి ఉమాదేవి, ఆశీర్వాదం, వడిచర్ల సత్యం, మచ్చ అనురాధ, దోమకొండ అంజయ్య, నూనే రాజయ్య, ఐత చంద్రయ్య, పట్నం భూపాల్, సంగీతం నరసింహారావు, కుందారం యాదగిరి, సిహెచ్ రాజు తదితరులు హాజరవుతారని కవులు, రచయితలు, సాహితీ ప్రియులు పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు.
కామెంట్‌లు