వేసవి సెలవులు: - పి. రిషిక-9వ తరగతి -జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లింగన్నపేట-జిల్లా: రాజన్న సిరిసిల్ల

 మాకు వేసవి సెలవులు ఏప్రిల్ 24 నుండి  ప్రారంభం అయినాయి. వేసవి సెలవులలో నేను అమ్మమ్మ వాళ్ళ ఊరికి దేవుని పల్లికి పండగ కోసం వెళ్లాను. అక్కడ వారం రోజులపాటు గడిపాను. పండగ ఆనందంగా సంతోషంగా జరుపుకున్నాము. మా అమ్మమ్మ వాళ్లు వ్యవసాయం చేస్తారు. అప్పుడు వేసవికాలం కాబట్టి పంట చేతికి వచ్చే సమయం. వాళ్లకి రెండు ఎకరాల దాకా పొలం ఉన్నది.   నేను అది చూడడం కోసం పొలం దగ్గరికి వెళ్ళాను. అక్కడ పొలంలో మేము అన్నము తిన్నాము చాలా ఆనందంగా అనిపించింది ఆ ప్రశాంతమైన స్థలంలో భోజనం చేసినందుకు.
అప్పుడు వడ్లను ఎండ పోశారు కానీ ఆ సమయంలో వర్షాలు పడ్డాయి. వాటి వల్ల వాళ్లకి చాలా ఇబ్బందులు కలిగాయి. అట్ల పంటలు చేతికి వచ్చేలోగానే వర్షాలు పడ్డాయి వాటి వల్ల కొన్ని నష్టాలు కూడా కలిగాయి. అప్పుడు నాకు ఒక కొత్త విషయం అర్థమైంది ఏమిటంటే పర్యావరణం కూడా రైతులకు  సహకరించకపోతే  అతివృష్టి అనావృష్టి కారణాలవల్ల చాలా నష్టాలు కలుగుతాయి. అప్పుడు ఆ రైతులు ఎంత బాధ పడతారో అనేది నేను గమనించాను. వాళ్లు ఆరు నెలల పాటు చేసిన కష్టానికి ఫలితం లేకుండా నష్టాలు జరిగితే ఎంత బాధని అధిగమించుతారు అనేది నాకు చాలా అర్థమయింది. ఇప్పటి నుంచైనా అన్నాన్ని వృధా చెయ్యొద్దు అనే విషయం తెలుసుకున్నాను. మనము దగ్గరుండి వెళ్లి చూస్తేనే తెలుస్తుంది కానీ పూర్తిగా తెలియదు ఆ పని చేస్తేనే దాని విలువ మనకి పూర్తిగా తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు చాలా కష్టపడతారు అనే విషయం గ్రహించాను.
వారం రోజుల తరువాత నేను మా ఊరికి వచ్చాను. వేసవి సెలవులే కాబట్టి నేను మా స్నేహితులతో సరదాగా గడిపాను. మా పాఠశాల పేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లింగన్నపేట. మా తెలుగు ఉపాధ్యాయులు రోజుకో పద్యం అనే వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశారు.ఆ గ్రూపులో రోజు ఒక అంశం   ఇచ్చేవారు. దానిపై నేను కొన్ని ఆటవెలది పద్యాలు, కవితలు మరియు ఆత్మకథలు రాశాను. 
ఇలా ఇవి రాయడం వల్ల నాకు చాలా ఆలోచించే తత్వం పెరిగింది . అంశానికి తగినట్టుగా రాయాలని పట్టుదలతో రాశాను వాటిలో రెండు పద్యాలు: 
  
అంశం: చెట్టు 
ఆట వెలది 
 
పూలు పండ్ల నిచ్చె పుణ్యమూర్తి తరువు
చెట్టు నీడనిచ్చి సేద దీర్చు
ప్రాణవాయువిచ్చి ప్రాణాలు గా పాడి
అమ్మ వలెను చెట్టు ఆదరించు
అంశం:పుస్తకం
 ఆటవెలది
పుస్తకంబు నెపుడు పూర్తిగా జదువుము
పట్టుబట్టి చదువు పదును గాను 
చదివితేను గలుగు చక్కని జ్ఞానంబు 
మంచిగా జదివిన మార్పు గలుగు
ఇవే కాకుండా ఇంకా చాలా పద్యాలు మరియు కవితలు రాశాను. ఇంకా వేసవి సెలవుల్లో నేను మా అమ్మ దగ్గర వంటలు చేయడం నేర్చుకున్నాను. కొన్ని నీతి కథలను విన్నాను. సెలవులలో నేను మా బంధువులతో మరియు స్నేహితులతో ఆహ్లాదంగా గడిపాను. అలాగే ఇంకా మా తరగతికి సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకున్నాను. బడిబాటలో భాగంగా మా గురువుతో కలిసి ఒక పాట పాడాను.
అట్లా కొన్ని రాస్తూ, ఆడుతూ, పాడుతూ, నేర్చుకుంటూ వేసవి సెలవులు చక్కగా గడిపాను. 
అన్నిటిని కష్టంగా భావించకుండా ఇష్టంగా అన్ని పనులు చేశాను. అట్లా ఇష్టంగా చేయడం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. 
ప్రతి ఒక్కటి నేర్చుకోవాలనే పట్టుదలతో నేను నేర్చుకునేలా ప్రయత్నించాను.  వేసవి సెలవులు కేవలం ఆడుకోవడానికి పరిమితం కాదు. ఇది  మనకు కొత్త విషయాలు నేర్చుకోవడానికి విలువైన సమయం. కాబట్టి నేను అలా అనుకొనే వేసవి సెలవుల్లో  కేవలం ఆటలే కాకుండా కొన్ని కొత్త విషయాలు నేర్చుకున్నాను. వేసవి సెలవులను నేను సద్వినియోగంగా ఉపయోగించుకున్నానని అనుకుంటున్నాను.

కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
చాలా చక్కగా వ్యాసం పద్యాలు రాశావు
తెలుగు అంతరించిపోతున్న సమయంలో ఉపాధ్యాయుడు ప్రోత్సాహానికి అభినందనలు
అజ్ఞాత చెప్పారు…
పి రిషిక నీవు వేసవి సెలవులలో గడిపిన టువంటి రోజులు మీ అమ్మమ్మ ఇంటి వద్ద జరిగిన విషయాలు చాలా బాగా వ్యాసం రాశావు మరియు మంచి మంచి పద్యాలు రాశావు నీకు శుభాశీస్సులు ఇంకా పై చదువులు బాగా చదివి మంచి ఉన్నతమైన స్థితికి వెళ్లాలని కోరుచున్నాను గాడ్ బ్లెస్స్ యు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
ఉరుదూ తెలుగు సాహిత్య వారధి డా. సామల సదాశివ; రామ్మోహన్ రావు తుమ్మూరి
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం